Wednesday, February 26, 2014

రాష్ట్ర విభ‌జ‌న‌-వామ‌ప‌క్ష ఉధ్య‌మ భ‌విష్య‌త్తు‌


త్వరలో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో గత 60 ఏళ్ళ వర్తమాన భారతదేశ చరిత్రలో మరో నూతనాధ్యాయం ప్రారంభం కానుంది. ఇదొక వాస్తవం. ఇప్పటి వరకు సమైక్యాంధ్రప్రదేశ్ అన్నా లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండు చేసినా అదంతా గడిచిన అధ్యాయం. విడివిడి రాష్ట్రాల్లో ప్రజల బాగోగులు, సమస్యలు, విధానాలు, రాజకీయాలు, ఉద్యమాలు ఎలా ఉండాలో నిర్దేశించుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, ప్రజా ఉద్యమాలపై ఉంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న భావన తెలంగాణా ప్రజల్లో బలంగా నాటుకుంది. టిఆర్యస్ దాన్ని అందిపుచ్చుకుంది. సిపిఐ(యం) మినహా మిగతా వామపక్షాలతో సహా అన్ని పార్టీలూ దీన్ని బలపరుస్తూ వచ్చాయి. తెలంగాణ ప్రజలతో ఘర్షణ పడకుండా తమ విధానాన్ని నచ్చజెప్పుకునే వైఖరిని సిపిఐ(యం) చేపట్టింది. రాష్ట్రం ఒక్కటిగా ఉండాలా లేక విడిపోవాలా అనే అజెండాను ప్రధానం చేయకుండా ప్రజలెదుర్కొనే రోజువారీ సమస్యలపై గళమెత్తడం ద్వారా ప్రజల చేతిని వదిలిపెట్టకుండా ప్రయాణించింది. ఏ చిన్న అవకాశం దొరికినా సిపిఐ(యం)ను ఒంటరి చేసి దెబ్బకొట్టాలనుకునే శక్తులకు అవకాశం ఇవ్వకుండా ప్రజలతో మమేకమవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఈ కృషిలో చాలా వరకు జయప్రదమైంది. అదే సమయంలో అవకాశవాదానికి తావివ్వకుండా, తన జాతీయ విధానాన్ని వదిలిపెట్టకుండా కొనసాగించింది. తెలంగాణలో పార్టీ, ప్రజా ఉద్యమాలు ఎంతో చైతన్యంతో కొన్ని చోట్ల నిర్బంధాన్ని, ఒంటరితనాన్ని కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాయి. తెలంగాణ శ్రామిక ప్రజలు తమ అనుభవం ద్వారా సిపిఐ(యం), తదితర వామపక్షాల అవసరాన్ని గుర్తించారు. ఫలితంగా గత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సిపిఐ(యం)ను వదిలిపెట్టకుండా ఆదరించారు.
సిపిఐ(యం) సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం గట్టిగా నిలబడింది. విభజన సానుకూలత ప్రకటించిన పార్టీలు సమైక్యత కోసం సీమాంద్ర ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ను ఉపయోగించుకునేందుకు అవకాశవాదంగా వ్యవహరించాయి. పార్టీలతో కలసి ఆందోళనలు నిర్వహించలేదు. ఇతర పార్టీల్లాగా సమైక్యతను ఒక ప్రాంతీయ సమస్యగా సిపిఐ(యం) చూడలేదు. దాన్నొక జాతీయ విధానంగా భావించింది. ఇతర పార్టీలు అవకాశవాదంతో ప్రాంతానికొక మాట చెబుతూ ప్రజల్ని మోసం చేస్తుండగా, సిపిఐ(యం) ఈ పార్టీల నుంచి విడగొట్టుకొని స్వతంత్రంగా నిలబడింది. అదే సమయంలో ఇరు ప్రాంతాల్లోనూ ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడింది. తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడకుండా ఉభయ ప్రాంతాల ప్రజలు కలసిమెలసి ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ విషయంలో సీమాంధ్రలో కూడా సిపిఐ(యం) తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నది. ఇక్కడ కూడా కొన్ని శక్తులు సిపిఐ(యం)ను ఒంటరి చేసి దెబ్బకొట్టాలన్న దుర్బుద్ధితో తప్పుడు ప్రచారం చేశాయి. పేరుకు సమైక్య జపం చేస్తూ ఆచరణలో ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకించకుండా మౌనం దాల్చిందని దుష్ప్రచారం చేశాయి. ఆఖరి నిముషంలో తెలంగాణపై గోడ మీద పిల్లివాటం తీసుకున్న బిజెపి కూడా సిపిఐ(యం)పై విమర్శలు చేసింది. అవకాశవాదులతో చేయి కలిపి బూర్జువా పార్టీల దుర్మార్గపు ఎత్తుగడలకు తోడ్పడకపోవడమే సిపిఐ(యం) చేసిన పాపం. పార్లమెంటు ఉభయ సభల్లో మిగిలిన పార్టీల మోసపూరిత అవకాశవాద వైఖరి బట్టబయలైంది. సిపిఐ(యం) నిబద్ధత వెల్లడైంది. ఈ రెండు వైఖరుల మధ్య తేడాను ప్రజలు కూడా గుర్తించారు. సిపిఐ(యం) శ్రామిక ప్రజల ఐక్యత దృష్ట్యా భాషా ప్రయుక్త రాష్ట్రాలు చీలకూడదన్న సూత్రబద్ధమైన వైఖరిని తీసుకుంది. దీనికి భిన్నంగా మిగతా పార్టీలు ప్రజల మనోభావాలను తమ రాజకీయ ప్రయోజనాలను ఈడేర్చుకోవడానికి ఉపయోగించుకున్నాయి. కొంతమంది నాయకులు హైదరాబాద్ కోసం, తమ స్వంత పెట్టుబడుల రక్షణ కోసం, పదవుల కోసం పాకులాడారు. ఈ రెండూ పరస్పర విరుద్ధమైన వైఖరులు. ఇలా రెండు ప్రాంతాల్లోనూ సిపిఐ(యం) విశిష్టత వెల్లడైంది. శ్రామిక వర్గ దృక్పథంతో తీసుకున్న సూత్రబద్ధ వైఖరికిది నిదర్శనం.
గత నాలుగేళ్ళలో ప్రజా సమస్యలు అడుగున పడ్డాయి. ప్రజలపై రకరకాల భారాలు పడుతున్నా ఎవరూ గళమెత్తలేదు. ఈ గందరగోళం మధ్య పాలకులు ఇష్టానుసారం భారాలు మోపారు. శాసనసభల్లో ప్రజల ప్రస్తావన లేదు. ఇరు ప్రాంతాల నాయకులు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడానికే సరిపోయింది. రోజుల తరబడి సమావేశాలు జరగలేదు. ప్రభుత్వం పాలన లేదు. ప్రజల మానాన ప్రజల్ని వదిలేసింది. కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఇలా వివిధ వర్గాలు, తరగతుల ప్రజానీకం దిక్కులేనివారయ్యారు. ఈ పరిస్థితులలో వారి తరపున నిలబడింది సిపిఐ(యం). ఆఖరికి రాష్ట్ర విభజన జరుగుతున్న రోజుల్లో కూడా ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించింది. మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు ఇలా అనేక తరగతుల ప్రజలు తమ తమ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తే వారికి సంఘీభావంగా సిపిఐ(యం) నిలబడి ఒక శ్రామికవర్గ పార్టీగా తన బాధ్యతలను నిర్వహించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయమయ్యింది. ఒక ప్రాంతం ప్రజలు సంతోషంగా ఉంటే మరో ప్రాంతం ప్రజలు గాయపడి ఉన్నారు. విభజన ద్వారా నష్టపోయామన్న భావన సీమాంధ్ర ప్రజల్లో బలంగా నాటుకుంది. రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణలో సైతం సమస్యలు పరిష్కారమైనట్లు భావించలేం. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కొన్ని కొత్త సమస్యలు ఉద్భవించే అవకాశం ఉంది. పంపకాల దగ్గర ఉద్రేకాలొస్తాయి. ఇరు ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం వీటిని మరింతగా రెచ్చగొడుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర మధ్యే కాదు ఆయా ప్రాంతాల్లో అంతర్గతంగా కూడా వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే సీమాంధ్ర రాజధాని పేరుతో సరికొత్త వివాదానికి తెరలేచింది. ప్రజలు అప్రమతతో ఉండి వీరి బుట్టలో పడకుండా జాగ్రత్త వహించాలి. ప్రజల మధ్య తిరిగి విద్వేషాలు రగలకుండా చూడాల్సిన బాధ్యత వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమంపై ఉంది.
రెండు రాష్ట్రాల ఏర్పాటుతో నూతన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ సమీకరణాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా వామపక్ష ఉద్యమం కొత్త సవాళ్లను ఎదుర్కోనుంది. తెలంగాణలో ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని బలపడాలని బిజెపి, ఇతర మతోన్మాద శక్తులు ఉవ్విళ్లూరుతున్నాయి. టిఆర్యస్, కాంగ్రెసులు విలీనమైనా, పొత్తు పెట్టుకున్నా దానికి ప్రత్యామ్నాయంగా తామే ముందుకు రావాలని సంఘపరివారం వ్యూహంగా ఉంది. టిడిపి ఈ శక్తులతో పొత్తుకు ఉవ్విళ్లూరుతోంది. తెలుగుదేశం అనుసరించిన అవకాశవాద వైఖరి మూలంగా రెండు ప్రాంతాల్లోనూ దాని విశ్వసనీయత దెబ్బతిన్నది. ఆ రీత్యా తెలంగాణలో బిజెపి అవసరం టిడిపికి ఉంది. బిజెపి ఆడిన నాటకం వల్ల సీమాంధ్రలో వారిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీన్నుంచి బయటపడటానికి తెలుగుదేశంతో పొత్తు కోరుకుంటోంది. ఆ రీత్యా రెండు ప్రాంతాల్లోనూ టిడిపి, బిజెపిల బంధం కొనసాగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని బిజెపి తనకనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. మతోన్మాదానికి తోడుగా మోడీ పేరుతో వెనుకబడిన తరగతులను జోడించి బలపడాలని చూస్తోంది. ఈ తరగతులలో తన ఉనికి దెబ్బతినకుండా చూసుకోవడానికి బిజెపితో చెలిమి చేయాలని తెలుగుదేశం అనుకుంటోంది. ఇది తక్షణం కొన్ని ఫలితాలనిచ్చినా దీర్ఘకాలంలో అది తెలుగుదేశం పాలిట మరణశాసనంగా మారుతుంది. తెలంగాణలో బిజెపిని చూపెట్టి ముస్లిం ఛాందస సంస్థలు కూడా బలపడే అవకాశాలున్నాయి. ప్రత్యేక తెలంగాణ నిజాం వారసురాలని అదే పనిగా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు ప్రమాదాలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యేక తెలంగాణ కోరుకున్న కొందరు అభ్యుదయవాదులు, సంస్థలు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. తక్షణం ఉద్యోగాలు దొరుకుతాయన్న భ్రమల్లో తెలంగాణా నిరుద్యోగ యువత ఉంది. రానున్న కాలంలో ఉపాధి అవకాశాలు పెరక్కుంటే తద్వారా వచ్చే అసంతృప్తి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఊహించడం కష్టమేమీ కాదు. వామపక్షాలు బలపడితేనే ఇలాంటి సవాళ్లను ఎదుర్కోగవడం సాధ్యమన్న వాస్తవాన్ని అభ్యుదయశక్తులు గుర్తించాలి.
అలాగే సీమాంధ్రలో కొత్తగా కుల సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. అగ్రకులాలకు చెందిన ఆధిపత్యవర్గాలు తమ ప్రభావాన్ని కాపాడుకోవడానికి వివిధ పార్టీల వెనుక సమీకృతమవుతున్నాయి. కొన్ని పార్టీలు తమ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి కుల సమీకరణలను రెచ్చగొడుతున్నాయి. నాయకులటూ, ఇటూ జంప్ చేస్తున్నారు. ఎవరు ఏ పార్టీతో పోతారో అస్పష్టంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తన అనుచరులను పోగేసుకుని కొత్త పార్టీకి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెసు దాదాపు తుడిచిపెట్టుకొని పోయిందని వివిధ సర్వేల సమాచారం. ఆయా పార్టీలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి దళిత, గిరిజన, బలహీనవర్గాలను కూడా చీలుస్తున్నాయి. అదే ప్రజా ఉద్యమాల ప్రగతికి ప్రతిబంధకంగా మారుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏదో ఒక మోతాదులో ప్రభావం చూపిన సామాజిక అస్తిత్వ ఉద్యమాలు ప్రాంతీయోద్యమాలతో మమేకమై అగ్రకులాధిపత్యానికి తోడ్పడ్డాయి. వారిలో ఉన్న ప్రజాస్వామిక శక్తుల ప్రాబల్యం తగ్గుతోంది. ప్రభుత్వాలు, పాలకపక్షాల అండతో ఎదగాలన్న శక్తులు పుంజుకుంటున్నాయి. ఇది సామాజికోద్యమాలను బలహీనపరిచే ప్రక్రియ. ఈ మూలమలుపులో సామాజికోద్యమాలు ఎవరితో చేరాలి? పాలకవర్గాలతోనా? లేక వామపక్ష, ప్రజాతంత్రశక్తులతోనా? ప్రభుత్వాల అండ లేకుండా ముందుకు పోలేమన్న భావన కొందరిలో ఉంది. ఈ తరహా ఆలోచన సామాజికోద్యమాలను బలహీనపరుస్తుంది. తక్షణ ఎన్నికల ఎత్తుగడలతో నిమిత్తం లేకుండా అస్తిత్వ ఉద్యమాలు వామపక్షాలతో కలసి పని చేస్తే ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో కూడా ప్రజాతంత్ర ఉద్యమం బలపడుతుంది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాల సమస్య పరిష్కారమైనట్లు కాదు. రెండు రాష్ట్రాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయి. రానున్న ఎన్నికల్లో పాలక పార్టీలు ఎవరు గెలిచినా ఈ అసమానతలు పెరుగుతాయే తప్ప తగ్గవు. వాటికి తోడు ఆర్థిక, సామాజిక అసమానతలు ఉండనే ఉన్నాయి. అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలను కొనసాగించడమే వామపక్షాల ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వామపక్ష పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో వాటికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటానికి, సీమాంధ్రలో జమీందారీ వ్యతిరేక పోరాటాలకు వారసురాలైన కమ్యూనిస్టు ఉద్యమానికి మాత్రమే ఈ ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై పోరాడే చిత్తశుద్ధి ఉంది. దానికి తగిన ప్రణాళికలున్నాయి. ప్రజల్లో విశ్వసనీయత ఉన్న పార్టీలు కూడా ఇవే. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఐక్య ఉద్యమ కార్యాచరణతోనే రెండు రాష్ట్రాల్లో కుల, మత, విచ్ఛిన్నకర శక్తులు బలపడకుండా పురోగమించగల్గుతాయి. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు, వివిధ తరగతుల సామాజిక ఉద్యమాలు ఏకతాటిపైకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. ఇది మాత్రమే రెండు రాష్ట్రాల్లోని ప్రజల ఐక్యతకు, వారి భవిష్యత్తుకు హామీ ఇవ్వగలుగుతుంది. అందుకోసం రెండు రాష్ట్రాల్లోనూ బలమైన ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత వామపక్ష శక్తులు, పార్టీలపై ఉంది.
(వ్యాసకర్త సిపిఐ(యం) కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు) 
వి శ్రీనివాసరావు

Thursday, February 20, 2014

పిరికి పెంగ్విన్

హిందూయిజం. ఈ పేరు బ్రిటిష్‌వాళ్లు పెట్టినప్పటికీ, ఈ పేరును ఆర్‌.ఎస్‌.ఎస్‌., భారతీయ జనతాపార్టీలు భ్రష్టు పట్టించినప్పటికీ హిందూదేశమని ఒకప్పుడు పిలవబడిన మన దేశంలో బహుళ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఎన్నో జాతులు, రీతులు, సంప్రదాయాలు, లౌకిక వ్యవహారాలు ఒకదానితో ఒకటి సహజీవనం చేస్తూ, ఎవరి ప్రత్యేకతలను వాళ్లు కాపాడుకుంటూ చాలా సంవత్సరాల పాటు ఒక జీవన విధానాన్ని అలవరుచుకున్నారు. పొరుగునున్న మతాలు ఇక్కడి కొచ్చాయి. ఇక్కడి మతాచారాలు పొరుగు దేశాలకు వెళ్లాయి. అలాంటి జీవన విధానానికి బ్రిటిష్‌ వాళ్ళు హిందూయిజం హిందూమతం అని పేరు పెట్టి సగం చిచ్చు పెట్టారు. మిగిలిన సగం మన హిందూత్వవాదులు మంటపెట్టారు. ఆ మంటను చల్లారనివ్వకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక కట్టె పేడు చేరుస్తున్నారు. దానిని చూసి భయపడే స్థాయికి మనం దిగజారాం.

 మనమే కాదు పెంగ్విన్‌ ప్రచురణాలయం - ప్రపంచంలోనే అతి పెద్ద ప్రచురణాలయం ఏదో చిన్న సంస్థ కోర్టులో వేసిన కేసుకి భయపడి, తను ప్రచురించిన పుస్తకాన్ని మనదేశం మార్కెట్‌లో లేకుండా నాశనం చేసింది. ఏమిటా పుస్తకం? హిందూస్‌: ఎన్‌ ఆల్టర్నేటివ్‌ హిస్టరి. ఎవరు రాసింది? వెండీ డానిగర్‌. ఆమె చరిత్రకారిణి. పైగా భారతీయ చరిత్ర మీద ప్రత్యేక పరిశోధన చేసింది. మనదేశం గురించి ఎందరో చరిత్రకారులు ఎన్నో పుస్తకాలు రాశారు. వాటిలోని సత్యాసత్యాల గురించి చర్చలు జరుగుతాయి. జరగాలి. పరిశోధనకు చర్చ, ఆధార నిరూపణ, విశ్లేషణ... ఇవి ప్రాణం. ఈ చర్చకు ఆస్కారం లేకుండా పుస్తకాలే ప్రచురించకూడదనే అధికారం ఎవరికైనా ఎలా ఉంటుంది? ఆ పుస్తకం నాలుగేళ్ళ నుంచీ ఎందరో చదివారు. ఇవాళ ఎవరికో ఏదో అభ్యంతరం వచ్చి కేసు పెడితే పెంగ్విన్‌ వంటి సంస్థ అంత భయపడిందెందుకు? దేశంలో అంత భయపెట్టే సాంస్కృతిక ఫాసిజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతోంది. పెంగ్విన్‌ ''వీళ్ళ''తో పెట్టుకోదల్చుకోలేదు. తన వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయనుకుంది. ఒక ప్రచురణాలయం, పుస్తకాల మీద బతికే సంస్థ, మేధావులు, రచయితల ఆలోచనలను సొమ్ము చేసుకుని వృద్ధి చెందిన సంస్థ. పుస్తకాలను, ఆలోచనలను, భిన్నత్వాన్ని ప్రజాస్వామ్య సంస్కృతిని అతి పిరికితనంతో తగలబెట్టింది.

 పెంగ్విన్‌ పిరికితనం ఈ పుస్తకానికి పరిమితం కాదు. పెంగ్విన్‌ తన పిరికితనంతో, బలహీనతతో ఫాసిస్టులకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది. భారతదేశ ప్రజాస్వామ్య శక్తులను పరోక్షంగా తక్కువ చేసింది. మనదేశంలో ప్రజాస్వామ్యశక్తులు ఫాసిజాన్ని ఎదుర్కోవటంలో చూపవలసిన ధైర్య సాహసాలు చూపటం లేదని చెప్పింది. మన ప్రభుత్వం కూడా ఫాసిస్టు శక్తులకే అనుకూలంగా ఉందనీ, కోర్టులలో ఫాసిస్టులకు అనుకూలమైన తీర్పులు వస్తున్నాయనీ పెంగ్విన్‌ గమనించినట్లుంది. అందుకే ఒక వ్యక్తి వేసిన కేసును తను కోర్టులోనే సవాలు చేయాలన్న నిర్ణయం తీసుకోలేకపోయింది. తన రచయితల పక్షాన తను నిలబడే నైతిక బలాన్ని చూపించలేకపోయింది.
సరే- తను తీసుకుకున్న నిర్ణయం ఫలితాలను ఇవాళ కాకపోతే రేపు ఆ సంస్థ రుచి చూస్తుంది. 

కానీ మన దేశంలో ప్రజాస్వామిక విలువల సంగతేమిటి? మొన్న, అంటే ఫిబ్రవరి 14వ తారీఖున త్రిచూర్‌లో బిలాల్‌ అనే కాశ్మీర్‌ ముస్లిం దర్శకుడు తీసిన డాక్యుమెంటరీ చిత్రం ప్రదర్శిస్తున్నామని, వారం రోజుల పాటు చిత్రోత్సవం నిర్వహించిన విబ్‌గోర్‌ సంస్థవారు ప్రకటించారు. మేం ఆ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో మూడు రోజుల పాటు పాల్గొన్నాం. 12వ తారీఖు నుంచే భారతీయ జనతా పార్టీ వాళ్లు ఆ సినిమా ప్రదర్శించటానికి వీలులేదనీ, ప్రదర్శించనివ్వమనీ హెచ్చరికలు పంపారు. ఆ సినిమాలో విషయం ఏమిటనే సంగతి తర్వాత చూద్దాం. ఏ సినిమా ప్రదర్శించాలో, ఏ సినిమా ప్రదర్శించకూడదో చెప్పటానికి వాళ్ళెవరు? వాళ్లకున్న అధికారం ఏమిటి? రచయితలను, కళాకారులను నిరోధించే శాసనకర్తలుగా తమను తాము ప్రకటించుకునే ధైర్యం వీళ్ల కెక్కడి నుంచి వచ్చింది? దీపా మెహతా 'వాటర్‌' సినిమా వారణాసిలో తీయలేక శ్రీలంకలో తీసినప్పుడే ఈ శాసనకర్తలు బలం పుంజుకోలేదా? ఆ రోజు మనందరం... ప్రజాస్వామిక వాదులమనీ, లౌకిక వాదులమనీ చెప్పుకునే మనందరం విఫలమయ్యాం. అంతకు ముందే, బాబ్రీ మసీదు ఘటన నాటికే విఫలమయ్యాం. మన వైఫల్యమే వాళ్ళ విజయమవుతోంది, ప్రతిసారీ! ఎందుకు విఫలమవుతున్నామని ఇవాళైనా ఆలోచించుకోకపోతే ఆలోచించటానికి ఎవరూ మిగలరు. ఇది నిరాశ కాదు, ఆవేదన. 

బిలాల్‌ అనే ఆ దర్శకుడు తన సినిమా ప్రదర్శిస్తారని కాశ్మీరు నుంచి కేరళ వచ్చాడు. ఈ సంగతి తెలిసి చాలా అమాయకంగా, ''నా సినిమాలో రాజకీయాలు లేవు. నాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. ఎందుకిలా జరుగుతోంది'' అని అడిగాడు. ఆ సినిమా, కాశ్మీర్‌లో భద్రతా బలగాలు పాల్పడే అఘాయిత్యాల గురించి. కాశ్మీరులోని ఒక గ్రామంలోని స్త్రీలందరిపైనా భద్రతా బలగాలు అత్యాచారం చేశాయి. ఆ స్త్రీలతోనే ఆ వాస్తవాన్ని చెప్పించాడు. ప్రభుత్వం దాచేయదల్చుకున్న వాస్తవాలను విప్పి చెప్పాడు. ఆ సినిమాను సెన్సార్‌బోర్డు చూసింది. ప్రదర్శనయోగ్యమని సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఐనాసరే, హిందూత్వశక్తులు ఆ సినిమా వెంటపడి, ఆ సినిమాను ప్రదర్శించనివ్వటం లేదు. భద్రతాదళాల గురించి వ్యతిరేకంగా ఎవరేం చెప్పినా హిందువుల పరువు, దేశ ప్రతిష్ట దెబ్బతింటాయట! ఎంత ఘోరం! రక్షించవలసినవాళ్ళే అత్యాచారాలు చేస్తే ఎవరి పరువు ప్రతిష్టలూ పోవు. దేశ గౌరవం సురక్షితంగా ఉంటుంది. కానీ, ఆ స్త్రీలు మాకిలా జరిగిందని చెబితే దేశానికి ప్రమాదం ముంచుకొస్తుంది. ఇదెక్కడి న్యాయం? దీని తరఫున మాట్లాడేవాళ్ళెవరు

కేరళలో కొందరు దర్శకులు, రచయితలు దీనిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. బి.జె.పి వాళ్ళు ఎలా ఆపుతారో చూస్తామన్నారు. సినిమా ప్రదర్శన జరిగి తీరుతుందని దర్శకుడికి హామీ ఇచ్చారు. 14వ తారీఖున ప్రదర్శన జరిగే చోటికి బిజెపి, ఆర్‌.ఎస్‌.ఎస్‌, వి.హెచ్‌.పి. మనుషులు వచ్చి గొడవ చేశారు. వీళ్ళూ వెనక్కు తగ్గలేదు. కొట్లాట జరిగింది. ఒకరిద్దరికి దెబ్బలు తగిలాయి. గ్లాసులు పగిలాయి. కుర్చీలు విరిగాయి. చివరకు పోలీసులు వచ్చి బిజెపి వాళ్లను అక్కడి నుంచి వెనక్కు పంపారు. కార్యక్రమం కొనసాగింది. భావ ప్రకటనా స్వేచ్ఛమీద నమ్మకమున్న కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు ఉండటం వల్ల గొడవ జరిగినా కార్యక్రమం కొనసాగింది. ముందే భయపడి ప్రదర్శన ఆపేస్తే అంతకంటే పిరికితనం ఏముంటుంది? 

దేశంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. కానీ ఈ గొడవ చాలా విలువైనది. మనం గొంతెత్తటానికి, పాటలోనో, కవిత్వంలోనో, సినిమాలోనో మన ఆలోచనలను, దేశంలోని యధార్థస్థితిని చెప్పటానికి మనం భయపడకుండా గొడవ పడాలి. ఆ గొడవ చెయ్యకపోతే, ఒక పుస్తకం లేకపోతే ప్రపంచం మునిగిపోదనుకుంటే, ఒక పాట పాడకపోతే ప్రజలకేం ప్రమాదం రాదనుకుంటే, ఒక సినిమా తియ్యకపోతే, ప్రదర్శించకపోతే, ముంచుకు పోయిందేమనుకుంటే ఆ ఉదాసీనత చివరకు ప్రజలందరి గొంతులనూ నొక్కేస్తుంది. అందుకే వెండీ డానిగర్‌ పుస్తకం మీద కేసు వేసిన వ్యక్తి మీదకంటే పెంగ్విన్‌ మీద ఎక్కువ కోపం రావాలి మనకు. ఫాసిస్టు శక్తులు బలపడుతున్నాయనీ మనకు తెలుసు. ఢిల్లీ సింహాసనం కోసం ఆరాటపడుతున్నాయనీ తెలుసు. సింహాసనాల సంగతి ప్రజలు చూస్తారు. ప్రజల ప్రాథమిక హక్కుల గురించి మనం చెయ్యవలసింది చాలా ఉంది. పెంగ్విన్‌ తగలబెట్టిన ఆ పుస్తకాన్ని అన్ని భారతీయ భాషలలోకీ అనువదించి, ప్రచురించగల ప్రచురణ సంస్థ ఏదైనా ఉందా? అలాంటి ప్రచురణాలయాలు, రచయితల పక్షాన నిలబడే ప్రచురణ సంస్థలు కావాలి మనకిప్పుడు. ఆ సంస్థలను కాపాడుకునే నిబద్ధత ఉన్న వ్యక్తులు పౌర సమాజానికి అత్యవసరం.
-
ఓల్గా, వసంత కన్నబిరాన్‌ 

(ప్రజాశక్తి 20.2.2014)

Tuesday, February 18, 2014

తెలుగు ప్రజల చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం ముగిసింది.

తెలుగు  ప్రజల  చరిత్రలో  ఒక  ముఖ్య  అధ్యాయం ముగిసింది. తెలుగు  ప్రజలు  ఐక్య  జాతిగా  అభివృద్ధి  అయ్యే  అవకాశం పాలక  వర్గాల  వైఫల్యాల  వలన అంతమైంది. రెండు  రాష్ట్రాల్లోనూ    ప్రపంచ  బ్యాంకు  ఆదేశాలే అమలవుతాయి. సామాన్య ప్రజల  సమస్యలు  పరిష్కారం  కావు. సిపి ఎం  రెండు  రాష్ట్రాల్లోనూ  ప్రజల ప్రయోజనాల  కోసం  పోరాడుతుంది. రెండు  రాష్ట్రాల  సమగ్ర  అభివృద్ధి కోసం పోరాడుతుంది. పాలక వర్గాలు సృష్టించిన  అపోహలను  అధిగమించి  ప్రజల  మధ్య  సామరస్య  వాతావరణాన్ని  పెంపొందించేందుకు కృషి  చేస్తుంది  ...సి పి ఎం  రాష్ట్ర  కార్యదర్శి   బి. వి. రాఘవులు  ప్రకటన  

Sent from http://bit.ly/f02wSy

ఒకే గూటి పక్షులు

చిదంబరం, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ, అరవింద కేజ్రీవాల్, అన్నా హజారే-అందరి సారాంశమూ ఒకటే. రోసిపోయిన పెట్టుబడిదారీ విధానానికి నగిషీలు చెక్కే వారే. అసలు సమస్యలు వదిలి కొసరునే అసలనే వాళ్ళే. ప్రజలలో సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఉద్రేకాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకునే వాళ్ళే. సామాన్యుని మోసం చేసే వాళ్ళే. కాకపోతే ఒకరి నిజస్వరూపం బయటపడి ప్రజలు వారిని నమ్మని పరిస్థితి వచ్చినప్పుడు తామేదో కొత్తగా ఉద్ధరిస్తామని మరొకరు ముందుకు వచ్చి తాత్కాలికముగా భ్రమలు సృష్టించటమే వీరి ప్రత్యేకత.

మధ్య యుగాలలో మన దేశ పాలకులు వాళ్ళు హిందువులయినా, ముస్లిములయినా, దేవాలయాలను వాటిలో వున్న సంపదను దోచుకునేందుకు ధ్వంసం చేసే వాళ్ళు. కాశ్మీరు రాజు హర్ష (క్రీ.శ.1089-1101) దేవాలయాలను ధ్వంసము చేసి వాటి సంపదను లూటీ చేసేందుకు “దేవోత్పతన నాయక” పేరుతో ఒక మంత్రిని నియమించాడు. పారమార పాలకుడు శుభతవర్మన్ (క్రీ.శ. 1193-1210)గుజరాత్ లో దభోయి, కాంబే లలో వున్న అనేక జైన మందిరాలను లూటీ చేశాడు. శైవ పాలకులు బౌద్ధ దేవాలయాలను ఆక్రమించుకున్నారు, జైన దేవాలయాలను ధ్వంసం చేసి జైనులను బలవంతముగా శైవులుగా మార్చారు. ముస్లిం పాలకులు కొందరు  హిందూ దేవాలయాలను లూటీ చేశారు.

ఇదే విధముగా ఇప్పటి పాలకులు సరళీకరణ విధానాలలో భాగముగా ఆధునిక దేవాలయాలని నెహ్రూ వర్ణించిన ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసి వాటి సంపదను స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు కొల్లగొట్టేందుకు అనుమతిస్తున్నారు. ఇందుకోసం ఉద్దేశ పూర్వకముగా ప్రభుత్వరంగ సంస్థలను సక్రమముగా పని చేయనీయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమములోనే ఆనాటి వాజపాయీ బి జె పి ప్రభుత్వము డిజిన్వెస్ట్మెంటు శాఖను సృష్టించింది. వి ఎస్ ఎన్ ఎల్ ను టాటాలకు చవుకగా అమ్మింది. ముంబయిలో వున్న రెండు సెంటార్ హోటల్సును, బాల్కోను చవుకగా అమ్మింది. కాంగ్రెస్ నాయకత్వములో అధికారములోకి వచ్చిన మొదటి యు పి ఏ ప్రభుత్వము వామాపక్షాల మద్దతు పై ఆధారపడిన కాలములో డిజిన్వేస్టుమెంటు శాఖను రద్దు చేసి పెద్దగా డిజిన్వేస్టుమెంటును అమలు చేయనప్పటికి , రెండవ యు పి ఏ ప్రభుత్వము వామ పక్షాల మద్దతు అవసరము లేకుండా ఏర్పడినందున డిజిన్వేస్టుమెంటు ప్రక్రియను వేగవంతం చేసింది. మన్మోహన్ సింగు, చిదంబరం లు ప్రతి బడ్జెటులోనూ డిజిన్వేస్టుమెంటు ద్వారా వేల కోట్ల రూపాయలను ప్రభుత్వము సంపాదించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. 2012-13 సంవత్సరపు బడ్జెట్ లో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా రు.30,000 కోట్లు సంపాదించాలని ఆర్థిక మంత్రి చిదంబరం నిర్ణయించగా ఫిబ్రవరి 10, 2014 నాటికి ఋ. 22000 కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే 31 మార్చి నాటికి మొత్తం రు.27000 కోట్లు వస్తాయని అంచనా. 2014-15 లో డిజిన్వేస్టుమెంటు ద్వారా ప్రభుత్వము రు.36900 కోట్లు సంపాదించాలని 17.2.2014న పార్లమెంటులో ప్రవేశ పెట్టిన వోట్ ఆన్ ఎకవుంట్ లో ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు.

డిసిన్వేస్టుమెంటును ఈ విధముగా అమలు చేసిన ఎన్ డి ఎ ని ప్రజలు ఓడించారు. ఇప్పుడు యు పి ఏ కూడా ఓటమి ముంగిట వున్నది. అయితే పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రికలని శ్రీ శ్రీ వర్ణించిన పెట్టుబడిదారుల పత్రికలు మరియు టి వి చానల్సు కాబోయే ప్రధాన మంత్రిగా వర్ణిస్తున్న బి జె పి పార్టీకి చెందిన నరేంద్ర మోడీ,  బి జె పి కన్నా భిన్నమయిన వికాసపురుషుడన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ ఈ నరేంద్ర మోడీ గారి సిద్ధాంతమేమిటి? ఢిల్లీ లో 2013 ఎప్రీల్ 8న మీడియా సంస్థ  నెట్ వర్క్ 18 నిర్వహించిన “థింక్ ఇండియా డైలాగ్ సమావేశం లో తన సిద్ధాంతమేమిటో  నరేంద్ర మోడీ ప్రకటించారు.  ప్రయివేటీకరణ, డిజిన్వేస్టుమెంటు తన విధానమన్నారు. “It is my philosophy that government has no business doing business”(ప్రభుత్వము వ్యాపారములో వుండాల్సిన అవసరం లేదని నా తాత్విక దృక్పథం) అని ఆన్నారు.  ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయాలని దీని ఉద్దేశం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ విషయాములో మీ ఆలోచన ఏమిటి అని అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ వాజపాయీ నాయకత్వములో ఎన్ డి ఏ అనుసరించిన విధానమే తన విధానం అన్నారు(బాల్కో, ఐ పి సి ఎల్  ల డిజిన్వేస్తుమెంటు, బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పాటు). “We need a panel of neutral persons to consider the matter. Some PSUs are there for social service, some for commercial ends. I am for their privatization.” (ఈ విషయాన్ని పరిశీలించటానికి తటస్థ వ్యక్తులతో కూడిన ఒక ప్యానల్ ను నియమించాలి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు సేవలందించటానికి వున్నాయి, కొన్ని వర్తకం చేస్తున్నాయి. నేను ప్రయివేటీకరణకు అనుకూలం) అని అన్నారు. కేంద్రం ద్వారా కాకుండా అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విదేశాలతో నేరుగా సంబంధం పెట్టుకుని చేసే అవకాశం ఇవ్వాలన్నారు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విదేశీ డెస్కు వుండాలన్నారు. పి పి పి (పబ్లిక్ ప్రయివేట్ పార్టీసీపేషన్) ద్వారా అభివృద్ధి జరగాలన్నారు. ప్రయివేటు రంగానికి మరింత  ప్రాధాన్యతనివ్వాలని దీని ఉద్దేశం. యు పి ఏ కూడా దీనినే అమలు చేస్తున్నది. 

ఇప్పుడు కొత్తగా అరవింద కేజ్రీవాల్ కు అతని ఆం ఆద్మీ పార్టీకి మీడియాలో విశేష ప్రాధాన్యత లభిస్తున్నది. తానేదో అందరికన్నా అతీతుడనన్నట్లు అతను చెప్పుకుంటాడు. నిన్నటివరకూ అతని రంగు బయట పడలేదు. కానీ నిన్న(17.2.2014) ఢిల్లీ లో భారత బడా పెట్టుబడిదారుల సంఘం సి ఐ ఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) సమావేశం లో చేసిన ప్రసంగం లో అతను తన రంగును బయట పెట్టుకున్నాడు. “The government has no business to be in business, it should be left to the private sector”(ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. వ్యాపారాన్ని ప్రయివేటు రంగానికి వదిలి వేయాలి”) అని అన్నాడు.పోటీకి అవకాశం వున్న అన్నీ రంగాలలో ప్రయివేటీకరణ జరగాలన్నాడు. ఉదాహరణకు టెలికాం రంగం లో ఇప్పటికే వివిధ కంపెనీల మధ్య పోటీ జరుగుతున్నది కాబాట్టి ఈ రంగం లో బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు వుండాల్సిన అవసరం లేదని దీని అర్థం.  తాము కార్పొరేట్సుకు, ప్రయివేటీకరణకు వ్యతిరేకం కాదన్నాడు. ప్రభుత్వ రంగం లో ఉద్యోగాలు రావు కాబట్టి యువకులు తామే పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పించే వారుగా మారాలన్నాడు.కాలేజీలలో పాస్ అయిన తరువాత వారికి పరిశ్రమలను వ్యాపారాలను పెట్టటానికి తోడ్పడాలన్నారు. ఇందుకు వ్యాపారానికి అనుకూలమయిన వాతావరాణాన్ని నెలకొల్పాలన్నాడు.తాము ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికేగాని పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం కాదన్నాడు.ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటే ప్రభుత్వ సహాయముతో ప్రభుత్వ రంగాన్ని, సహజ  వనరులను దోచుకోటం. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానముగా  మారింది. కాబట్టి పెట్టుబడిదారీ విధానానికి అనుకూలం గాని ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అనుకూలం కాదనటం నయవంచన. వ్యవసాయాన్ని నియంత్రణలనుండి విముక్తం చేయాలన్నారు. దీని సారాంశం వ్యవసాయం లో రైతులకు అనుకూలముగా ప్రభుత్వ జోక్యం అవసరం లేదని, అంతా కార్పొరేట్సుకే అప్పజెప్పాలని.

ఇక అన్నా హజారే కథ మరింత విచిత్రంగా మారింది. కొండంత రాగం తీసి పిచ్చి కూత కుసినట్లు అవినీతిని వ్యతిరేకించే యోధుడిగా బయలుదేరి చివరికి అవినీతి ఆరోపణలలో మునిగి తేలుతున్న తృణమూల్ కాంగ్రెస్  (మమతా బెనర్జీ పార్టీ)  కు అనుకూలముగా ఎన్నికల ప్రచారం చేయటానికి సన్నద్ధవుతున్నాడు.

వీరందరి విధానాలలో తేడా ఏమీ లేదని ఇదంతా రుజువు చేస్తున్నది. అందరూ ప్రయివేటీకరణ విధానాలనే సమర్తిస్తున్నారు. అందరూ ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలది కాదంటున్నారు. యువతకి సాధికారత కల్పించే పేరుతో తమకి తామే పరిశ్రమాలు, వ్యాపారాలు పెట్టుకోవాలని అందుకు ప్రభుత్వాలు సహకరించాలని అంటున్నారు.అసలు సమస్య ప్రజల వద్ద కొనుగోలు శక్తి పెరగనందున ఆర్థిక వ్యవస్థ మాంద్యం లో పడటం కాగా దానికి పరిష్కారమేమితో చెప్పకుండా ఇటువంటి ఊరింపు కబుర్లు చెపుతున్నారు.

పెట్టుబడిదారీ విధానం ఫైనాన్సు పెట్టుబడిదారీ విధానముగా, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానముగా మారి అవినీతి మయముగా తయారయిన పరిస్థితులలో, ఈ వికృత రూపములో కాకుండా మరో రూపములో వుండటం దానికి సాధ్యం కాని పరిస్థితులలో దానికి నగిషీలు చేక్కాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే వాళ్ళుగానే మారతారు. ఒక వంక అవినీతి మయమయిన పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థిస్తూ మరొక వంక అవినీతి వ్యతిరేక పోరాటం చేయటం సాధ్యం కాదు. వ్యక్తిగతముగా ఎవరయినా అవినీతిపరులు కాకున్నా  వారు పెట్టుబడిదారీ విధానాపు సమర్థకులుగా వున్నంతవరకూ మన్ మోహన్ సింగ్ లాగానే అవినీతికర వ్యవస్థని సమర్థించక తప్పదు.

కాబట్టి ఎవరయితే పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకముగా వుంటూ సోషలిస్టు విధానాన్ని కోరుకుంటారో అందుకోసం నిజాయితీగా పోరాడుటారో వాళ్ళే అవినీతికి వ్యతిరేకముగా నిఖార్సుగా వుండగలరు. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర వామ పక్ష మంత్రివర్గాలు అవినీతికి అతీతముగా వుండటానికి కారణం ఇదే.  పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయం కోసం జరిగే పోరాటం తో సంబంధం లేకుండా  అవినీతి నిర్మూలన సాధ్యం కాదు. వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలు కలిసి పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం కోసం ఉద్యమిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది.











Friday, February 7, 2014

భారత దేశ స్థూల జాతీయ ఉత్పత్తి

2011-12లో భారత దేశ స్థూల జాతీయ ఉత్పత్తి విలువ రు. 2004-05 ధరల ప్రకారం రు. 52.5 లక్షల కోట్లు. 2012-13 లో భారత దేశ స్థూల జాతీయోత్పత్తి 2004-05 ధరల ప్రకారం రు. 54.8 లక్షల కోట్లు. 2011-12 తో పోలిస్తే 2012-13 లో పెరుగుదల  4.5 శాతం. 2010-11 తో పోలిస్తే 2011-12 లో 6.7 శాతం పెరుగుదల వున్నది. అంటే 2012-13 లో పెరుగుదల రేటు 6.7 నుండి 4.5 కు పడిపోయింది. ఇది ఆర్థిక మాంద్యానికి సంకేతం.
ఈ 4.5 శాతం పెరుగుదలలో అధిక భాగం ఫైనాన్సు, ఇన్సూరెన్సు, రియల్ ఎస్టేటు,మరియు బిజినెస్ సర్వీసుల రంగంలో(10.9 శాతం పెరుగుదల) జరుగింది. రవాణా,స్టోరేజి, కమ్యూనికేషన్స్ రంగాలలో పెరుగుదల 6 శాతం. కమ్యూనిటీ, సోషల్ మరియు పర్సనల్ సర్వీసుల రంగం లో పెరుగుదల 5.3 శాతం.వ్యవసాయం, అడవులు, చేపలు రంగం లో పెరుగుదల 1.4 శాతం. కాగా మైనింగ్ రంగం లో ఉత్పత్తి అంతకు ముందు సంవత్సరం కన్నా 2.2 శాతం తగ్గింది. సరుకుల తయారీ, ఎలక్ట్రిసిటీ,గ్యాస్, నీటి సరఫరా మరియు నిర్మాణ రంగాలలో పెరుగుదల చాలా స్వల్పముగా 1.2 శాతమే వున్నది.
2012-13 స్థూల జాతీయ ఆదాయం లో ప్రాథమిక రంగం వాటా 19.9 శాతం, ద్వితీయ రంగం వాటా 23.8 శాతం, తృతీయ రంగం వాటా 56.3 శాతం. (ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, చేపలు, అటవీ ఉత్పత్తులు, మైనింగ్, క్వారీయింగ్. ప్రకృతినుండీ ప్రత్యక్షముగా చేయగలిగే ఉత్పత్తుల రంగం ప్రాథమిక రంగం. ద్వితీయ రంగం అంటే ప్రాథమిక రంగం నుండి లభించే వస్తువులను ముడిపదార్థాలుగా వినియోగించి కొత్త ఉత్పత్తులు చేసే రంగం. సరుకుల తయారీ,ప్రాసెసింగ్ పరిశ్రమలు, యంత్రాల తయారీ, నిర్మాణ రంగం ద్వితీయ రంగం లో వుంటాయి. తృతీయ రంగం అంటే సేవల రంగం. ప్రజలకి పరిశ్రమలకి అందించే సేవలను తృతీయ రంగం అంటారు. హోల్ సేల్, రిటెయిల్ వ్యాపారం, రవాణా, పంపిణీ, సినిమా, టి వి, రేడియో, మీడియా, ఆరోగ్యం, విద్యా, టూరిజం, వ్యక్తిగత సేవలు, బ్యాంకింగు, ఇన్సూరెన్సు , లీగల్ సేవలు వంటివి సేవల రంగం లో వుంటాయి).
పని చేసే వారిలో 60 శాతం మంది వుండే ప్రాథమిక రంగం  ఉత్పత్తి,  మొత్తం జాతీయ ఉత్పత్తిలో 19.9 శాతం వున్నది.  18 శాతం మంది పని చేసే ద్వితీయ రంగం లో  ఉత్పత్తి,  మొత్తం ఉత్పత్తిలో 23.8 శాతమే వున్నది. 22 శాతం మంది పని చేసే సర్వీసుల రంగం లో ఉత్పత్తి అధికముగా 56.3 శాతం వున్నది. ఇది మన దేశం లో పరిస్థితి.
ఇందుకు భిన్నం గా చైనా లో 2011 లెక్కల ప్రకారం స్థూల జాతీయ ఉత్పత్తిలో  ప్రాథమిక రంగం వాటా 10.1 శాతం, ద్వితీయ రంగం వాటా 46.8 శాతం, తృతీయ రంగం వాటా 43.1 శాతం వున్నది. చైనాలో పని చేసే జనాభాలో ప్రాథమిక రంగం లో 38.1 శాతం, ద్వితీయ రంగం లో 27.8 శాతం, తృతీయ రంగం లో 34.1 శాతం వున్నారు(2009 నాటికి). ద్వితీయ రంగం లో పని చేసే జనాభా, స్థూల జాతీయ ఉత్పత్తి మనకన్నా అధికముగా వున్నది కాబట్టి చైనా మనకన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినట్లు లెక్క.



Thursday, February 6, 2014

భారత దేశ పరిశ్రమల సరే్

భారత దేశం పరిశ్రమల సర్వే(రిపోర్టు సమర్పించిన ఫ్యాక్టరీల వివరాలు)
 
క్ర.సం
విషయం
సంవత్సరం
 
 
 
2008-09
2009-10
 
1.
 
రిపోర్టు చేసిన ఫ్యాక్టరీల సంఖ్య
155247
159460
 
2.
 
రోజుకు సగటున ఉద్యోగులు
 
 
అ)మొత్తం ఉద్యోగులు
 
 
ఆ) మొత్తం కార్మికులు
 
 
ఇ) పురుష కార్మికులు
 
 
ఈ) మహిళా కార్మికులు
 
 
ఊ) కాంట్రాక్టు కార్మికులు
 
3.
 
రోజుకి ఉద్యోగికి అయిన ఖర్చు
రు. 410.41
రు. 464.93
 
4.
 
ఉత్పత్తి ఖర్చులో లేబర్ ఖర్చు శాతం
5.56
5.77
 
5.
 
రోజుకి తలకి  వేతనం (రూపాయిల్లో)
 
 
అ) ఉద్యోగులందరికి సగటున
330.35
372.82
 
 
ఆ) కార్మికులందరికి సగటున
211.95
240.38
 
 
ఇ)పురుష కార్మికునికి
258.04
288.14
 
 
ఈ) మహిళా కార్మికురాలికి
131.23
145.63
 
ఉ) కాంట్రాక్టు కార్మికునికి
160.53
193.87