Wednesday, December 30, 2015

ఫేస్ బుక్ మోసాన్ని ఓడించండి -ఇంటర్నెట్ ను కాపాడండి


ఇందుకు fsmi.in వెబ్ సైట్ చూసి దానిలో వున్న సమాచారం ప్రకారం మీ అభిప్రాయాన్ని 7.1.2016 లోగా టి ఆర్ ఏ ఐ కి ఈ మెయిల్ చేయండి

ఫేస్ బుక్ పత్రికలనిండా ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నది. ఇందుకు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నది. తాము దేశ సేవ చేద్దామనుకుంటే “ఇంటర్నెట్ తటస్థత” కోసం  పని చేసే  కార్యకర్తలు అడ్డుపడుతున్నారని,  కాబట్టి భారత ప్రజలు తమకి మద్దతు ఇవ్వాలని ఈ ప్రకటనల సారాంశం. 

‘ఇంటర్నెట్ తటస్థత’ అంటే ఏమిటి? టెలిఫోన్ లో మీరు ఎవరితోనయినా మాట్లాడవచ్చు. ఏ విషయమయినా మాట్లాడవచ్చు. ఫలానా వారితోనే మాట్లాడాలి, ఫలానా విషయమే మాట్లాడాలి అంటే అంగీకరించము. అది మన టెలిఫోన్ హక్కుకి వ్యతిరేకం అంటాం. ఇంటర్నెట్ విషయం లో కూడా ఇదే విధమయిన హక్కుని ప్రతి వినియోగదారు కలిగి  వుండాలి. మీకు ఇంటర్నెట్ సౌకర్యం ఇస్తాము, కానీ మీరు మేము అనుమతించిన సమాచారాన్నే  చూడాలి, మేము అనుమతించిన వెబ్ సైట్స్ నే చూడాలి, మేము అనుమతించిన బ్లాగులనే మీరు తయారు చేసుకోవాలి, మేము అనుమతించిన అప్లికేషన్సునే మీరు అభివృద్ధి చేసుకోవాలి అని ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఏ టెలికాం లేదా ఇంటర్నెట్ కంపెనీ అయినా సరే అంటే దానికి మనము అంగీకరిస్తామా? అంగీకరించము. ఇంతేగాక ఒక వెబ్ సైట్ చూడటానికి ఒక రేటు, ఇంకొక వెబ్ సైట్ చూడటానికి ఇంకొక రేటు వుండే వివక్షతా పూర్వక విధానాన్ని మనము అంగీకరించము. ఒక వెబ్ సైట్ ను వేగముగా మరొక వెబ్ సైట్ ను చాలా నెమ్మదిగా చూసే విధముగా , ఆ వెబ్ సైట్  యాజమాన్యం టెలికాం కంపెనీకి చెల్లించే రేటును బట్టి ఏర్పాటు చేసే విధానాన్ని మనము అంగీకరించము. ఇదే విధముగా ఎవరయినా ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని ఏదయినా అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఒక రకమయిన అప్లికేషన్ కు ఒక రేటు, ఇంకొక రకమయిన అప్లికేషన్ కు ఇంకొక రేటు వుండే వివక్షతాపూర్వక విధానాన్ని మనము అనుమతించము. ఇంటర్నెట్ ను వినియోగించుకుని అప్లికేషన్ డెవలప్ చేయటానికి డేటా చార్జీలకు మించి అదనముగా చెల్లించటానికి అంగీకరించము.  ఇంటర్నెట్ వినియోగానికి చెల్లించటం తోపాటు ఇంటర్నెట్ పై డెవలప్ చేసిన వాట్సప్, స్కైప్ తదితర అప్లికేషన్ వినియోగానికి అదనముగా చెల్లించాలంటే అందుకు మనము అంగీకరించము. ఈ విధముగా ఇంటర్నెట్ ను ఎటువంటి వివక్షత, ఆటంకము లేకుండా స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కునే "ఇంటర్నెట్ తటస్థత" అంటారు. 

ఇప్పుడు ఫేస్ బుక్ చేసేది భారత ప్రజల హక్కు అయిన ఈ ఇంటర్నెట్ తటస్థతకి వ్యతిరేకమయిన కార్యక్రమం. దీని ఆటలు సాగనిస్తే కొన్నాళ్ళకి మనము ఇంటర్నెట్ తటస్థత హక్కుని కోల్పోతాము. ఇంతకీ ఫేస్ బుక్ చేయదలచుకున్నదేమిటి? ఇంతకు ముందే ఫేస్ బుక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికాం కంపెనితో ఒప్పందానికొచ్చి, “ఇంటర్నెట్. ఆర్గ్” (internet.org) పేరుతో రిలయన్స్ వినియోగదారుల మొబైల్ ఫోన్ లో ఉచితముగా 38 వెబ్ సైట్ లు, సర్వీసులు అందించే ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని వార్తలు అందించేవి, కొన్ని వార్తలు మరియు వినోదం అందించేవి, కొన్ని వినోదాన్ని అందించేవి వున్నాయి. కానీ ఈ సేవలందించే కంపెనీలలో ఒక కంపెనీని మాత్రమే అనుమతించి మిగతా కంపెనీలని అనుమతించలేదు. కాబట్టి వార్తలు చూడాలంటే ఏదో ఒక సంస్థ ఇచ్చే వార్తాలే చూడాలి. నచ్చిన వార్తా పత్రికని నెట్ లో చూడటానికి వీలు కాదు. ఫేస్ బుక్ కు నచ్చిన వార్తా పత్రికని మాత్రమే చూడాలి! ఇదే విధముగా ఇతర సేవలపై కూడా ఆంక్షలున్నాయి. కొంత విమర్శ వచ్చిన తరువాత ఫేస్ బుక్ ఈ ఇంటర్నెట్.ఆర్గ్ కు “ఫ్రీ బేసిక్స్” అనే పేరు పెట్టింది. పేరు మార్చినా విషయం మారలేదు. వివక్షత కొనసాగింది. ఇది వివక్షతా పూర్వక విధానమని, ఇంటర్నెట్ తటస్థతకి ఇది వ్యతిరేకమని చెప్పి టి ఆర్ ఏ ఐ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) దీనిని ఆపు చేయించింది. 

అయినప్పటికి టి ఆర్ ఏ ఐ ఆపు చేయించిన ఈ “ఫ్రీ బేసిక్స్’ కు మద్దతుగా ఇదేదో తాము భారత దేశాన్ని ఉద్ధరించటానికి చేస్తున్న ఘనకార్యమన్నట్లు ఫేస్ బుక్ పత్రికా ప్రకటనలు విరివిగా ఇస్తున్నది. విచిత్రమయిన విషయమేమిటంటే ఫ్రీ బేసిక్స్ ను ఆపు చేయించిన టి ఆర్ ఏ ఐ, అందుకనుకులముగా ఫేస్ బుక్ ఇస్తున్న ఈ ప్రకటనలను మాత్రం ఆపు చేయించటం లేదు!
టి ఆర్ ఏ ఐ తన వెబ్ సైట్ లో ఈ సమస్య పై ఒక కన్సల్టెషన్ పేపర్ ను పెట్టింది. దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకునే ప్రతి ఒక్కరూ టి ఆర్ ఏ ఐ కి 7.1.2016 లోగా అందె విధముగా ఈ మెయిల్ ద్వారా గాని, పోస్ట్ ద్వారా గాని తెలియజేయవచ్చును.
 
మొబైల్ వినియోగ దారులలో అల్పాదాయ వర్గాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ను ఫ్రీ గా ఇచ్చి దాని ద్వారా కొన్ని వెబ్ సైట్స్ నయినా ఉచితముగా చూసే అవకాశం, కొన్ని  సేవలని అయినా ఉచితముగా పొందే అవకాశం కల్పిస్తున్నామని, కానీ ఇంటర్నెట్ తటస్థత కార్యకర్తలు పేదలకు తాము ఈ విధముగా ఉచిత సేవలు ఉచితముగా అందించటాన్ని  వ్యతిరేకిస్తున్నారని ఫేస్ బుక్ తప్పుడు ప్రచారం చేస్తున్నది.

 పేదలకు  నిజముగా ఉచితముగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఫేస్ బుక్ అందించదలచుకుంటే ఫలానా ఆదాయం లోపు వారికి తాము ఇన్ని ఏం బి లు లేదా ఇన్ని జి బీలు డేటా ఉచితముగా అందిస్తామని, అందుకయ్యే చార్జీలని తాము పేదల తరఫున ఆ డేటా అందించే టెలికాం కంపెనీలకు చెల్లిస్తామని చెప్పవచ్చు. లేదా నైట్ ఫ్రీ టెలిఫోన్ కాల్సు సౌకర్యాన్ని ల్యాండ్ లైన్స్ పై బి ఎస్ ఎన్ ఎల్ ఇచ్చినట్లు ఫేస్ బుక్ కూడా అల్పాదాయ మొబైల్ వినియోగదారులకు నైట్ టైమ్ ఉచితముగా డేటా అందించే ఏర్పాటును టెలికాం కంపెనీలతో ఒప్పందానికి వచ్చి ఏర్పాటు చేయవచ్చు.  అలా చేయకుండా  పేదలకు తమకి నచ్చిన వెబ్ సయిట్స్  మాత్రమే ఉచితముగా చూసే అవకాశం కల్పిస్తామని అంటున్నది. ఋ.2000 లు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనగలిగే వాళ్ళకి నెలకి ఋ.20 లేదా ఋ.30 చెల్లించి తమకి కావాల్సిన డేటా ప్లాన్ తీసుకోటం అంతా భారమవుతుందా? అయినా పేదలకు  కొన్ని వెబ్ సయిట్స్ మాత్రమే చూసేందుకు అనుమతించటం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లు ఎలా అవుతుంది?పేదలుల ఫేస్ బుక్ లో క్యాండి క్రష్ ఆట మాత్రమే ఆడుకోవాలని, గూగుల్ లేదా యు ట్యూబు  తదితర సెర్చి ఇంజిన్లను వాడి తమకి కావాల్సిన వెబ్ సైట్లను చూడకూడదని ఫేస్ బుక్ ఉద్దేశమా? ఇది భారత దేశ పేద ప్రజలకి  ఏదో ముష్టి వేసినట్లు అవమానించటమే కదా?   ఇది ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం పేరుతో కుట్ర చేయటం తప్ప మరొకటి కాదు. 

ప్రభుత్వము అందించే సేవలన్నింటిని తమ ఫ్రీ బేసిక్స్ ద్వారా ఉచితముగా అందిస్తామని ఫేస్ బుక్ అంటున్నది. ప్రభుత్వము నిజముగా ఫేస్ బుక్ ద్వారా మాత్రమే తన సేవలు ఉచితముగా అందిస్తే అది అక్రమం అవుతుంది.పోలీసు సేవలు 100 నంబరుకి డయల్ చేస్తే  అందుబాటులోకి వస్తున్నాయి. ఏ టెలికాం కంపెనీ వినియోగదారు అయినా అదే నంబరుకి డయల్ చేయవచ్చు. అలా కాకుండా ఫలానా టెలికాం కంపెనీ వినియోగ దారులకి మాత్రమే ఈ సేవ అందుబాటులో వుంటుంది అని ప్రభుత్వము అంటే అది అక్రమం, చట్ట విరుద్ధం అవుతుంది. కాబట్టి ఫేస్ బుక్ ద్వారానే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి ప్రభుత్వము అంగీకరించటం సాధ్యము కాదు.  ప్రభుత్వ సెవలను ఉచితముగా, ఏ టెలికాం సర్వీసు కంపెనీ వినియోగ దారు అయినా సరే, ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశం వుండాలి. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లందరికి ప్రభుత్వము ఈ షరతు విధించాలి.

కొన్ని వెబ్ సైట్స్ ను ఉచితముగా చూసే ప్లాన్ లను అనుమతించటం అంటే అది తీవ్రమయిన వివక్షతకు దారి తీస్తుంది. తమకి డబ్బులు ఎక్కువ చెల్లించే కంపెనీల వెబ్ సైట్సు ను ఉచితముగానో, లేదా ఎక్కువ స్పీడ్ తోనో చూపించే విధానానికి ఇది దారి తీస్తుంది. అంటే ఎక్కువ చెల్లించగలిగే కంపెనీల వెబ్ సయిట్సుకే ఇంటర్నెట్ లో ప్రాధాన్యత లభిస్తుంది. చెల్లించలేని కంపెనీల వెబ్ సైట్స్ చూడటం కష్ట సాధ్యమవుతుంది. చివరికి ఇంటర్నెట్ వినియోగాన్ని దాని శక్తి సామర్థ్యాలతో పోలిస్తే చాలా పరిమితమయిన స్థాయికి దిగజార్చటానికి ఇది దారి తీస్తుంది. ఇంతేగాక మిలియన్లకొద్ది వున్న వెబ్ సైట్సు, అప్లికేషన్సు లో ఏవో కొన్నింటిని మాత్రమే ఉచితముగా అందించి మిగతా వాటికి రకరకాలుగా చెల్లించే విధానం రావటం అంటే నేను చూసే వెబ్ సైట్సు మీకు అందుబాటులో లేక, మీరు చూసే వెబ్ సైట్సు  నాకు అందుబాటులో లేక ఇంటర్నెట్ ద్వారా ఒకరితో ఒకరు సంబంధం కలిగి వుండటం చాలా పరిమితమవుతుంది. 

ఉచితముగా అందించే పేరుతో ఫేస్ బుక్ ఈ విధముగా ఎక్కువ వినియోగదారులను పొందగలిగితే ఎవరయినా ఒక చిన్న పారిశ్రామిక వేత్త తన కంపెనీ వెబ్ సైట్ ను ఫేస్ బుక్ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలంటే అందుకు ఫేస్ బుక్ కు చాలా చెల్లించాల్సి వుంటుంది. 

ఇంటర్నెట్ ను ఈ విధముగా పరిమితమయినదిగా చేయటాన్ని ప్రభుత్వము మరియు టి ఆర్ ఏ ఐ లు నివారించాలి. ఇంటర్నెట్ మొబైల్ ఫోన్లద్వారా అండాలంటే దానికి ప్రభుత్వ నిధి అయిన యు ఎస్ ఓ ఫండ్ తో నిర్మించే ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ ఉపయోగించాలి. దేశ సహజ సంపద అయిన స్పెక్ట్రమ్ ను ఉపయోగించాలి. కాబట్టి ఇంటర్నెట్ ను ఎటువంటి వివక్షత లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకు రావటం, సాధ్యమయినంత తక్కువ ధరకు అందుబాటులోకి తేవటం, పేదలకు ఉచితముగా ఒక మెరకయినా అందుబాటులోకి వచ్చేలా చేయటం ప్రభుత్వము మరియు టి ఆర్ ఏ ఐ ల బాధ్యత. ఉచితముగా కొన్ని వెబ్ సైట్లు అందిస్తున్నామనే సాకుతో భారత దేశ ఇంటర్నెట్ ఆవరణలో అధిక భాగాన్ని కాజేసే అవకాశం ఫేస్ బుక్ కు ఇవ్వ కూడదు. పేదలకు ఉచితం పేరుతో ఫేస్ బుక్ ఇవ్వదలచుకున్న కొన్ని వెబ్ సైట్లు మాత్రమే చూసే అవకాశం కల్పించి అత్యధిక వెబ్ సైట్లు చూసే అవకాశం లేకుండా చేసే ఈ కుట్రని ఓడించాలి. పేదలకు తగిన మేరకు డేటాని అన్నీ రకాల వెబ్  సైట్లు చూడగలిగే విధముగా ఉచితముగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. భారత పేదల మీద ఫేస్ బుక్ కు నిజముగా అంతా ప్రేమ వుంటే అది కూడా పేదలకు ఎటువంటి ఆంక్షలు లేని విధముగా కొన్ని ఏం బి లు లేదా కొన్ని జి బి లు డేటాని ప్రతినెలా ఉచితముగా అందించేందుకు ముందుకు రావాలి. అంతే గాని ఈ మోస పూరిత విధానం మంచిది కాదు. 

ఫ్రీ బేసిక్ లో  అడ్వర్టైజ్మెంట్లు వుండవని ఫేస్ బుక్ అంటున్నది. కానీ అది ప్రస్తుతానికి మాత్రమే. భవిష్యత్తులో ఫ్రీ బేసిక్స్ లో ప్రకటనలు ప్రసారం చేసే  హక్కు తనకి వునందని  ఫేస్ బుక్ ఇప్పటికే ప్రకాటించింది. మరొక విషయం ఏమిటంటే  ఫేస్ బుక్ తన వినియోగ దారుల డేటాని మార్కెటింగ్ కంపెనీలకి అమ్ముకుంటుంది. అదే దాని ఆదాయ మార్గం లో ముఖ్యమయినది. కాబాట్టి ఎంత మంది వినియోగదారులను రాబడితే ఫేస్ బుక్ కు అంత లాభం. ఇంతేగాక ఫేస్ బుక్ ఒక అమెరికా కంపెనీ. ఒక అమెరికా కంపెనీగా అది తన వినియోగదారుల డేటాని అమెరికా గూఢచారి సంస్థ లేదా భద్రతా సంస్థ “ఎన్ ఎస్ ఏ” (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ) ” కి అందించాలి. కాబట్టి ఇది భారతీయుల వ్యక్తిగత విషయాల  భద్రతకి భంగకరం. 
కాబట్టి పేదలకు ఉచితం పేరుతో  కొన్ని వెబ్సైట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చి సంపూర్ణమయిన ఇంటర్నెట్ కు బదులు దానిని పాక్షికం చేసి ఇంటర్నెట్ ప్రయోజనాన్ని సంకుచితం చేసి తన లాభాలను పెంచుకునేందుకు ఫేస్ బుక్ చేస్తున్న కుట్రని ఓడించండి. ఇందుకు ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ కు వ్యతిరేకముగా అదే విధముగా ఇంటర్నెట్ తటస్తతకు అనుకూలముగా, దానితోపాటు  ప్రజలందరికీ కొన్ని ఏం బి లు లేదా జి బిల మేరకు డేటా ఉచితముగా, అన్నీ వెబ్సైట్లు/అన్నీ అప్లికేషన్లు అందుబాటులో వుండే విధముగా తగిన విధానాన్ని రుపోదించాలని కోరుతూ టి ఆర్ ఏ ఐ కి 7.1.2016 లోగా మీ అభిప్రాయాన్ని ఈ మెయిల్ ద్వారా తెలియజేయండి. ఇందుకు మీరు వెంటనే www.fsmi.in  వెబ్ సైట్ చూడండి.

Thursday, December 17, 2015

మోడీ సిలికాన్‌ పర్యటన: డిజిటల్‌ ఇండియా


                       ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర సాంకేతిక కేంద్ర మైన సిలికాన్ వ్యాలీలో మోడీ పర్యటన, ఆ సందర్భంగా ఆయన ఐటి దిగ్గజాలైన గుగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ కంపెనీల ప్రతినిధులను కలవడం లాంటి అంశాలకు మీడియా విపరీత మైన ప్రచారహోరును కల్పించింది. ఈ పర్యటన తోనే మోడీ భారతదేశ శాస్త్రసాంకేతిక పురోగతిని ఉన్నత సోపానాలనెక్కించినట్లు కార్పొరేట్ మీడియా చిత్రీకరించింది. భవిష్యత్తులో భారతీ యులు మరిన్ని స్మార్ట్ ఫోన్లు, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం గల కార్లు, పరికరాలు వాడగల గడంలో సందేహం లేదు. దీనర్థం భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతిని సాధించి నట్లు కాదు. ఈ అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులలో సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రెండూ కలిపి భారత్లో తయారవుతున్న ఉత్పత్తులు ఎన్ని అన్నదే ఇక్కడ ప్రశ్న. అవి దాదాపుగా ఏమీ లేవన్నది తక్షణ సమాధానం. ఈ దిశలో మోడీ పర్యటన వల్ల కించిత్తు ప్రయోజనం కూడా కలగటం లేదు. 
సిలికాన్ వ్యాలీగా పిలువబడే అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో దక్షిణ భాగం, ప్రపంచం లోనే అతిపెద్ద అత్యాధునిక సాంకేతిక కార్పొరే షన్లకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. అత్యధిక సంఖ్యలో పేరుగాంచిన సిలికాన్ చిప్ ఆవిష్కర్త లు, తయారీదార్ల ప్రాముఖ్యతతోనే ఆ ప్రాంతం సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల కృషితో ఆవిష్కృతమైన నూతన ఉత్పత్తులు, వెంచర్ పెట్టుబడులు, అమెరికా రక్షణశాఖ వ్యయాలు లాంటి అనేక అంశాలు కలగలిపి ఆ ప్రాంత ఉద్భావనకు కారణాలయ్యాయి. వేలాది శాస్త్ర, సాంకేతిక అంకుర పరిశ్రమలు ప్రపంచంలో నూతన ఆవిష్కరణలకు పురుడు పోసుకొని అక్కడి నుండే తమ ప్రయాణాన్ని మొదలెట్టాయి. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక శ్రమజీవులు అత్యధి కంగా కేంద్రీకరింపబడిన ప్రాంతం ఇదేనేమో! మోడీ తన ఉపన్యాసాన్ని శ్రోతలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడతారన్న అంశం సిలికాన్ వ్యాలీలో ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి విదిత మౌతుంది. సాంకేతిక మేధావులు హాజరైన ఆ సమావేశంలో ఆయన తనుగాని, తన పార్టీగాని, ఆర్ఎస్ఎస్గాని సామాన్యంగా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నట్లు మాట్లాడలేకపోయారు. ఉదాహరణకు జనవరి 3, 2014లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహమ్మదాబాద్లో జరిగిన గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ ప్రారంభోత్సవ సమయంలో ప్రస్తావిం చిన అంశాలను మోడీ ఇక్కడ ప్రస్తావించలేదు. ఆయన ఇక్కడ ఇలా చెప్పారు. ''మనం వినాయ కుడిని పూజిస్తుంటాం. వినాయకుడి కాలంలో మనిషి దేహానికి ఏనుగు తలను అతికించగల ప్లాస్టిక్ సర్జన్, తన వృత్తిని నిర్వహిస్తూ ఉండి తీరాలి. కర్ణుడు తన తల్లి ఉదరం నుండి జన్మించలేదని మహాభారతం చెబుతుంది. అంటే జన్యుశాస్త్రం ఆ కాలానికి అభివృద్ధి అయ్యిందని అర్థం.' విశ్వవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలు సాధించిన పురోగతిని అపహాస్యం చేస్తూ, మోడీ బృందం ఈ శాస్త్ర సాంకేతిక పురోగతి వేదకాలం నాడే ఉందని నమ్మబలుకుతున్నారు. అందుకోసమే తమ ప్రభుత్వం వేదశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రాల అభివృద్ధికి నిధులను సమకూరుస్తుందని సమర్థించుకున్నారు.
కాని సిలికాన్ వ్యాలీలో చేసిన ప్రసం గంలో మోడీ ఈ అంశాలను ఏమీ ప్రస్తావించ లేదు. వేదకాలంనాటి శాస్త్ర సాంకేతిక పురోగమ నంతో పోల్చుకుంటే, ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగం సాధించలేని ఆవిష్కరణలుగా వీటిని ప్రస్తావించలేకపోయారు. దానికి బదులు ఆయన ఇలా అన్నారు. ''నూతన ఆలోచనలు ఇక్కడే (సిలికాన్ వ్యాలీలో) తొలి వెలుగును చూడగలి గాయి.'' ఒకపక్క, చరిత్రను వక్రీకరిస్తూ, పుక్కిటి పురాణాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ, ప్రజల్లో మత ఛాందసాలను రెచ్చగొడుతూ, వేద కాలాన్ని కీర్తిస్తూ మోడీ తన దేశ ప్రజల చైతన్యస్థాయిని పురాతన కాలానికి చేర్చదలిచారు. మరోప్రక్క, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజా సమూహాల్ని సులువుగాచేరుకోగలగ డంలో దాని ప్రాధాన్యతను గూర్చి ఆయన ప్రస్తుతిస్తారు. 
మౌలికరంగ ఆవశ్యకత 
మోడీ తన ప్రసంగంలో భారతదేశాన్ని డిజిటలైజ్ చేయడంలో తన దార్శనికతను వ్యక్తపరిచారు. ''123 కోట్ల నా దేశ పౌరులు డిజిటల్గా అనుసంధించబడాలని నేను కోరు తున్నాను'' భారతదేశంలో 25 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. భారత జనాభాతో పోల్చుకుంటే దేశంలో ఇంటర్నెట్ వినియోగం తక్కువైనప్పటికీ (10 శాతం) సంఖ్యాపరంగా చూసే అది అత్యధికంగా ఉంది. ప్రపంచ దేశాల ఇంటర్నెట్ వినియోగంలో చైనా, అమెరికా తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. చైనాలో 64 కోట్ల ప్రజలు ఇంటర్నెట్ వినియోగిస్తూ, వాళ్ళ జనాభాలో 46 శాతంగా ఉన్నారు. ప్రపంచ దేశాల మొబైల్ ఫోన్ల వినియోగంలో భారతదేశం, చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది. 125 కోట్ల భారతీయు లలో 96 కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు ఉండగా, 137 కోట్ల చైనీయులలో 127 కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. భారతదేశంలో ప్రతివారికి మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి తేవాలంటే, మొదటగా మనకు దేశవ్యాప్తంగా విస్తరింపబడ్డ ఫైబర్ ఆప్టిక్ సమాహారం, ఫోన్లను అనుసరించ డానికి కొన్ని టవర్లు లాంటి మౌలిక సదుపా యాలు కావాలి. ఈ సమాహారం సాధారణ రవాణా వ్యవస్థను పోలి ఉంటుంది. మన దేశంలో హైవేలు, రోడ్లు, రైల్వే లైన్లు లాంటి వాటిద్వారా బస్సులు, కార్లు, ట్రక్కులు, రైళ్ళు, వాహనాలుగా ఉపయోగపడుతూ ప్రజలను ఒకచోటి నుండి మరోచోటికి చేరుస్తున్నాయి. అదే రకంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్లు డేటాను, సమాచారాన్ని ఒకచోట నుండి మరో చోటకు చేర్చగలిగే వాహనాలుగా ఉన్నాయి. హైవేలను నిర్మించితే, వాహనాలు వాటంతటవే తప్పనిసరిగా వస్తాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి కంపెనీలు ఖచ్చితంగా బ్రాడ్బ్యాండ్ హైవేలను నిర్మించవు. అదేకాకుండా మౌలిక సదుపాయాల నిర్మాణం వాళ్ళ వృత్తి కాదు. టాటా మోటార్స్, మారుతీ కంపెనీలు రోడ్లను నిర్మిస్తాయా? ఈ మౌలిక సదుపాయాలను భారతదేశం దానంతటదే నిర్మించుకోవాలి. మరెవ్వరూ చెయ్యరు.
జపాన్, జర్మనీ దేశాల్లో 86 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. అలాగని ఆ దేశాధినేతలందరూ ఈ కంపెనీలను కలవలేరు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగదారులలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న చైనా, తమ దేశాన్ని డిజిటల్ చైనాగా మార్చటంకోసం గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ కంపెనీలను ఆశ్రయించలేడు. గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్, ట్విట్టర్ లాంటి కంపెనీలను తమ దేశంలోకి అనుమతించక పోవడమే కాకుండా, గూగుల్కు బదులుగా ఇతర సెర్చ్ ఇంజన్లను చైనీయులు వాడుతున్నారు. చైనా ప్రజలు వినియోగిస్తున్న ఇంటర్నెట్, ఇ-మెయిళ్ళ సమాచారాన్ని చైనాయేతర ప్రపపంచానికి గూగుల్ అందజేస్తుంది. చైనా లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరం స్నోడెన్ అమెరికా సమాచార వ్యవస్థ బండారాన్ని బయటపెట్టిన తర్వాత వాస్తవమని రుజువైంది. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సేవలను పొందుతున్న ప్రజానీకంపై నిఘా ఉంచేందుకు, వారి సమాచారం మొత్తాన్ని అమెరికా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీకి అందించేందుకు ఆయా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్, ట్విట్టర్లను వినియోగించకుండా డిజిటల్ ప్రపంచంలో చైనా ఎలా నెగ్గుకు రాగలుగుతుందన్నది అందరి ముందున్న పెద్ద ప్రశ్న. గణాంకాల రీత్యా ఈ రంగంలో చైనా పనితీరు చాలా బాగున్నది. సామాజిక మాధ్యమాల వినియోగదారులలో అమెరికా ఉత్పత్తి అయిన ఫేస్బుక్ 118 కోట్ల మంది వినియోగదారులు కలిగి మొదటి స్థానంలో ఉన్నది. క్యూక్యూ 83 కోట్ల వినియోగ దారులు కలిగి రెండవస్థానంలో, క్యూజోన్ 63 కోట్ల వినియోగదారులు కలిగి మూడవస్థానంలో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు చైనాలో ఉత్పత్తి చేయబడి ప్రధానంగా చైనా ప్రజలచే వినియో గింపబడుతున్నాయి. చైనా ఇంటర్నెట్ వినియోగ దారులు సగటున రోజుకు 2.7 గంటలు ఆన్లైన్లో ఉంటారని, ఈ సంఖ్య అమెరికా యేతర అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే ఎక్కువగాను, అమెరికా, జపాన్లతో సమానం గానో లేదా ఎక్కువగానో ఉన్నట్లు ఒక బోస్టన్ కన్సల్టెన్సీ బృందం అధ్యయనంలో తేలింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లకు మౌలిక సదుపా యాల కల్పనకు ఈ కంపెనీలతో అవసరం లేదన్న విషయం మోడీకి బాగా తెలుసు. కానీ ఆయన కార్యాన్ని ఆయన సాధించుకున్నారు. ఆయన మీడియా ప్రచారాన్ని చేజిక్కించుకొని, ఆ ప్రఖ్యాత కంపెనీల సాయంతో తాను ప్రఖ్యాత భారతదేశాన్ని నిర్మిస్తున్నాని కొందరితో నమ్మబలుకుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కొంత భాగాన్ని అందిస్తామని ఆ కంపెనీల ద్వారా చెప్పిస్తున్నారు. మొత్తం దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఈ కంపెనీలు చివరి అంచున కల్పించే మౌలిక సదుపాయాల కల్పన అరకొరలాంటిది. ఈ కంపెనీలు వాగ్దానం చేసిన అంశాన్ని రేఖా మాత్రంగా చూద్దాము. వాళ్ళు చేస్తున్నది వాగ్దా నం మాత్రమే. అది కూడా ఖచ్చితంగా ఖరీదు కట్టే ఉంటుంది. 
సిలికాన్ వ్యాలిలో ఆయన పర్యటన సంద ర్భంగా భారతదేశంలో 500 రైల్వే స్టేషన్లను దత్తత తీసుకొని వైఫై సౌకర్యాన్ని కల్పిస్తానని, ఇందుకోసం కొంత మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని గూగుల్ ప్రకటించింది. దీన్ని గూగుల్ ఎలా చేస్తుంది? అని పరిశీలిస్తే, రైల్వేలలో ఇప్పటికీ అందుబాటులో ఉన్న ''రైల్టెల్'' ఆప్టిక్ ఫైబర్ సమాహారాన్ని తప్పనిసరిగా వినియోగిం చుకుంటుంది. పెద్ద హైవేల సమీపంలో ఉండే ఇళ్ళకు చేరటానికి కలిపే చిన్న రోడ్లతో ఈ పరిస్థితిని పోల్చవచ్చును. అదేకాకుండా గూగుల్ వైఫై పరిజ్ఞానంలో నిష్ణాతులేమీ కాదు. వైఫై పరిజ్ఞానంలో నిపుణులైన ఇతర కంపెనీలు చాలా ఉన్నాయి. మన దేశంలోని కొన్ని విమానా శ్రయాలలో ఉచితంగా వైఫై సదుపాయాన్ని అందిస్తున్నారు. అవి చాలా బాగా పనిచేస్తు న్నాయి. భారతదేశంలో వైఫై కల్పించే కంపెనీలు చాలా ఉన్నాయి. సాధారణంగా వైఫై కల్పనకు ఎవ్వరూ గూగుల్ని పిలవరు. ఎందుకంటే అది వాళ్ళ పనికాదు కాబట్టి. భారతదేశ గ్రామాలన్నిం టికీ టెలివిజన్ ప్రసారమయ్యేటట్లు వీలు కల్పించటానికి, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల విక్రయాల వ్యాపారం చేయటమని అర్థం. మైక్రోసాఫ్ట్ యాజమాన్య సాఫ్ట్వేర్ మరింతగా వాడటం మూలంగా మనం లెక్కకు మించి ఖర్చు పెట్టాల్సిన విష వలయం లో పడతాము. మైక్రోసాఫ్ట్ కూడా మన దేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అది అమెరికా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీతో ఒప్పం దం కలిగివున్నందున, ఈ డేటా సెంటర్లలో పోగుపడిన సమాచారాన్ని అనివార్యంగా అమెరి కా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీకి తెలియచేస్తుంది. ఫేస్బుక్ కూడా తన ఇంటర్నెట్ను మనకు అందించటానికి తన సంసిద్ధతను వ్యక్తపరిచింది. దాని ఇంటర్నెట్ పరిమితమైన ఇంటర్నెట్గానే గుర్తించాలి. ఇంటర్నెట్లో మనం ఏమి చూడాలో ఫేస్బుక్ నిర్ణయిస్తుంది. ''తటస్థ విధానానికి ఇది వ్యతిరేకం. ఈ కంపెనీలేమీ మనదేశంలో చెప్పు కోదగ్గ ఉద్యోగాల్ని కల్పించలేవు. కల్పించగల మని వాళ్ళూ చెప్పడం లేదు.
డిజిటల్ ప్రపంచంపై గుత్తాధిపత్యం
సిలికాన్ వ్యాలీకి మోడీ సందర్శనను ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టివి మోహన్ దాస్ సారు ప్రస్తుతిస్తూ, ''మొత్తం ప్రపంచాన్ని డిజిటల్గా సొంతం చేసుకోవటం కోసం మైక్రో సాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్ మరియు యాపిల్లు కన్న కలలకు మోడీలో సమాధానం దొరికింది. అని ఆయన సరిగ్గానే చెప్పారు. ఆయన మాటల్లో రెండు సత్యాలున్నాయి. ఒకటి, ఈ కంపెనీలన్నీ డిజిటల్ ప్రపంచం మొత్తాన్ని తమ గుత్తాధిపత్యం లోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాయి. ఇందుకోసం వాళ్ళు ఇతరులెవరినీ ఈ రంగం లోకి అడుగుపెట్టనివ్వరు. కానీ ఈ స్వప్నాన్ని నిజం చేసుకోవటానికి వాళ్ళు ఎన్నో అవరోధా లను ఎదుర్కోవలసి ఉంది. ప్రపం చంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన చైనా, ఇతరులను తమ దేశంలోకి అడుగు పెట్టనీయటం లేదు. కొన్ని దేశాల్లో యాజమాన్య సాఫ్ట్వేర్ వినియో గానికి నిధులూ, ఫ్రీ సాఫ్ట్వేర్ వినియోగం పెరి గింది. చైనా తర్వాత భారతదేశం రెండవ అతిపెద్ద మార్కెట్గా ఉన్నది. అందువల్ల బహుళజాతి కంపెనీలు ఈ మార్కెట్పై ఆసక్తిగా ఉన్నాయి. బహుళజాతి ఐటి కంపెనీలు మన దేశంలో వ్యాపారం చేయటం వల్ల అనేక ప్రయో జనాలు పొందగలుగుతున్నాయి. మొదటగా భారతదేశం యాజమాన్య సాఫ్ట్వేర్ వినియో గంలో ఆధిపత్యం కలిగి ఉంది. ఆచరణలో ప్రభుత్వం, ఐటి దిగ్గజాలు యాజమాన్య సాఫ్ట్ వేర్కు ఇచ్చినంత ప్రాధాన్యతను స్వేచ్ఛా, ఫ్రీ సాఫ్ట్వేర్లకు ఇవ్వటం లేదు. రెండవ అంశం, 
భారతదేశం రెండవ అతిపెద్ద మార్కెట్గా ఉన్నది. అందువల్ల బహుళజాతి కంపెనీలు ఈ మార్కెట్పై ఆసక్తిగా ఉంటాయి. అయినప్పటికీ అవుట్సోర్సింగ్కు వినియోగించే సాఫ్ట్వేర్ నిర్మాణం అనేక సందర్భాలలో అంత తేలికైన పనికాదు. భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ఆ నైపుణ్యం ఉంది. కాని మనదేశంలో నూతన ఉత్పత్తుల స్థానంలో భారతదేశ సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు స్థానం కల్పించాలన్న సంకల్పం భారత ప్రభుత్వానికి లేదు. అవుట్ సోర్సింగ్ ద్వారా పొందగలిగే సత్వర ఆదాయాన్ని ప్రైవేట్ ఐటి కంపెనీలు నూతన ఉత్పత్తుల ద్వారా పొందలేకపోవటం మూలంగా వాటి ఉత్పత్తిలో ఆసక్తి కనబరచడం లేదు. మూడవ అంశం ఇతర దేశాలలాగా కాకుండా, బహుళజాతి సాఫ్ట్వేర్ దిగ్గజాల సహకారంతో అమెరికా సాగిస్తున్న నిఘా చర్యల్ని ష్నోడెన్ బట్టబయలు చేసినప్పటికీ, భారత దేశం, వాటినేమీ పట్టించు కోవడం లేదు. చివరి అంశం పర్యవసానాలే మైనా భారత మార్కెట్ను సాధ్యమైనంత త్వరగా బహుళజాతి సంస్థలకు అప్పచెప్పటానికి ప్రస్తుత ప్రధానమంత్రి, సిద్ధమయ్యారు. బహుళజాతి ఐటి కంపెనీలకు భారత మార్కెట్, భారత ప్రధానమంత్రి ప్రీతిపాత్రమయ్యాయి. అమెరికన్ బహుళజాతి ఐటి కంపెనీల కలలకు మోడీతో సమాధానం చూడగలిగారన్న మోహన్దాస్ సారు ప్రకటనలో రెండవ సత్యం ఇక్కడ దొరుకు తుంది. అమెరికన్ కంపెనీల ప్రయోజనాలకు కొమ్ముగాస్తున్న మోడీని అమెరికన్ మీడియా ఆనందంతో కీర్తించడం సర్వసాధారణమైనదే. మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనలో అదే జరిగింది. కానీ మోడీ తన పర్యటనలో ఏమి చేసి ఉండాల్సింది? దానికి బదులు ఆయన అనంతమైన విజ్ఞానాన్ని అందించకలిగే విద్యాసంస్థలు, అపార సంపదను పెట్టుబడిగా పెట్టగలిగే వెంచర్ పెట్టుబడిసంస్థలు, కేంద్రీకరిం పబడ్డ నైపుణ్య సమూహాలన్నింటి పరస్పర సమన్వయంతో అంకుర పరిశ్రమలు వారి ఆవిష్కరణలతో సిలికాన్ వ్యాలీలో ఎలా వృద్ధి కాగలిగాయో అధ్యయనం చేసి ఉండాల్సింది. ఆయన సిలికాన్ వ్యాలీ చరిత్రను పరిశీలించి ఉంటే, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంలో అమెరికా ప్రభుత్వం నిర్వహించిన పాత్ర తెలిసి ఉండేది. సాధారణంగా భారత కంపెనీలు నూతన ఆవిష్కరణలకు విముఖంగా ఉన్న ప్రాంతంలో నూతన ఉత్పత్తుల నిర్మాణంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన అదనపు పాత్రకు తగిన ప్రణాళికను మోడీ రచించగలిగేవారు. ఆ దిశలో మోడీ ఏమీ చేయటం లేదు. అనేక సందర్భాలలో మోడీ ''భారత్లో తయారీ''పై ప్రసంగిస్తుండేవారు. అనేక ఆవిష్కరణలు సిలికాన్ వ్యాలీలో చిన్న చిన్న అంకుర పరిశ్రమల ద్వారానే సాధ్యమైందన్న వాస్తవాన్ని ఆయన అధ్యయనం చేస్తే అర్థమయ్యేది. ''భారత్లో తయారీ'' ప్రణాళిక విజయసాధనకు అటువంటి అకుంర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వవలసి ఉంది. ఆ రకమైన ప్రోత్సాహాన్ని అందించటానికి తగిన ప్రభుత్వం విధానాలను ఆయన రూపొం దించవలసి ఉంది. భారతదేశ ఐటి పరిశ్రమ లలో మనం చూస్తున్న అభివృద్ధి, సాఫ్ట్వేర్ పార్క్ ఆఫ్ ఇండియా ద్వారా ఉద్భవించిన ఐటి పరిశ్రమ అనుకూల భారత ప్రభుత్వ పన్నుల విధానం ద్వారానే సంభవించింది. సాఫ్ట్వేర్ పార్క్ ఆఫ్ ఇండియా క్రింద నమోదైన ఐటి కంపెనీ, అది చిన్నదైనా, పెద్దదైనా, భారత్లో ఉన్నా లేకపోయినా, అది ఎగుమతులు చేయ గలిగితే పన్ను రాయితీలకు అర్హమై ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రయోజనం పొందిన అనేక చిన్న కంపెనీలు భారతీయ కంపెనీలుగా పరిణామం చెందాయి. (ఉదాహరణకు టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ మొదలైనవి). గత యుపియే ప్రభుత్వం పన్ను రాయితీలను ఉపసంహరించు కుంది. ఈ పరిణామం చిన్న ఐటి కంపెనీలపై అధిక పన్ను భారాన్ని మోపుతూ అసమాన పోటీకి దారితీస్తుండగా, పెద్ద ఐటి కంపెనీలు అధిక పన్ను మినహాయింపులు, అనేక ఇతర రాయితీలను అందిస్తున్న ''ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు'' తరలిపోయి అధిక ప్రయోజనాలు పొందగలుతున్నాయి. ఒక చిన్న కంపెనీ కూడా ప్రత్యేక ఆర్థిక మండలిలో 25 ఎకరాల కనిష్ట భూమిని కొనగలిగే స్థితిలో లేదు. డిఎల్ఎఫ్, షాపూర్జి సల్లోంజీ లాంటి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రత్యేక ఆర్థిక మండళ్ళలో కొంత స్థలం అద్దెకు ఇస్తున్నా, వారు డిమాండు చేస్తున్న అత్యధిక అద్దెలు భరించే స్థితిలో చిన్న కంపెనీలు లేవు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం గత యుపియే ప్రభుత్వం తీసుకున్న చర్యలను రద్దు చేసి అంతకు ముందున్న స్థితిని పునరుద్ధరి స్తుందా? లేక భారీ, చిన్న కంపెనీలు ఒకేరకమైన ప్రభుత్వ రాయితీలను పొందేటట్లు విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందా? లేదు. ఆయన అలా చేయరు. కాంగ్రెస్, బిజెపిలది ఒకే రకమైన ఆర్థిక విధానం. బిజెపికి ఎన్నికల నిధి ఇవ్వగలిగే స్తోమత చిన్న కంపెనీలకు లేదు. అందువల్ల బిజెపి చిన్న కంపెనీలను ప్రోత్సహించే ప్రశ్నే ఉదయించదు. మోడీ ప్రకటించిన ''భారత్లో తయారీ'' నినాదం ఆయన ప్రసంగాలలో తప్ప ఆచరణలో లేదు. మోడీ సిలికాన్ వ్యాలి పర్యటన ఒక ఇచ్చి పుచ్చుకునే ప్రణాళిక. ప్రభుత్వ మద్దతుతో భారతదేశంలో తమ వ్యాపారాన్ని చేసుకోమని బహుళజాతి ఐటి కంపెనీలను మోడీ ఆహ్వానిం చారు. వాళ్ళు ఆయనకు అత్యధిక ప్రచార హోదాను కల్పిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ తమ దగ్గరున్న డేటాను, సమాచారాన్ని అమెరికా జాతీయ నిఘా సంస్థకు ఎప్పటికప్పుడు అంద జేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా మోడీకి ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమంలో అత్యధిక ప్రచారాన్ని ఇస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని అడ్డుకోవటం లేదా ఆలస్యం చేయటం చేస్తున్నారు (తమకు కావలసింది 8 సెకండ్లలో రాకపోతే వినియోగదారులు మరో సైట్కు మరలిపోతారు). భారతదేశ భారీ ఐటి కంపెనీలు భారత్ మార్కెట్కంటే అవుట్ సోర్సింగ్పై ఆసక్తితో ఉన్నందున, వాళ్ళు విదేశీ కంపెనీలతో సంబంధ బాంధవ్యాలను పెంచు కొని మనదేశం వెలుపల వారి మార్కెట్ను విస్తరించుకుంటున్నారు. తమకు సంబంధ బాంధవ్యాలున్న బహుళజాతి కంపెనీలను మోడీ భారత మార్కెట్కు ఆహ్వానించటం సహజంగా భారతదేశ భారీ ఐటి కంపెనీలకు అనందంగా ఉంటుంది. ఇందుకోసం భారతదేశంలో కార్పొరేట్లు, కార్పొరేట్ మీడియాల మద్దతు పొందటంలో మోడీకి ఎటువంటి సమస్యా లేదు. నరేంద్ర మోడీకి సొంత ప్రచారానికి మించి, మనదేశం యొక్క నిజమైన అభివృద్ధి సాధన ఆయన ఎజెండాలో ఉండే ప్రశ్నే లేదు. 
- - డిబెన్ దాస్ 
(స్వేచ్ఛానువాదం : కొండముది లక్ష్మీప్రసాద్)

Saturday, November 21, 2015

7వ వేతన సంఘం సిఫార్సులు అసంతృప్తికరం-నిరవధిక సమ్మేకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నిర్ణయం


1.     వేతన సవరణ అమలు తేదీ ---1.1.2016 (ఉద్యోగుల డిమాండ్—1.1.2014)
2.    కనీస వేతనం ---ఋ.18000/- (డిమాండ్ –26,000)
3.    ఫిట్మెంట్ ఫార్ములా—బేసిక్ పే కి 2.57 రెట్లు – (డిమాండ్-బేసిక్ పే కి 3.7 రెట్లు)
4.    వార్షిక ఇంక్రిమెంటు –3 శాతం (డిమాండ్-5 శాతం)
5.    టైమ్ బౌండ్ ప్రమోషన్ –10,20,30 సంవత్సరాలకు (డిమాండ్—8,7,6,5 సంవత్సరాలకు)
6.    పే స్కేల్ స్పాన్ –40 సంవత్సరాలు (డిమాండ్—పే స్కేల్ ఓపెన్ ఎండెడ్ గా, మ్యాగ్జిమమ్ అనే పరిమితి లేకుండా వుండాలి)
7.    గరిష్ట  వేతన పెరుగుదల (బేసిక్ ప్లస్ డి ఏ పై)—14.29 శాతం (డిమాండ్—కనీసం 40 శాతం)
8.    కనీస మరియు గరిష్ట మూల వేతనాలు ---ఋ.18,000 మరియు 2,05,400 (1:11.4) –(డిమాండ్--1:8) 
9.    హెచ్ ఆర్ ఏ –తగ్గించింది (50 లక్షల జనాభాకి మించిన నగరాలకు 30 శాతం వున్నది 24 శాతం కు, 5 నుండి 50 లక్షాల వరకు జనాభా వున్న పట్టణాలకు 20 శాతం వున్నది 16 శాతం కు, 5 లక్షల లోపు వున్న స్టేషన్లకు 10 శాతం వున్నది 8 శాతం కు తగ్గించింది. (డిమాండ్-60, 40, 20 శాతం)
10.  సర్వింగ్ మరియు రిటైర్ అయిన వారికి మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్
11.   గ్రూప్ ఇన్సూరెన్సు స్కీమ్
·         1 నుండి 5 స్కేల్సు లో ఉన్న వారికి—కంట్రిబ్యూషన్ ఋ. 1500; ఇన్సూరెన్సు—ఋ.15 లక్షలు
·         6 నుండి 9 వరకు----కంట్రిబ్యూషన్ 2500; ఇన్సూరెన్సు 25 లక్షలు
·         10 నుండి ---------కంట్రిబ్యూషన్ 5000; ఇన్సూరెన్సు—50 లక్షలు
12.  పెన్షన్ పై సిఫార్సులు
·         పే రివిజన్ కు ముందు రిటైరయిన వారికి తరువాత రిటైరయిన వారితో సమం గా పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ ను ఆమోదించింది. ఇందుకోసం 1.1.2016 కి ముందు రిటైరయిన వారి బేసిక్ పే ని నోషనల్ గా 7 వ వేతన సంఘం సిఫార్సు చేసిన సమానమయిన పే స్కేల్ మినిమమ్ వద్ద ఫిక్స్ చేసి, పాత స్కేల్ లో ఎన్ని ఇంక్రిమెంట్సు డ్రా చేస్తే అన్నీ ఇంక్రిమెంట్సును కొత్త స్కేల్ లో కలిపి(ఇంక్రిమెంటు కు 3 శాతం చొప్పున) రివైజ్డ్ నోశానల్ పే ఫిక్స్ చేసి దాని ప్రకారం పెన్షన్ రివైజ్ చేయాలి. మరో ప్రత్యామ్నాయం, పాత బేసిక్ పెన్షన్ ను 2.57 తో హెచ్చించి దానిని రివైజ్డ్ పెన్షన్ గా నిర్ణయించాలి. ఈ రెండింటిలో ఏది మంచిదనుకుంటే దానికి పెన్షనరు ఆప్షన్ ఇయ్యవచ్చు.
·         కనీస పెన్షన్—9000 (కనీస వేతనం ఋ.18000 లో సగం)
·         డి సి ఆర్ జి సిలింగు ను ఇప్పుడున్న ఋ.10 లక్షలనుండి 20 లక్షలకు పెంచింది.
·         పెన్షనర్స్ ఫిక్సెడ్ మెడికల్ అలవెన్స్ ను పెంచకుండా ఋ.500 నే కొనసాగించింది.
వేతన పెరుగుదల కేవలం 14.29 శాతం మాత్రమే ఇవ్వటం, హెచ్ ఆర్ ఏ శాతం తగ్గింపు తదితర తప్పుడు సిఫార్సులకు వ్యతిరేకముగా 27.11.2015న దేశ వ్యాపిత నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, ఆ తరువాత నిరవధిక సమ్మేకి దిగాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్లు నిర్ణయించాయి.



Thursday, November 5, 2015

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు -బి.వి.రాఘవులు వ్యాసం

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు
(బి.వి.రాఘవులు )
రిజర్వేషన్లు బలహీనవర్గాలకు, అంటే వివక్షకు గురయ్యే తరగతులకు ప్రభుత్వాలు ఇచ్చే సదుపాయం. బలహీనవర్గాలను ఆదుకోవ డానికి, వారి పట్ల ఉండే వివక్షను నిర్మూలించ డానికి ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు తీసుకుంటాయి. వాటిలో రిజర్వేషన్లు ఒక భాగం. ప్రభుత్వాలు తీసుకునే వాటిని సాను కూల చర్యలు అంటాం. సానుకూలంగా తీసుకునే చర్యలు రకరకాల పద్ధతుల్లో ఉండొచ్చు. ఈ చర్యల సమూహంలో ఒక భాగమే రిజర్వేషన్లు. ఏదో ఒక రకమైన సానుకూల చర్యలు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. అన్ని రకాల సానుకూల చర్యలు ఒక దేశంలోనే ఉండొచ్చు. కొన్ని దేశాల్లో కొన్ని రకాల చర్యలే ఉండొచ్చు. ఆ దేశంలో ఎవరైతే బలహీన వర్గాలుగా ఉంటారో, వివక్షకు గురవుతూ ఉంటారో అటువంటి వారికి సాయం చేసే ప్రయత్నాలు అన్ని దేశాల్లోనూ జరుగు తున్నాయి. అలాగే భారతదేశంలో కులవివక్ష అనేది ప్రధానాంశంగా ఉంది. ఇప్పటికి కూడా దళితులను అంటరానివారిగా చూస్తూ, వారిపట్ల అనేక విధాలుగా, అన్ని రంగాలలోనూ వివక్ష చూపుతున్నారు. బిసిలను అంటరానివారిగా చూడకపోయినా, వివక్షకు గురిచేస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, కుల వివక్షకు గురవుతున్న వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని మనం కోరుతున్నాం.
మన దేశంలో మహిళల పట్ల కూడా వివక్ష చూపుతున్నారు. వివక్ష కొనసాగుతుంది కాబట్టి వారికి కూడా కొన్ని సానుకూల చర్యలు అమలు జరుపుతున్నారు. సానుకూల చర్యలలో భాగంగా స్థానిక సంస్థల్లో, ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. అలాగే వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించారు. అమెరికా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో జాతి వివక్ష ప్రాతిపదికన ఉండే వ్యత్యాసాలను, అసమానతలను అధిగమించ డానికి కొన్ని సానుకూల చర్యలను అమలు జరుపుతున్నారు. చైనాలో వెనుకబడిన తెగలు, మైనారిటి జాతులు, కొండ ప్రాంతాలకు చెందిన ప్రజలు తదితరులను సమాజంలో అభివృద్ధి చెందినవారిస్థాయికి తీసుకురావడానికి సానుకూల చర్యలను అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశాన్ని పరిశీలన చేసినా ఏదో ఒక మోతాదులో, కొన్ని తరగతుల ప్రజలకు సానుకూల చర్యలను అమలు చేస్తున్నారు
అమెరికా మనకన్నా ముందు పెట్టుబడి దారీ, ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందింది. మనకన్నా ముందు రాజ్యాంగాన్ని, ఎన్నికల విధానాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం. నూటికి 98 మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. కులవివక్ష లేనటువంటి దేశం. అయినా అలాంటి దేశంలో కూడా వివక్ష మూలంగా ఇంకా సానుకూల చర్యలు అమలు జరుగు తూనే ఉన్నాయి. ఇంగ్లాండులో కూడా కొన్ని తరగతులకు సానుకూల చర్యలు అమలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి అయిన దేశాల్లో కూడా ఇప్పటికి ఈ సానుకూల చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వివక్ష ఉన్నంత కాలం, బలహీనవర్గాలు ఇతర తరగతులతో సమానంగా అభివృద్ధి కాలేనంతకాలం ఇటు వంటి సానుకూల చర్యలకు డిమాండ్‌ ఉంటుంది. పాలకులు అలాంటి చర్యలను అవస రాన్ని బట్టి ఉపయోగించుకుంటారు.
ఈరోజు గుజరాత్‌లో పటేళ్ళ ఉద్యమం జరుగుతున్నది. ఇస్తే అందరికి రిజర్వేషన్లు ఇవ్వండి లేదా అందరికీ రద్దు చేయండనే నినాదంతో ఈ ఉద్యమం జరుగుతున్నది. ఇటువంటి డిమాండ్లు, ఆందోళనలు అన్ని దేశాల్లో వస్తున్నాయి. అయినా అ డిమాండ్లను బట్టి సానుకూల చర్యలేమి ఆగిపోవడంలేదు.
ప్రపంచంలో వివిధ దేశాల్లో సానుకూలమైన చర్యలు ఉన్నాయి. అన్ని దేశాల గురించి పరిశీలించకపోయినా మూడు దేశాల గురించి తెలుసుకుందాం. ఆ మూడు దేశాలే ఎందు కంటే, ఈ మూడూ విభిన్నమైన పద్ధతుల్లో ఉన్నాయి. ఆ మూడు దేశాల్లో అమెరికా ఒకటి. అమెరికాలో మహిళలు, నల్లజాతి ప్రజలకు సంబంధించి ప్రధానమైన సానుకూల చర్యలు తీసుకుంటున్నారు. వివిధ తరగతుల సామా జిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు చేయడం కోసం ఈ సానుకూల చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ రెండు తరగతులకు మాత్రమే పరిమితం చేయడం లేదు. లాటిన్‌ అమెరికన్‌ దేశాల నుండి వచ్చే స్పానిష్‌ మాట్లాడేవాళ్లు, మనలాంటి దేశాల నుండి వెళ్లిన ఆసియా జాతుల వారికి కొన్ని అవకాశాలు కల్పిస్తున్నాయి. వాళ్ల దేశ చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాల్లో చదివేవాళ్లలో వైవిధ్యం ఉండాలి. ఈ వైవి ధ్యాన్ని చూపించడం కోసం ఇక్కడి నుంచి తెలివైన విద్యార్థులను తీసుకెళ్లి, వాళ్లకి స్కాలర్‌షిప్‌లను ఇచ్చి విద్యాలయాలలో చేరు కొని వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి. రెడ్‌ ఇండియన్స్‌కు రిజర్వు చేసిన ప్రాంతం వారికి మాత్రమే ప్రత్యేకించి ఉంటుంది అమెరికాలో రిజర్వేషన్లు ఆ విధంగా అమలు జరుగు తున్నాయి. వైవిధ్యాన్ని పెంపొదించడం కోసం చర్యలు తీసుకుంటారు తప్ప రిజర్వేషను ఉండదు. ఇది అమెరికాలో పద్దతి. మొట్టమొదట ఈ వైవిధ్యమనేది అందరికి వర్తించలేదు. ప్రభుత్వ సహకారం పొందే వాళ్లు ఈ వైవిద్యాన్ని పాటించాలి. ప్రభుత్వం సహాయం పొందని యూనివర్సిటీలు ఉంటాయి. సంస్థలు వుంటా యి. ఈ సానుకూలమైన చర్యలు అనేవి వ్యక్తుల పట్ల చూపిస్తే రాజ్యంగానికి వ్యతిరేకం. ఈ చర్చలు, గొడవలు అమెరికాలో కొనసాగు తున్నాయి. వైవిధ్యం పాటించని కంపెనీల మీద కేసులు వేస్తాయి. వైవిధ్యం ఎందుకు లేదు అని విచారణ చేస్తారు. వైవిధ్యం లేకపోతే ఒత్తిడి చేస్తారు. ఇలాంటివి కొన్ని ఫలితాలు ఇస్తాయి. రంగు వివక్ష చాలా దుర్భరమైంది. ఈ విష యంలో ఇంకా అమెరికాలో మార్పు లేదని అంటున్నారు.
ఇక రెండో దేశం మలేషియా. 70శాతం ప్రజలు మలయా జాతికి చెందిన వారు. పాలకవర్గాలు మలయా జాతి వాళ్లే. మలయా జాతికి చెందిన వాళ్లే రాజులు. మలయా జాతికి చెందిన వాళ్లే పాలన కొనసాగించేవారు. డచ్‌వాళ్లు మలయా పాలకులు ఒప్పందం చేసుకున్నప్పుడు ఆర్థికంగా కీలకమైన ప్లాంటేషన్స్‌ను డచ్‌, ఇంగ్లీషు వాళ్లు ఆక్రమించు కున్నారు. చిన్నచిన్న పనుల్లోకి మలయా ప్రజలను నెట్టివేశారు. వెట్టిచాకిరి, గొడ్డుచాకిరి చేసే పరిస్థితుల్లోకి మలయా జాతి ప్రజలు వెళ్లిపోయారు. చైనా నుండి వచ్చిన కూలీలు పరిశ్రమలలో పనిచేసేవారు. పరిశ్రమలు ఎక్కడుంటే పట్టణాలు అక్కడ ఉంటాయి. పట్టణాల్లో చైనా వాళ్లు ఉన్నారు. గ్రామాల్లో మలయా జాతి ప్రజలు ఉన్నారు. ఆర్థిక అసమానతలు పెరిగాయి. మలేషియా కు స్వాతంతం వచ్చిన తర్వాత ఇది సామాజిక సమస్యగా తయారైంది. జాతీయ ప్రభుత్వాలు మలేజాతి ప్రజలకనుకూలంగా మలేషియాలో ఉండే ప్రతి కుటుంబానికి భూమి ఇచ్చారు. బ్యాంకుల అప్పులు, ఉద్యోగాల్లో 70శాతం ఇచ్చా రు. ఈ పాతిక ముప్ఫై సంవత్సరాలలో మలయా జాతి ప్రజల్ని అక్షరాస్యుల్ని చేయాలని, వారిలో పెట్టుబడిదారీ వర్గాన్ని తయారు చేయా లని ప్రయత్నించారు. మలయా ప్రజలను అభివృద్ధి చేయటానికి ఈ సానుకూల చర్యలను తీసుకున్నారు.
ఉత్తర ఐర్లాండ్‌: మార్క్స్‌్‌ ఇండియా గురించి రాసే దానికన్నా ముందే ఐర్లాండ్‌ గురించి రాశారు. జాతుల సమస్య గురించి రాసేటప్పుడు దీని గురించి రాసారు. ఐర్లాండ్‌ ఇంగ్లాండు పక్కనే ఉంటుంది. ఐర్లాండ్‌, ఇంగ్లాండు, స్కాట్లాండ్‌ పక్కపక్కనే ఉంటాయి. వీటన్నింటిని కలిపి గ్రేట్‌ బ్రిటన్‌ అంటారు. ఐర్లాండు ప్రధా నంగా వ్యవసాయ దేశం. ఉత్తర ఐర్లాండులో క్యాథలిక్కులు దక్షిణ ఐర్లాండులో ప్రొటెస్టెంట్లు మెజారిటిగా ఉండేవారు. మొత్తంగా ఐర్లాండులో చూసుకుంటే ప్రొటెస్టెంట్లు మెజారిటి. ఉత్తర ఐర్లాండు వీడిపోయిన తర్వాత క్యాథలిక్‌లు మైనారిటీగా మారారు. వారిని చాలా హీనంగా చూసేవారు. క్యాథలిక్కులు సాయుధ పోరాటం చేశారు. తర్వాత సంఘర్షణలను తగ్గించటం కోసం 1989లో ఫెయిర్‌ ఎంప్లాయిమెంటు చట్టం పెట్టారు. ఉపాధికి జనాభా నిష్పత్తిని పాటించడం వీటిలో ఒకటి. కొన్నిటికి అవసరమైన వారిలభ్యతను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఒకవేళ అమలు జరపకపోతే కోర్టుకు వెళ్లొచ్చు. మూడు నాలుగు సార్లు విచారణ జరిపి ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆ రకంగా సంఘర్షణను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు దేశాలను పరిశీలిస్తే మూడు రకాల వివక్షను అధిగమించడానికి సానుకూలమైన చర్యలను ఉపయోగిస్తున్నారు.
భారతదేశం: రాజ్యాంగంలో దళితులకు విద్యా ఉద్యోగాలలో 17 శాతం రిజర్వేషన్లు గ్యారంటి చేశారు. అర్హులు లేకపోతే ఆ స్థానా లను ఖాళీగా ఉంచుతారు. జనాభా నిష్పత్తి ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లలో దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన తరగతులకు 50 శాతం పరిమితిని విధించారు. జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలి. అంబేద్కర్‌ కంటే ముందుగానే రిజర్వేషన్లు వచ్చాయి. బ్రిటిషు వారు కూడా రిజర్వేషన్లు అమలు జరిపారు. రిజర్వేషన్లు మొదట దళితుల కోసం రాలేదు. హిందు, ముస్లింలను విభజించటం కోసం వచ్చాయి. ప్రారంభంలో రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. కమ్యూనల్‌ అవార్డు పేరుతో దీనిని అమలు చేశారు. విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు మొదట బ్రిటిషు ప్రాంతంలోని దక్షిణ భారత దేశంలో ప్రారంభమయ్యాయి. జాతీయోద్యమం దాన్ని అంగీకరించింది. బ్రహ్మణ వ్యతిరేక ఉద్యమం దక్షిణాన బలంగా ఉంది. జాతీయోద్యమానికి అప్పట్లో రెండు సమస్యలు ఎదురయాయి 1. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా భారతీయులందరిని ఐక్యం చేయాలి. 2. మతపరమైన ప్రాతిపదిక మీద ముస్లింలను వేరుచేసి, ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే బ్రిటిషు వారి ప్రయత్నాన్ని ఎదుర్కోవాలి. దేశం విడిపోనక్కర్లేదని, అందరి ప్రయోజనాల పరిరక్షణ కోసమే జాతీయో ద్యమం ఉందని చెప్పారు. అటు ముస్లింలకు ఇటు దళితులకు రిజర్వేషన్లు కల్పించాలి. ఆరకంగా పాలక వర్గాలు రిజర్వేషన్లను కల్పించాయి. ప్రారం భంలో అంబేద్కర్‌ని అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం ముంబయిలో ఓడించింది. ఆ తర్వాత బెంగాల్‌ నుండి ముస్లిం లీగ్‌ అభ్యర్థిగా గెల్చి రాజ్యాంగ సభ సభ్యుడయ్యారు. దేశ విభజన నిర్ణయంతో ఆ స్థానాన్ని కోల్పోయారు. కాంగ్రెస్‌ మనసు మార్చుకుని ఉప ఎన్నిక ద్వారా ఆయనను మళ్లీ గెలిపించి రాజ్యంగసభకు ఛైర్మెన్‌గా చేశారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపర్చడంలో ఆయన కీలకపాత్ర నిర్వహించారు.
వివక్ష అనేది అనేక రూపాల్లో ఉంటుంది. సామాజిక ,ఆర్థిక, ఉపాధి, లింగ భేదంతో ఉండొచ్చు. పనుల్లో వివక్ష., వృత్తిరీత్యా వివక్ష. సంపద పరంగా వివక్ష. తదితరాలున్నాయి. అంటరానితనం వివిధ రూపాల్లో ఉంటుంది.
భారతదేశంలో కులవివక్ష ప్రధానమైనది. సమాజ నిర్మాణంలో నుంచి వచ్చిన కులవివక్ష, ఆర్థిక, సామాజిక రూపాల్లో కొనసాగు తున్నది. రుణాల్లో వివక్ష, మార్కెట్లో వివక్ష, వినిమయంలో వివక్ష చూస్తున్నాం. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో కూడా వివక్ష చూస్తున్నాం. భౌతికంగా కూడా వివక్షను చూస్తున్నాం.
సానుకూల చర్యలు కూడా అనేక రూపాల్లో ఉండవచ్చు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యలో రిజర్వేషన్లు అటువంటివే. కోటా విధానం, అలాగే ఇంకా అనేక రూపాల్లో సంక్షేమ హాస్టళ్ళలో నూటికి నూరుశాతం దళితులు, గిరిజనులు ఉంటారు. సానుకూల చర్యల్లో రిజర్వేషన్లు అనేది ఒకటి. ఉపాధిలో వాటా కోసం ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు కావాలనే డిమాండు ముందుకొచ్చింది. సరళీకరణ విధానం తర్వాత అభివృద్ధి సమస్య ముందుకు వచ్చింది. అభివృద్ధికి సంబంధించి బడ్జెట్‌లో వాటా ఉండాలి. సబ్‌ప్లాన్‌ పరంగా అభివృద్ధి పథంలో ముందుకు పోవచ్చు. బడ్జెట్‌ను ధనవంతులు ఉపయోగించుకోవడం ఇప్పుడు ఎక్కువైంది.
సరళీకరణ విధానంలో సామాజిక న్యాయం దెబ్బతింది. విద్య, వైద్య సేవలను డబ్బు రూపంలోకి మార్చారు. రక్షిత మంచినీటి పథకం స్థానంలో నీళ్లని కొనే పద్దతిని రుద్దుతున్నారు. గ్యాస్‌సబ్సీడీ, విద్యుత్‌ సబ్సిడీ తీసేస్తామం టున్నారు. ఉచితంగా పొందే సర్వీసులన్నీంటిపై ఇలా దాడి చేస్తున్నారు.
బలహీనవర్గాలకు ఉపయోగపడే ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకానికి, రిజర్వేషను అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిలో అమలు జరుగుతాయి. ప్రభుత్వ రంగంలో కూడా కాంట్రాక్టు పద్దతి ద్వారా ఉద్యోగాలను ప్రయివేటీకరణ చేస్తూ, రిజర్వే షన్లను వమ్ము చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిలో కూడా మినహాయింపు ఉన్నాయి. సరళీకరణ విధానాల వల్ల ఉన్న ప్రభుత్వ రంగం ప్రయివేటీకరణ అవుతున్నది.
పర్మినెంటు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ తదితర పేర్లతో కార్మికులను తీసుకుంటున్నపుడు రిజర్వేషన్లు అమలు కావటం లేదు. ఉన్న ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుంటే రిజర్వేషన్లు ఉంటాయి. చాలా సంఘాలు మొక్కుబడిగా చేస్తున్నాయి. రాజ్యాంగంలో పెట్టిన రిజర్వే షన్లను బహిరంగంగా రద్దుచేసే శక్తి పాలక వర్గాలకు లేదు. ఈ రిజర్వేషన్లు ఉండే మూడు అంశాల కోసం పోరాటాలు చేయాలి. ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడం, విద్యలో ప్రయివేటు రంగం ఉండకూడదనే డిమాండు చేయాలి. ప్రభుత్వ రంగాన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి ఈ సరళీకరణ విధానాలు తీసుకున్న ప్పుడు సామాజిక న్యాయం గురించి ఆలోచిం చాలి. ఉపాధి లాంటి వాటి కన్నా రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉండాలని పాలకవర్గాలు ప్రయత్నం చేస్తాయి. పాలకవర్గాల్లో వైవిధ్యం ఉండాలని కోరుకుంటారు.100మంది పెట్టుబడి దారులుంటే కొంతమంది దళితులు ఉండటం, కొంత మంది ముస్లింలు ఉంటే పాలక వర్గాలకు లాభం. సానుకూలమైన చర్యలు అనేవి పెట్టుబడిదారులకు ఉపయోగపడేవి తప్ప విప్లవాలను ఉధృతం జ్ఞాపకం పెట్టుకోవాలి.
పెట్టుబడిదారులకు ఇప్పుడు ప్రభుత్వ రంగ అవసరం తీరిపోయింది కాబట్టి రద్దు చేయమంటున్నారు. ప్రభుత్వ రంగం ఉంటే కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి మనం ఉంచమంటున్నాం. ఇతర అంశాలలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగకపోయినా రాజకీయ రిజర్వేషన్లు బలహీనవర్గాల్లో పకడ్బందీగా అమలు జరుగుతున్నాయి. రాజకీ య రిజర్వేషన్లు పాలకవర్గాలను సృష్టించడా నికి ఒక మార్గం. సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటంలో ప్రైవేటురంగంలో రిజర్వే షన్ల కోసం జరిగే పోరాటం ముఖ్యమైన అంశంగా ఉంది.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు వద్దు అనే వాదనకు, రిజర్వేషన్లను రద్దు చేయాలి అనే వాదనకు పెద్ద వ్యతాస్యం లేదు. కొత్త వాదన ఏమిటంటే విదేశీ పెట్టుబడులు వస్తే మనదేశం అభివృద్ధి అవుతుంది. సమ్మెలు, ఆందోళనలు చేస్తే విదేశీ పెట్టుబడులు రావనే పేరుతో కార్మికుల సమ్మెలు, ఆందోళనలపై ఆంక్షలను విధిస్తున్నారు. కార్మిక చట్టాలు అమలు చేస్తే విదేశీ పెట్టుబడులు రావు. అలాగే సరళీకరణ విధానాలకు, రిజర్వేషన్లకు పొత్తు కుదరదని ప్రచారం చేస్తున్నారు. సరళీకరణ విధానంలో మార్కెట్టు అన్ని అంశాలను నిర్ణయం చేయాలి. చట్టాలు యజ మానుల కనుకూలంగా, పట్టువిడుపులతో వినియోగించుకొనే విధంగా ఉండాలి. రిజర్వే షన్లు యజమాని తన అవసరాలకను గుణంగా కార్మికులతో వ్యవహరించటానికి అటంకం కల్పిస్తాయి. అందువలన ప్రయివేటీకరణ విధా నాలు తీవ్రమౌతున్న క్రమంలో విదేశీ పెట్టుబ డుల రాక, అభివృద్ధి పేరుతో పాలకవర్గాలు రిజర్వేషన్లకు మొత్తంగా ఎసరు పెడుతున్నాయి.
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించ టానికి బిజెపి వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న రిజర్వేషన్లను సైతం రద్దు చేయాలని ఆర్‌యస్‌యస్‌, బిజెపిలు చర్చను ప్రారంభించాయి. నిరుద్యోగం పెరిగే కొద్ది దళి తులు, గిరిజనుల్లో చేరితే మాకు కూడా ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు పెరుగుతున్నాయి.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు ్ల వస్తే బాగుపడతామని అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ప్రైవేటురంగంలో రిజర్వేషన్లపై ఆసక్తి ఉన్న తరగతుల నన్నిటినీ సమీకరించాలి. రిజర్వే షన్లతో పాటు సబ్‌ప్లాన్‌ కోసం జరుగుతున్న ఆందోళనలోనూ వీరిని భాగస్వాములుగా చేయాలి. ఈ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆందోళన బలోపేతమైతేనే, ఈ కోర్కెలను సాధించుకోవటం సాధ్యమౌతుంది. సామాజిక న్యాయానికి సంబంధించిన ఈ ముఖ్యమైన అంశం మీద మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది.
- బి వి రాఘవులు
రచయిత సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు

Tuesday, September 1, 2015

మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలలో డిమాండ్స్ పరిష్కారానికి ప్రభుత్వము ముందుకు రానందున సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయండి

సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెకి సంబంధించిన 12 డిమాండ్స్ పై ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం కేంద్ర కార్మిక సంఘాలతో ఆగస్టు 26, 27 తేదీలలో రెండు సార్లు చర్చలు జరిపి డిమాండ్స్ పరిష్కరించకుండానే సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగుల సంఘాలు తిరస్కరించాయి. సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెని యధాతథంగా జరపాలని పిలుపునిచ్చాయి.

సమ్మె హక్కు తో సహా కార్మిక హక్కులు తొలగించేందుకు ప్రతిపాదించిన చట్టాల సవరణలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వము ఈ చర్చలలో ముందుకు  రాలేదు. రాజస్తాన్, ఛత్తీస్ఘర్, మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కార్మిక హక్కులు తొలగించే విధముగా చట్టాలను ఇప్పటికే ఆమోదించగా వాటిని కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్ర పతి ఆమోదించారు. కార్మిక చట్టలకు తాము ప్రతిపాదించిన సవరణలపై త్రిపక్ష సంప్రదింపులు జరుపుతామని మాత్రమే కేంద్ర ప్రభుత్వము అంటున్నది. కానీ అటువంటి త్రైపాక్షిక సమావేశాలలో ఏకగ్రీవముగా అందరి ఆమోదాన్ని పొందిన ప్రతిపాదనల మేరకు మాత్రమే  చట్టాలను సవరిస్తామని  హామీ ఇచ్చేందుకు తిరస్కరించింది. నామమాత్రముగా త్రైపాక్షిక సమావేశం జరిపి తాను చేయదలచుకున్న కార్మిక వ్యతిరేక సవరణలు చేయటమే ప్రభుత్వ ఉద్దేశమని దీనివలన రుజువవుతున్నది. కార్మిక హక్కులు రద్దు చేసి  కార్మికులను ఉద్యోగులను బానిసలుగా మార్చే  ఈ చట్ట సవరణలకు కార్మిక వర్గం ఎట్టి పరిస్థితిలోను ఆమోదించకూడదు.

ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్మెంట్ ను ఆపేందుకు పూర్తిగా తిరస్కరించింది. 

బోనస్  అర్హతపై వున్న  సిలింగును రు.10,000 లు నుండి రు.21000లు,   లెక్కింపు పై వున్న రు.3500 సిలింగును  రు.7000కు  పెంచే ప్రతిపాదన చేసిందేకాని ఈ సిలింగులను తొలగించాలనే డిమాండుకు ప్రభుత్వము అంగీకరించలేదు. యజమానుల లాభాలపై సిలింగు లేనప్పుడు కార్మికుల బోనస్ పై సిలింగు అసంగతం.

 డి సి ఆర్ జి చెల్లింపు పై వున్న రు.10 లక్షల సిలింగును తొలగించేందుకు, డి సి ఆర్ జి ఫార్ములాని మెరుగు పరచేందుకు అంగీకరించలేదు. 

కనీస పెన్షన్ రు.1000 నుండి రు.3000కు పెంచాలనే డిమాండును అంగీకరించలేదు. 

ఈ పి ఎఫ్ లెక్కింపు పై వున్న రు.15000 వేతన సిలింగును తొలగించేందుకు అంగీకరించలేదు. పెన్షన్ భద్రతకు హామీ ఇవ్వలేదు.

 కనీస వేతనం విషయం లో కొత్తగా ఒక ఫార్ములాని తయారు చేసి దానిప్రకారం చట్టం తెస్తామని ప్రభుత్వము అనటంలో  అర్థం లేదు. 15వ భారత కార్మిక సదస్సు గతం లోనే ఇందుకు సంబంధించి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు ప్రకారం వచ్చేదానికి అదనముగా మరో 25 శాతం కలపాలని సుప్రీం కోర్టు చెప్పింది. దీని ప్రకారం కనీస వేతనాన్ని నిర్ణయించాలని  2012 మరియు 2015లో  జరిగిన 44వ  మరియు 46వ  భారత కార్మిక సదస్సులలో యాజమాన్యాల, ప్రభుత్వాల, కార్మిక సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు.  దీని ప్రకారం అయితే కనీస వేతనం రు.20,000 లు వుండాలి. కానీ కార్మిక సంఘాలు రు.15,000లు కి తగ్గకుండా కనీస వేతనం వుండాలని కోరుతున్నాయి. ప్రభుత్వము దీనికి అంగీకరించకుండా ఇంకా వేరే ఏదో ఫార్ములాను తాను తయారు చేస్తాననటం, యాజమాన్యాలతో  సంప్రదించిన తరువాత రు.7100లు కనీస వేతనాన్ని ప్రతిపాదిస్తాననటం  అంగీకరించిన దానినుండి వైదొలగటమే.

 కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ కార్మికులతో సమంగా వేతనాలు ఇచ్చేందుకు అంగీకరించకుండా వారికి కనీస వేతనం చెల్లింపు జరిగేలా చూస్తాననటం అర్థరహితం. ఇప్పుడున్న చట్టాల ప్రకారం కాంట్రాక్టు కార్మికులకి కనీస వేతనం చెల్లింపు జరగాల్సిందే.

2013 మరియు 2015 లో జరిగిన 45వ మరియు 46వ భారత కార్మిక సదస్సులు  అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర ప్రభుత్వ స్కీములలో పని చేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం తదితర కార్మిక హక్కులిచ్చేందుకు సిఫార్సు చేశాయి. ప్రభుత్వము కూడా ఈ సిఫార్సు చేయటం లో భాగస్వామిగా వున్నది. కానీ ఈ సిఫార్సు అమలుకు ఈ చర్చలలో ప్రభుత్వము ముందుకు రాలేదు.

నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నప్పటికి ప్రభుత్వము ధరలు తగ్గుతున్నాయని బుకాయిస్తున్నది. ధరలు పెరగకుండా వుండేందుకు నిత్యావసర సరుకుల మార్కెట్లో స్పెక్యులేషన్/ఫార్వర్డ్ ట్రేడింగ్ ను నిషేధించాలని, పౌర సరఫరా  వ్యవస్థను పటిష్టం చేయాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ ను పట్టించుకోలేదు.

 ఉద్యోగావకాశాలు పెంచేందుకు నిర్దిష్ట చర్యలు ప్రతిపాదించలేదు.

కాబట్టి ప్రభుత్వ వైఖరి ఏ మాత్రం అనుకూలంగా లేదని, సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెని యధాతథంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు (ఐ ఎన్ టి యు సి, హెచ్ ఏం ఎస్,   ఏ ఐ టి యు సి, సి ఐ టి యు, ఏ ఐ యు టి యు సి, టి యు సి సి, ఎస్ ఇ డబ్లూ ఏ , ఏ ఐ సి సి  టి యు , యు టి యు సి, ఎల్ పి ఎఫ్)  మరియు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, బ్యాంకు ఇన్సూరెన్సు ఉద్యోగుల సంఘాలు, బి ఎస్ ఎన్ ఎల్  ఉద్యోగుల సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 

సమ్మెని వ్యతిరేకించవద్దని బి ఎం ఎస్ కు విజ్ఞప్తి చేశాయి.


సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెలో పాల్గొందాం, కార్మిక హక్కులు సౌకర్యాలపై దాడిని తిరస్కరించుదాం.

Tuesday, May 5, 2015

అంబేద్కర్‌పై కాషాయ పడగనీడ

 భారతదేశ ఎన్నికల మార్కెట్లో ప్రవేశపెట్టబడిన వివిధ రాజకీయ ప్రారిశ్రామికవేత్తలు తయారుచేసిన అంబేద్కర్‌ ప్రతిమలు అసలు అంబేద్కర్‌ను మసకబారుస్తున్నాయి. అవి దళితుల విమోచనకు ఉపయోగపడే రాజకీయ ఆయుధాల్ని నాశనం చేస్తున్నాయి. ఈ ప్రతిమల మధ్య ఛాయలో తేడాలున్నప్పటికీ ఇవన్నీ అంబేద్కర్‌కు నయా ఉదారవాదరంగు పులుముతున్నాయి.

 అంబేద్కర్‌ దళితులందరికీ ఆరాధ్యదైవం అయ్యాడనటంలో సందేహం లేదు. ఆయన వారికోసం ఏక వ్యక్తిగా, ఏకైక ధ్యేయంతో చేసిన కృషికి వారలా భావించటం సహజం. అది నిజమైనప్పటికీ అంబేద్కర్‌ను పూజ్యనీయుడిగా ప్రతిష్టించటంలోనూ, ప్రోత్సహించటంలోనూ పాలకవర్గాలు ఉత్ప్రేరక పాత్ర పోషించాయి. ఈ మధ్యకాలంలో బిజెపి అంబేద్కర్‌ను బాహాటంగా సొంతంచేసుకోవాలనే ప్రయత్నాల వెనుక కారణాల గతిశీలతను దళితులు అర్థంచేసుకోవాల్సి వుంది.

పూజ్యనీయునిగా...

                   రాజకీయ హిందూకు ప్రాతినిధ్యంవహిస్తున్న కాంగ్రెస్‌ అంబేద్కర్‌కు ప్రధాన ప్రత్యర్థి. 1932లో జరిగిన రౌండు టేబుల్‌ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు అంబేద్కర్‌ చేసిన ప్రయత్నాలను గాంధీ తీవ్రంగా వ్యతిరేకించటమే కాకుండా, దళితుల స్వతంత్ర రాజకీయ అస్తిత్వం ఏర్పడే సాధ్యతను శాశ్వతంగా దూరంచేసిన పూనా ఒడంబడిక చేసుకునేలా ఆయనపై ఒత్తిడి చేశాడు. అధికారం బదిలీ అయిన తరువాత అంబేద్కర్‌ను రాజ్యాంగ పరిషత్తులోకి ప్రవేశించకుండా కాంగ్రెస్‌ చేయగలిగిందంతా చేసింది. కానీ అంతలోనే అది ప్లేట్‌ మార్చింది. వివరణ కోసం పిట్టకథలు ఎన్నిచెప్పినా రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశించే అవకాశంలేని అంబేద్కర్‌ను ఎన్నికయ్యేలా చేసి, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడయ్యేలా చూడటం వెనుక గాంధీ వ్యూహాత్మక మేథస్సు వుంది. రాజ్యాంగంలో దళితుల హక్కులకు భద్రత కల్పించినందుకు ప్రతిగా అంబేద్కర్‌ ఒక రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాడు. ఆ సౌభ్రాతృత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. హిందూ కోడ్‌ బిల్లు విషయంలో తిరోగమన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నెహ్రూ మంత్రివర్గంనుంచి అంబేద్కర్‌ వైదొలిగాడు. ఆ తరువాత తనను ఒక కూలీగా వాడుకుని వదిలేశారని, ఈ రాజ్యాంగం ఎవరికీ పనికిరానిదని, దానిని కాల్చటానికి తాను ప్రథముడిననీ అంబేద్కర్‌ అన్నాడు. కాంగ్రెస్‌ ఒక తగలబడుతున్న గృహంలాంటిదని, దానిలోకి ప్రవేశిస్తే దళితులు ప్రమాదంలో పడతారని ఆయన పేర్కొన్నాడు. అయితే అనేకమంది 'అంబేద్కరైట్స్‌' కాంగ్రెస్‌లో చేరటానికి, 'అంబేద్కరిజానికి' సేవచేయటానికి ఆయన వ్యాఖ్యలు వారినేమీ నిరుత్సాహపరచలేదు.

                 హరిత విప్లవాన్ని, భూ సంస్కరణలను ప్రవేశపెట్టి గ్రామీణప్రాంతంలో అశేషంగా వున్న శూద్ర కులాల నుంచి ధనిక రైతాంగ వర్గాన్ని కాంగ్రెస్‌ చాకచక్యంగా ఆవిర్భవింపజేసింది. చాలాకాలం తనకు మిత్రపక్షంగా వున్నప్పటికీ ఈ వర్గం తన స్వంత రాజకీయ ఆకాంక్ష పెంచుకుంది. ప్రాంతీయపార్టీలను స్థాపించి క్రమక్రమంగా స్థానిక, ప్రాంతీయస్థాయిలలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్నికల రాజకీయాలలో పోటీ పెరిగి సామాజిక న్యాయం, మత సంస్కరణల పేరిట రాజ్యాంగంలో అత్యంత ప్రావీణ్యతతో భద్రపరిచిన కులం, కమ్యూనిటీల రూపంలో ఓటుబ్యాంకులు ముందుకొచ్చాయి. అక్కడి నుంచి అంబేద్కర్‌ను ఉద్దేశపూర్వకంగా స్వంతం చేసుకునే ప్రయత్నం మొదట కాంగ్రెసుతో మొదలైంది. ఆయన ప్రధాననమైనవిగా భావించిన విషయాలు మసకబారాయి. ఆయన్ని ఒక పద్ధతి ప్రకారం జాతీయవాదిగా, కాంగ్రెసువాదివాదిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, రాజ్యాంగనిర్మాతగా కొనియాడారు. అంబేద్కర్‌ గురించిన ఈ ప్రచారం అనేక పర్యవసానాలకు దారితీసింది. అంబేద్కర్‌ను ప్రేమించే అశేష ప్రజానీకం కాంగ్రెసుకు అనుకూలంగా మారారు. అవకాశవాద దళిత నాయకులు కాంగ్రెస్‌లో చేరటం వేగవంతమైంది. దళిత ఉద్యమం స్థితిభ్రాంతి(డిస్‌ఓరియంటేషన్‌)కి గురై అస్థిత్వ రాజకీయాల పంచన చేరింది. అంబేద్కర్‌ సిద్ధాంతంలోని విప్లవపార్శం క్రమేణా బలహీనపడింది. మిగిలిన పార్టీలు కూడా నెమ్మదిగా తమ తమ అంబేద్కర్‌ రూపాలను నిర్మించి పోటీలో ప్రవేశిం చాయి. తన ప్రభావాన్ని విస్తృత పరచుకోవటానికి, తన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవ టానికి కావాల్సిన వ్యూహాత్మక విషయాల్ని పట్టించుకో వటానికి సంఫ్‌ు పరివార్‌ రెండోతరం సంస్థల్ని వినియోగిస్తున్నది. దళితులను తనవైపు ఆకర్షించటానికి సమాజిక్‌ సమరసతా మంచ్‌ (ఒక సామాజిక ఆత్మీయ వేదిక)ను ఏర్పాటుచేసింది. కమ్యూనిస్టు, దళిత ఉద్యమాలతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ 1925లో పుట్టింది. ప్రారంభంలో ఊహాత్మక హిందూ మెజారిటీపై ఆధారపడినప్పటికీ 1977లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రభంజనంలో 94 సీట్లు గెలిచేదాకా సామాజికంగాను, రాజకీయంగాను ప్రగతి సాధించటంలో విఫలమైంది.

'కాషాయీకరణ'కు గురవుతున్న అంబేద్కర్‌

                 ప్రారంభంలో అంబేద్కర్‌ హిందూ వ్యతిరేకిగా నిందింపబడటంతో ఆయన్ని అంతర్లీనంగా ద్వేషించి బాల్‌థాకరేలాగా అంబేద్కర్‌ను వ్యతిరేకించే దళితులపై ఆధారపడ్డారు. ఐతే రాజకీయాధికార మాంసం రుచిమరిగాక దేశవ్యాప్తంగా దళితులకు ఆరాధ్యదైవమైన అంబేద్కర్‌ను విస్మరించటం సాధ్యపడదని బిజెపికి అర్థమైంది. ఆయన యాదృచ్ఛికంగా ఇచ్చిన ప్రకటనల్ని సందర్భరహితంగా ఉటంకిస్తూ, వాటిని గోబెల్స్‌ తరహా అబద్ధాలతో కలగలిపి అంబేద్కర్‌ను కాషాయీకరించేందుకు బిజెపి ప్రణాళిక రచించింది. అంబేద్కర్‌ను హెగ్డేవార్‌తో పోలుస్తూ వారిద్దర్నీ 'డాక్టర్లు' అని పేర్కొనటం ద్వారా ఆయనపై మొట్టమొదటిసారి కాషాయం వేటు పడింది. మెట్రిక్‌ పాసైన తర్వాత ఆర్‌ఎమ్‌పిగా మెడికల్‌ ప్రాక్టీస్‌ చేసిన హెగ్డేవార్‌ను విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాలలో రెండు విభిన్న విషయాలపై డాక్టరేట్‌ చేసిన అంబేద్కర్‌తో సమానంగా చూపే ప్రయత్నం జరుగుతోంది. వీరిద్దరి మధ్య సారూప్యత ఏమిటి?

ఏకకాలంలో వాస్తవీకరింపడిన 'స్వేచ్ఛ సమానత్వం, సౌబ్రాతృత్వం' ఆధారంగా ఏర్పడే ఆదర్శ సమాజం ఆయన జీవిత ప్రధాన ఆశయమన్న విషయాన్ని ఎవరూ విస్మరించలేరు. కుల సంహారం, సామ్యవాదం(వర్గ సంహారం) అలాంటి సమాజ నిర్మాణానికి పూర్వావసరం అని ఆయనకు తెలుసు. దానిలో ప్రజాస్వామ్యం ప్రధాన అంతర్భాగంగాను, బుద్ధిజం నైతిక శక్తిగాను వుంటాయి.

                 ప్రతి అంశంలోను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాపంచిక దృక్పథం దీనికి పూర్తిగా వ్యతిరేకం. కాషాయీకరించబడిన అంబేద్కర్‌ జాతీయవాది. కుల చైతన్యం వల్ల హిందువులు ఒక జాతిగా రూపొందలేరని అంబేద్కర్‌ వాదించాడు. 'హిందూ జాతి' అనే భావన అత్యంత ప్రమాదకరమైందని ఆయన మరీమరీ హెచ్చరించాడు. నేను హిందువుగా మరణించే ప్రసక్తేలేదని అంబేద్కర్‌ ప్రతిజ్ఞచేసినా ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో ఆయన ఒక హిందువు. హిందుమతాన్ని పరిత్యజించి అంబేద్కర్‌ ఆమోదించిన బుద్దిజం చరిత్రనంతా విస్మరించి హిందూమతానికి దానిని మరో శాఖగా ఆర్‌ఎస్‌ఎస్‌ అభివర్ణిస్తుంది. హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగిన శ్రమన్‌ విప్లవం, బుద్ధిజానికి వ్యతిరేకంగా హిందూమతం చేసిన ప్రతీఘాత విప్లవం వల్ల దాని జన్మస్థలంలోనే అది నిర్మూలించబడిందన్న వాస్తవాలను పూర్తిగా విస్మరించటం జరుగుతున్నది.
                         సంస్కృతాన్ని జాతీయభాష చేయాలని అంబేద్కర్‌ కోరాడని చెప్పటం, కాషాయజెండాను జాతీయ జెండాగా చేయాలన్నాడనటం, ఆర్‌ఎస్‌ఎస్‌ను మంచిపని చేస్తున్నదని పొగిడాడని చెప్పటం, ఆయన 'ఇంటికి తిరిగి రావటానికి(ఘర్‌వాపసి) అనుకూలం అని చెప్పటం అంటే అంబేద్కర్‌ను విశ్వహిందూ పరిషత్‌ కోతుల స్థాయికి కుదించేందుకు ప్రయత్నించటమే. అలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానించటానికి కూడా అర్హమైనివి కావు. అయితే ఆయన ఉదార కథనాలు, అనేక ఉల్లేఖనల్లో ఇస్లాంలోకి మారటాన్ని ఎంచుకోవటందాకా ముస్లిం సమాజాన్ని పొగడటం(ముక్తి కోన్‌ పథే 1936) గమనించినప్పుడు ఆయన్ని కుసంస్కారి అయిన ముస్లిం వ్యతిరేకిగా చిత్రించటం సాధ్యపడదు. తన వేదికపై కొందరు దళితతొత్తులను చౌకగా అంబేద్కర్‌కు వ్యతిరేకంగా నిలపగలదేమోగాని ఆయన్ని ఒక మతతత్వవాదిగా చూపలేనని ఆర్‌ఎస్‌ఎస్‌ అర్థం చేసుకుంటే బాగుంటుంది.

నయాఉదారవాద నిర్బంధం

                    భారతదేశ ఎన్నికల మార్కెట్లో ప్రవేశపెట్టబడిన వివిధ రాజకీయ ప్రారిశ్రామికవేత్తలు తయారుచేసిన అంబేద్కర్‌ ప్రతిమలు అసలు అంబేద్కర్‌ను మసకబారుస్తున్నాయి. అవి దళితుల విమోచనకు ఉపయోగపడే రాజకీయ ఆయుధాల్ని నాశనం చేస్తున్నాయి. ఈ ప్రతిమల మధ్య ఛాయలో తేడాలున్నప్పటికీ ఇవన్నీ అంబేద్కర్‌కు నయా ఉదారవాదరంగు పులుముతున్నాయి. 1947 నుంచి 1980వ దశకం దాకా ప్రభుత్వ చిహ్నంగా కొనసాగిన గాంధీని ఒక అంబేద్కర్‌ రూపం స్థానభ్రంశం చేసింది. ప్రభుత్వ పాలన నిర్వహించటంలోను, దాని ప్రజావ్యతిరేక వ్యూహాత్మక సంకల్పాన్ని, దాని సంక్షేమ వాగాడంబరాన్ని, దాని హిందూ వృద్ధిరేటు నిజస్వరూపాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వానికి గాంధీ ఉపయోగపడ్డాడు. ఐతే నయాఉదారవాద విధానాలను పాలకులు అవలంబించవలసి రావటంతోనూ, పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రమవటంతోనూ ప్రభుత్వం తన శోభను కోల్పోవటం మొదలైంది. ఎదురులేని అభివృద్ధి, ఆధునికత, బహిరంగ పోటీ, స్వేచ్చా మార్కెట్ల గురించిన వాగాడంబరాన్ని సమర్థించటానికి ఒక నూతన పూజ్యనీయ ప్రతిమను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. స్వేచ్చా-మార్కెట్‌ నమూనాను అనుసరిస్తే బికార్లు కూడా బూర్జువాలయ్యే అవకాశముంటుందని ఈ ప్రతిమ ద్వారా ప్రజలకు ముఖ్యంగా ఈ విధానంతో నష్టపోయే అట్టడుగువర్గాలకు హామీ ఇవ్వాల్సి వుంటుంది. ఇందుకోసం సరిగ్గా పనికొచ్చే వ్యక్తి అంబేద్కర్‌ తప్ప వేరెవరో కాదు. బలహీనంగా అప్పుడే పుట్టిన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు గాంధీ గ్రహించిన వ్యూహాత్మక ఆవశ్యకతే ఇప్పుడు అవసరమైంది. నయా ఉదారవాదానికి చెందిన సామాజిక డార్వినిస్టు లక్షణం దురహంకార ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో అనునాదం అయింది. అదే బిజెపిని రాజకీయాధికార వినీలాకాశంలో నిలిపింది.

                దళితులను ఆకర్షించటానికి అన్నిపార్టీలు అంబేద్కర్‌ పూజ్య రూపాన్ని ఉపయోగించాయి. ఇలా చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అందరికంటే ముందుంది. 1990వ దశకం నుంచి దళితులకు రిజర్వ్‌ చేయబడిన స్థానాలలో బిజెపి కాంగ్రెస్‌ కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోవటం జరుగుతున్నది. నయా ఉదారవాద పాలనకు దళితులలో నటించగలిగేవారు అవసరమయ్యారు. అందుకు వాళ్లు దొరికారు. దళితులకు నయాఉదారవాదంతో ఎలా మేలుజరుగుతుందో, అంబేద్కర్‌ ఎలా నయాఉదారవాది అవుతాడో, ఈ విధానాలతో దళితులు ఊహాతీతంగా ప్రగతి సాధించి దళిత బూర్జువాలయ్యే అవకాశం కల్పించే 'విప్లవం' ఎలా శృంఖలాలు తెంచుకుని ముందుకొస్తుందో తెలియజెప్పటానికి దళిత మధ్యతరగతికి నాయకత్వం వహించిన నాయకులు ఆరంభంలో కష్టపడ్డారు. ఈ మధ్యతరగతి బిజెపిలో ఒక ప్రత్యేక బాంధవ్యం కనుగొంది. అందుకే నేడు చాలామంది దళితనేతలు బిజెపిలో కొనసాగుతున్నారు. ఈ సంవత్సరం లండన్‌లో ఒక భవనాన్ని రూ.44 కోట్లకు బిజెపి ప్రభుత్వం కొన్నది. అంబేద్కర్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ భవనంలో నివసించాడు.ముంబయిలోని ఇందూ మిల్లు భూమిలో అంబేద్కర్‌ స్మారక చిహ్నాన్ని నిర్మించటానికి వున్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించింది. అలాగే డిల్లీలో అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ నిర్మించటానికి ఒక ప్రణాళిక రచించింది. 

                     గత శతాబ్దారంభంలో 90 శాతం మంది దళితులు ఏ స్థాయిలో జీవించారో అదే స్థాయిలో లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ప్రస్తుతం జీవిస్తున్నారు. ఆ రోజుల్లో వారిలో ఆశ వుండేది. నేడు అది కరువైంది. అంబేద్కర్‌ సమత సంఫ్‌ు పరివార్‌ చెప్పే సమరసత ఒకటి కాదని లేక అంబేద్కర్‌ ప్రాపంచిక దృక్పథం నయా ఉదారవాదం కాదని, సామాజిక డార్వినిజం వాటిని నాశనం చేసేందుకే బయలుదేరిందని దళితులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కేవలం ఒక దశాబ్ద కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కాజేసిన దళితులకు చెందాల్సిన 5 లక్షల కోట్లతో పోల్చినప్పుడు అంబేద్కర్‌ స్మారక చిహ్నాలపై ఖర్చుచేసే ఒకటి, రెండొందల కోట్లు ఒక సాధారణ బిక్షతో సమానమని కూడా దళితులు అర్థం చేసుకోలేకపోతున్నారు! 

(ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ సౌజన్యంతో)
-ఆనంద్‌ తెల్‌తుంబ్డే


(నవ తెలంగాణ దిన పత్రిక, 5.5.2015 తేదీ సంచిక లో ప్రచురించబడిన వ్యాసం ఇది)