Wednesday, January 10, 2018

ఢిల్లీలో 08.01.2018న జరిగిన అన్ని యూనియన్ల,అసోసియేషన్ల సమావేశం ఇచ్చిన పిలుపు


ఢిల్లీలో 08.01.2018న జరిగిన అన్ని యూనియన్ల, అసోసియేషన్ల సమావేశం ఇచ్చిన పిలుపు


డిమాండ్స్ 

1. వేతన  సవరణ, పెన్షన్  సవరణ
• 15% శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ తో 1.1.2017 నుండి వేతన సవరణ
• 1.1.2017 నుండి పెన్షన్ రివిజన్
• సెకండ్ పి ఆర్ సి సిఫార్సుల్లో  అమలు చేయకుండా వదిలి వేసినవి (ఉదా: డైరెక్టు రిక్రూటిస్ కు 30 శాతం పెన్షనరీ బెనిఫిట్స్) అమలు చేయాలి. 
2. సబ్సిడియరి టవర్ కంపెనీ ఏర్పాటును ఆపు చేయాలి. 
3. రిటైర్మెంట్ వయసు 58 కి తగ్గింపు/వి ఆర్ ఎస్ ప్రతిపాదనలను విరమించాలి. 

పోరాట కార్యక్రమం

1)  30.1.2018 నుండి 5 రోజులు ఆల్ ఇండియా/సర్కిల్/జిల్లా స్థాయిలలో సత్యాగ్రహం; ఢిల్లీలో అన్ని యూనియన్ల, అసోసియేషన్ల నాయకులు గాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి సమర్పించటం తో సత్యాగ్రహం ప్రారంభం. (సత్యాగ్రహ కార్యక్రమం ఏ విధముగా అమలు చేయాలో త్వరలో  తెలియజేయబడుతుంది) 

2)  31.01.2018 నుండి నిరవధిక  “వర్క్ టు రూల్"

3)  28.2.2018న "ఛలో సంచార్ భవన్" -- ఢిల్లీలో సంచార్ భవన్ వద్ద  భారీ ప్రదర్శన

4) వారం రోజుల్లోగా కమ్యూనికేషన్సు మంత్రి ని, డి ఓ టి సెక్రెటరిని,  బి ఎస్ ఎన్ ఎల్ సి ఎం డి ని కలిసేందుకు అన్ని  యూనియన్ల,అసోసియేషన్ల నాయకులు అన్ని ప్రయత్నాలు చేయాలి.  

5) టవర్ కంపెనీ ఏర్పాటును ఆపు చేసేందుకు న్యాయస్థానం లో కేసు వేసేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఎస్ ఎన్ ఈ ఏ నాయకులు కా.జి.ఎల్.జోగి మరియు ఏఐ బి ఎస్ ఎన్ ఎల్ ఈ ఏ ప్రధాన కార్యదర్శి  కా.ప్రహ్లాద్ రాయ్ లకు బాధ్యత అప్పగింత. 

5) పోరాట కార్య్క్రమాలకు మార్గదర్శకత్వం వహించేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు, ఎన్ ఎఫ్ టి ఈ, ఎస్ ఎన్ ఈ ఏ, మారియు ఏ ఐ బి ఎస్ ఎన్ ఎల్ ఈ ఏ ల జనరల్ సెక్రెటరీ లతో స్టీరింగ్ కమిటీ. 

6) డిమాండ్స్ కు మద్దతు కోసం రాజకీయ పార్టీల నాయకులను,సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల నాయకులను 30.01.2018 లోగా కలవాలి. 

అన్ని  యూనియన్లు, అసోసియేషన్లను కలుపుకుని ఈ కార్యక్రమాలను జయప్రదముగా అమలు చేయండి. 

 

బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్  సర్కిల్