Thursday, December 17, 2015

మోడీ సిలికాన్‌ పర్యటన: డిజిటల్‌ ఇండియా


                       ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర సాంకేతిక కేంద్ర మైన సిలికాన్ వ్యాలీలో మోడీ పర్యటన, ఆ సందర్భంగా ఆయన ఐటి దిగ్గజాలైన గుగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ కంపెనీల ప్రతినిధులను కలవడం లాంటి అంశాలకు మీడియా విపరీత మైన ప్రచారహోరును కల్పించింది. ఈ పర్యటన తోనే మోడీ భారతదేశ శాస్త్రసాంకేతిక పురోగతిని ఉన్నత సోపానాలనెక్కించినట్లు కార్పొరేట్ మీడియా చిత్రీకరించింది. భవిష్యత్తులో భారతీ యులు మరిన్ని స్మార్ట్ ఫోన్లు, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం గల కార్లు, పరికరాలు వాడగల గడంలో సందేహం లేదు. దీనర్థం భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతిని సాధించి నట్లు కాదు. ఈ అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులలో సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రెండూ కలిపి భారత్లో తయారవుతున్న ఉత్పత్తులు ఎన్ని అన్నదే ఇక్కడ ప్రశ్న. అవి దాదాపుగా ఏమీ లేవన్నది తక్షణ సమాధానం. ఈ దిశలో మోడీ పర్యటన వల్ల కించిత్తు ప్రయోజనం కూడా కలగటం లేదు. 
సిలికాన్ వ్యాలీగా పిలువబడే అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో దక్షిణ భాగం, ప్రపంచం లోనే అతిపెద్ద అత్యాధునిక సాంకేతిక కార్పొరే షన్లకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. అత్యధిక సంఖ్యలో పేరుగాంచిన సిలికాన్ చిప్ ఆవిష్కర్త లు, తయారీదార్ల ప్రాముఖ్యతతోనే ఆ ప్రాంతం సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల కృషితో ఆవిష్కృతమైన నూతన ఉత్పత్తులు, వెంచర్ పెట్టుబడులు, అమెరికా రక్షణశాఖ వ్యయాలు లాంటి అనేక అంశాలు కలగలిపి ఆ ప్రాంత ఉద్భావనకు కారణాలయ్యాయి. వేలాది శాస్త్ర, సాంకేతిక అంకుర పరిశ్రమలు ప్రపంచంలో నూతన ఆవిష్కరణలకు పురుడు పోసుకొని అక్కడి నుండే తమ ప్రయాణాన్ని మొదలెట్టాయి. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక శ్రమజీవులు అత్యధి కంగా కేంద్రీకరింపబడిన ప్రాంతం ఇదేనేమో! మోడీ తన ఉపన్యాసాన్ని శ్రోతలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడతారన్న అంశం సిలికాన్ వ్యాలీలో ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి విదిత మౌతుంది. సాంకేతిక మేధావులు హాజరైన ఆ సమావేశంలో ఆయన తనుగాని, తన పార్టీగాని, ఆర్ఎస్ఎస్గాని సామాన్యంగా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నట్లు మాట్లాడలేకపోయారు. ఉదాహరణకు జనవరి 3, 2014లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహమ్మదాబాద్లో జరిగిన గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ ప్రారంభోత్సవ సమయంలో ప్రస్తావిం చిన అంశాలను మోడీ ఇక్కడ ప్రస్తావించలేదు. ఆయన ఇక్కడ ఇలా చెప్పారు. ''మనం వినాయ కుడిని పూజిస్తుంటాం. వినాయకుడి కాలంలో మనిషి దేహానికి ఏనుగు తలను అతికించగల ప్లాస్టిక్ సర్జన్, తన వృత్తిని నిర్వహిస్తూ ఉండి తీరాలి. కర్ణుడు తన తల్లి ఉదరం నుండి జన్మించలేదని మహాభారతం చెబుతుంది. అంటే జన్యుశాస్త్రం ఆ కాలానికి అభివృద్ధి అయ్యిందని అర్థం.' విశ్వవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలు సాధించిన పురోగతిని అపహాస్యం చేస్తూ, మోడీ బృందం ఈ శాస్త్ర సాంకేతిక పురోగతి వేదకాలం నాడే ఉందని నమ్మబలుకుతున్నారు. అందుకోసమే తమ ప్రభుత్వం వేదశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రాల అభివృద్ధికి నిధులను సమకూరుస్తుందని సమర్థించుకున్నారు.
కాని సిలికాన్ వ్యాలీలో చేసిన ప్రసం గంలో మోడీ ఈ అంశాలను ఏమీ ప్రస్తావించ లేదు. వేదకాలంనాటి శాస్త్ర సాంకేతిక పురోగమ నంతో పోల్చుకుంటే, ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగం సాధించలేని ఆవిష్కరణలుగా వీటిని ప్రస్తావించలేకపోయారు. దానికి బదులు ఆయన ఇలా అన్నారు. ''నూతన ఆలోచనలు ఇక్కడే (సిలికాన్ వ్యాలీలో) తొలి వెలుగును చూడగలి గాయి.'' ఒకపక్క, చరిత్రను వక్రీకరిస్తూ, పుక్కిటి పురాణాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ, ప్రజల్లో మత ఛాందసాలను రెచ్చగొడుతూ, వేద కాలాన్ని కీర్తిస్తూ మోడీ తన దేశ ప్రజల చైతన్యస్థాయిని పురాతన కాలానికి చేర్చదలిచారు. మరోప్రక్క, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజా సమూహాల్ని సులువుగాచేరుకోగలగ డంలో దాని ప్రాధాన్యతను గూర్చి ఆయన ప్రస్తుతిస్తారు. 
మౌలికరంగ ఆవశ్యకత 
మోడీ తన ప్రసంగంలో భారతదేశాన్ని డిజిటలైజ్ చేయడంలో తన దార్శనికతను వ్యక్తపరిచారు. ''123 కోట్ల నా దేశ పౌరులు డిజిటల్గా అనుసంధించబడాలని నేను కోరు తున్నాను'' భారతదేశంలో 25 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. భారత జనాభాతో పోల్చుకుంటే దేశంలో ఇంటర్నెట్ వినియోగం తక్కువైనప్పటికీ (10 శాతం) సంఖ్యాపరంగా చూసే అది అత్యధికంగా ఉంది. ప్రపంచ దేశాల ఇంటర్నెట్ వినియోగంలో చైనా, అమెరికా తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. చైనాలో 64 కోట్ల ప్రజలు ఇంటర్నెట్ వినియోగిస్తూ, వాళ్ళ జనాభాలో 46 శాతంగా ఉన్నారు. ప్రపంచ దేశాల మొబైల్ ఫోన్ల వినియోగంలో భారతదేశం, చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది. 125 కోట్ల భారతీయు లలో 96 కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు ఉండగా, 137 కోట్ల చైనీయులలో 127 కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. భారతదేశంలో ప్రతివారికి మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి తేవాలంటే, మొదటగా మనకు దేశవ్యాప్తంగా విస్తరింపబడ్డ ఫైబర్ ఆప్టిక్ సమాహారం, ఫోన్లను అనుసరించ డానికి కొన్ని టవర్లు లాంటి మౌలిక సదుపా యాలు కావాలి. ఈ సమాహారం సాధారణ రవాణా వ్యవస్థను పోలి ఉంటుంది. మన దేశంలో హైవేలు, రోడ్లు, రైల్వే లైన్లు లాంటి వాటిద్వారా బస్సులు, కార్లు, ట్రక్కులు, రైళ్ళు, వాహనాలుగా ఉపయోగపడుతూ ప్రజలను ఒకచోటి నుండి మరోచోటికి చేరుస్తున్నాయి. అదే రకంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్లు డేటాను, సమాచారాన్ని ఒకచోట నుండి మరో చోటకు చేర్చగలిగే వాహనాలుగా ఉన్నాయి. హైవేలను నిర్మించితే, వాహనాలు వాటంతటవే తప్పనిసరిగా వస్తాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి కంపెనీలు ఖచ్చితంగా బ్రాడ్బ్యాండ్ హైవేలను నిర్మించవు. అదేకాకుండా మౌలిక సదుపాయాల నిర్మాణం వాళ్ళ వృత్తి కాదు. టాటా మోటార్స్, మారుతీ కంపెనీలు రోడ్లను నిర్మిస్తాయా? ఈ మౌలిక సదుపాయాలను భారతదేశం దానంతటదే నిర్మించుకోవాలి. మరెవ్వరూ చెయ్యరు.
జపాన్, జర్మనీ దేశాల్లో 86 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. అలాగని ఆ దేశాధినేతలందరూ ఈ కంపెనీలను కలవలేరు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగదారులలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న చైనా, తమ దేశాన్ని డిజిటల్ చైనాగా మార్చటంకోసం గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ కంపెనీలను ఆశ్రయించలేడు. గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్, ట్విట్టర్ లాంటి కంపెనీలను తమ దేశంలోకి అనుమతించక పోవడమే కాకుండా, గూగుల్కు బదులుగా ఇతర సెర్చ్ ఇంజన్లను చైనీయులు వాడుతున్నారు. చైనా ప్రజలు వినియోగిస్తున్న ఇంటర్నెట్, ఇ-మెయిళ్ళ సమాచారాన్ని చైనాయేతర ప్రపపంచానికి గూగుల్ అందజేస్తుంది. చైనా లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరం స్నోడెన్ అమెరికా సమాచార వ్యవస్థ బండారాన్ని బయటపెట్టిన తర్వాత వాస్తవమని రుజువైంది. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సేవలను పొందుతున్న ప్రజానీకంపై నిఘా ఉంచేందుకు, వారి సమాచారం మొత్తాన్ని అమెరికా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీకి అందించేందుకు ఆయా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్, ట్విట్టర్లను వినియోగించకుండా డిజిటల్ ప్రపంచంలో చైనా ఎలా నెగ్గుకు రాగలుగుతుందన్నది అందరి ముందున్న పెద్ద ప్రశ్న. గణాంకాల రీత్యా ఈ రంగంలో చైనా పనితీరు చాలా బాగున్నది. సామాజిక మాధ్యమాల వినియోగదారులలో అమెరికా ఉత్పత్తి అయిన ఫేస్బుక్ 118 కోట్ల మంది వినియోగదారులు కలిగి మొదటి స్థానంలో ఉన్నది. క్యూక్యూ 83 కోట్ల వినియోగ దారులు కలిగి రెండవస్థానంలో, క్యూజోన్ 63 కోట్ల వినియోగదారులు కలిగి మూడవస్థానంలో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు చైనాలో ఉత్పత్తి చేయబడి ప్రధానంగా చైనా ప్రజలచే వినియో గింపబడుతున్నాయి. చైనా ఇంటర్నెట్ వినియోగ దారులు సగటున రోజుకు 2.7 గంటలు ఆన్లైన్లో ఉంటారని, ఈ సంఖ్య అమెరికా యేతర అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే ఎక్కువగాను, అమెరికా, జపాన్లతో సమానం గానో లేదా ఎక్కువగానో ఉన్నట్లు ఒక బోస్టన్ కన్సల్టెన్సీ బృందం అధ్యయనంలో తేలింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లకు మౌలిక సదుపా యాల కల్పనకు ఈ కంపెనీలతో అవసరం లేదన్న విషయం మోడీకి బాగా తెలుసు. కానీ ఆయన కార్యాన్ని ఆయన సాధించుకున్నారు. ఆయన మీడియా ప్రచారాన్ని చేజిక్కించుకొని, ఆ ప్రఖ్యాత కంపెనీల సాయంతో తాను ప్రఖ్యాత భారతదేశాన్ని నిర్మిస్తున్నాని కొందరితో నమ్మబలుకుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కొంత భాగాన్ని అందిస్తామని ఆ కంపెనీల ద్వారా చెప్పిస్తున్నారు. మొత్తం దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఈ కంపెనీలు చివరి అంచున కల్పించే మౌలిక సదుపాయాల కల్పన అరకొరలాంటిది. ఈ కంపెనీలు వాగ్దానం చేసిన అంశాన్ని రేఖా మాత్రంగా చూద్దాము. వాళ్ళు చేస్తున్నది వాగ్దా నం మాత్రమే. అది కూడా ఖచ్చితంగా ఖరీదు కట్టే ఉంటుంది. 
సిలికాన్ వ్యాలిలో ఆయన పర్యటన సంద ర్భంగా భారతదేశంలో 500 రైల్వే స్టేషన్లను దత్తత తీసుకొని వైఫై సౌకర్యాన్ని కల్పిస్తానని, ఇందుకోసం కొంత మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని గూగుల్ ప్రకటించింది. దీన్ని గూగుల్ ఎలా చేస్తుంది? అని పరిశీలిస్తే, రైల్వేలలో ఇప్పటికీ అందుబాటులో ఉన్న ''రైల్టెల్'' ఆప్టిక్ ఫైబర్ సమాహారాన్ని తప్పనిసరిగా వినియోగిం చుకుంటుంది. పెద్ద హైవేల సమీపంలో ఉండే ఇళ్ళకు చేరటానికి కలిపే చిన్న రోడ్లతో ఈ పరిస్థితిని పోల్చవచ్చును. అదేకాకుండా గూగుల్ వైఫై పరిజ్ఞానంలో నిష్ణాతులేమీ కాదు. వైఫై పరిజ్ఞానంలో నిపుణులైన ఇతర కంపెనీలు చాలా ఉన్నాయి. మన దేశంలోని కొన్ని విమానా శ్రయాలలో ఉచితంగా వైఫై సదుపాయాన్ని అందిస్తున్నారు. అవి చాలా బాగా పనిచేస్తు న్నాయి. భారతదేశంలో వైఫై కల్పించే కంపెనీలు చాలా ఉన్నాయి. సాధారణంగా వైఫై కల్పనకు ఎవ్వరూ గూగుల్ని పిలవరు. ఎందుకంటే అది వాళ్ళ పనికాదు కాబట్టి. భారతదేశ గ్రామాలన్నిం టికీ టెలివిజన్ ప్రసారమయ్యేటట్లు వీలు కల్పించటానికి, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల విక్రయాల వ్యాపారం చేయటమని అర్థం. మైక్రోసాఫ్ట్ యాజమాన్య సాఫ్ట్వేర్ మరింతగా వాడటం మూలంగా మనం లెక్కకు మించి ఖర్చు పెట్టాల్సిన విష వలయం లో పడతాము. మైక్రోసాఫ్ట్ కూడా మన దేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అది అమెరికా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీతో ఒప్పం దం కలిగివున్నందున, ఈ డేటా సెంటర్లలో పోగుపడిన సమాచారాన్ని అనివార్యంగా అమెరి కా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీకి తెలియచేస్తుంది. ఫేస్బుక్ కూడా తన ఇంటర్నెట్ను మనకు అందించటానికి తన సంసిద్ధతను వ్యక్తపరిచింది. దాని ఇంటర్నెట్ పరిమితమైన ఇంటర్నెట్గానే గుర్తించాలి. ఇంటర్నెట్లో మనం ఏమి చూడాలో ఫేస్బుక్ నిర్ణయిస్తుంది. ''తటస్థ విధానానికి ఇది వ్యతిరేకం. ఈ కంపెనీలేమీ మనదేశంలో చెప్పు కోదగ్గ ఉద్యోగాల్ని కల్పించలేవు. కల్పించగల మని వాళ్ళూ చెప్పడం లేదు.
డిజిటల్ ప్రపంచంపై గుత్తాధిపత్యం
సిలికాన్ వ్యాలీకి మోడీ సందర్శనను ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టివి మోహన్ దాస్ సారు ప్రస్తుతిస్తూ, ''మొత్తం ప్రపంచాన్ని డిజిటల్గా సొంతం చేసుకోవటం కోసం మైక్రో సాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్ మరియు యాపిల్లు కన్న కలలకు మోడీలో సమాధానం దొరికింది. అని ఆయన సరిగ్గానే చెప్పారు. ఆయన మాటల్లో రెండు సత్యాలున్నాయి. ఒకటి, ఈ కంపెనీలన్నీ డిజిటల్ ప్రపంచం మొత్తాన్ని తమ గుత్తాధిపత్యం లోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాయి. ఇందుకోసం వాళ్ళు ఇతరులెవరినీ ఈ రంగం లోకి అడుగుపెట్టనివ్వరు. కానీ ఈ స్వప్నాన్ని నిజం చేసుకోవటానికి వాళ్ళు ఎన్నో అవరోధా లను ఎదుర్కోవలసి ఉంది. ప్రపం చంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన చైనా, ఇతరులను తమ దేశంలోకి అడుగు పెట్టనీయటం లేదు. కొన్ని దేశాల్లో యాజమాన్య సాఫ్ట్వేర్ వినియో గానికి నిధులూ, ఫ్రీ సాఫ్ట్వేర్ వినియోగం పెరి గింది. చైనా తర్వాత భారతదేశం రెండవ అతిపెద్ద మార్కెట్గా ఉన్నది. అందువల్ల బహుళజాతి కంపెనీలు ఈ మార్కెట్పై ఆసక్తిగా ఉన్నాయి. బహుళజాతి ఐటి కంపెనీలు మన దేశంలో వ్యాపారం చేయటం వల్ల అనేక ప్రయో జనాలు పొందగలుగుతున్నాయి. మొదటగా భారతదేశం యాజమాన్య సాఫ్ట్వేర్ వినియో గంలో ఆధిపత్యం కలిగి ఉంది. ఆచరణలో ప్రభుత్వం, ఐటి దిగ్గజాలు యాజమాన్య సాఫ్ట్ వేర్కు ఇచ్చినంత ప్రాధాన్యతను స్వేచ్ఛా, ఫ్రీ సాఫ్ట్వేర్లకు ఇవ్వటం లేదు. రెండవ అంశం, 
భారతదేశం రెండవ అతిపెద్ద మార్కెట్గా ఉన్నది. అందువల్ల బహుళజాతి కంపెనీలు ఈ మార్కెట్పై ఆసక్తిగా ఉంటాయి. అయినప్పటికీ అవుట్సోర్సింగ్కు వినియోగించే సాఫ్ట్వేర్ నిర్మాణం అనేక సందర్భాలలో అంత తేలికైన పనికాదు. భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ఆ నైపుణ్యం ఉంది. కాని మనదేశంలో నూతన ఉత్పత్తుల స్థానంలో భారతదేశ సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు స్థానం కల్పించాలన్న సంకల్పం భారత ప్రభుత్వానికి లేదు. అవుట్ సోర్సింగ్ ద్వారా పొందగలిగే సత్వర ఆదాయాన్ని ప్రైవేట్ ఐటి కంపెనీలు నూతన ఉత్పత్తుల ద్వారా పొందలేకపోవటం మూలంగా వాటి ఉత్పత్తిలో ఆసక్తి కనబరచడం లేదు. మూడవ అంశం ఇతర దేశాలలాగా కాకుండా, బహుళజాతి సాఫ్ట్వేర్ దిగ్గజాల సహకారంతో అమెరికా సాగిస్తున్న నిఘా చర్యల్ని ష్నోడెన్ బట్టబయలు చేసినప్పటికీ, భారత దేశం, వాటినేమీ పట్టించు కోవడం లేదు. చివరి అంశం పర్యవసానాలే మైనా భారత మార్కెట్ను సాధ్యమైనంత త్వరగా బహుళజాతి సంస్థలకు అప్పచెప్పటానికి ప్రస్తుత ప్రధానమంత్రి, సిద్ధమయ్యారు. బహుళజాతి ఐటి కంపెనీలకు భారత మార్కెట్, భారత ప్రధానమంత్రి ప్రీతిపాత్రమయ్యాయి. అమెరికన్ బహుళజాతి ఐటి కంపెనీల కలలకు మోడీతో సమాధానం చూడగలిగారన్న మోహన్దాస్ సారు ప్రకటనలో రెండవ సత్యం ఇక్కడ దొరుకు తుంది. అమెరికన్ కంపెనీల ప్రయోజనాలకు కొమ్ముగాస్తున్న మోడీని అమెరికన్ మీడియా ఆనందంతో కీర్తించడం సర్వసాధారణమైనదే. మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనలో అదే జరిగింది. కానీ మోడీ తన పర్యటనలో ఏమి చేసి ఉండాల్సింది? దానికి బదులు ఆయన అనంతమైన విజ్ఞానాన్ని అందించకలిగే విద్యాసంస్థలు, అపార సంపదను పెట్టుబడిగా పెట్టగలిగే వెంచర్ పెట్టుబడిసంస్థలు, కేంద్రీకరిం పబడ్డ నైపుణ్య సమూహాలన్నింటి పరస్పర సమన్వయంతో అంకుర పరిశ్రమలు వారి ఆవిష్కరణలతో సిలికాన్ వ్యాలీలో ఎలా వృద్ధి కాగలిగాయో అధ్యయనం చేసి ఉండాల్సింది. ఆయన సిలికాన్ వ్యాలీ చరిత్రను పరిశీలించి ఉంటే, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంలో అమెరికా ప్రభుత్వం నిర్వహించిన పాత్ర తెలిసి ఉండేది. సాధారణంగా భారత కంపెనీలు నూతన ఆవిష్కరణలకు విముఖంగా ఉన్న ప్రాంతంలో నూతన ఉత్పత్తుల నిర్మాణంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన అదనపు పాత్రకు తగిన ప్రణాళికను మోడీ రచించగలిగేవారు. ఆ దిశలో మోడీ ఏమీ చేయటం లేదు. అనేక సందర్భాలలో మోడీ ''భారత్లో తయారీ''పై ప్రసంగిస్తుండేవారు. అనేక ఆవిష్కరణలు సిలికాన్ వ్యాలీలో చిన్న చిన్న అంకుర పరిశ్రమల ద్వారానే సాధ్యమైందన్న వాస్తవాన్ని ఆయన అధ్యయనం చేస్తే అర్థమయ్యేది. ''భారత్లో తయారీ'' ప్రణాళిక విజయసాధనకు అటువంటి అకుంర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వవలసి ఉంది. ఆ రకమైన ప్రోత్సాహాన్ని అందించటానికి తగిన ప్రభుత్వం విధానాలను ఆయన రూపొం దించవలసి ఉంది. భారతదేశ ఐటి పరిశ్రమ లలో మనం చూస్తున్న అభివృద్ధి, సాఫ్ట్వేర్ పార్క్ ఆఫ్ ఇండియా ద్వారా ఉద్భవించిన ఐటి పరిశ్రమ అనుకూల భారత ప్రభుత్వ పన్నుల విధానం ద్వారానే సంభవించింది. సాఫ్ట్వేర్ పార్క్ ఆఫ్ ఇండియా క్రింద నమోదైన ఐటి కంపెనీ, అది చిన్నదైనా, పెద్దదైనా, భారత్లో ఉన్నా లేకపోయినా, అది ఎగుమతులు చేయ గలిగితే పన్ను రాయితీలకు అర్హమై ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రయోజనం పొందిన అనేక చిన్న కంపెనీలు భారతీయ కంపెనీలుగా పరిణామం చెందాయి. (ఉదాహరణకు టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ మొదలైనవి). గత యుపియే ప్రభుత్వం పన్ను రాయితీలను ఉపసంహరించు కుంది. ఈ పరిణామం చిన్న ఐటి కంపెనీలపై అధిక పన్ను భారాన్ని మోపుతూ అసమాన పోటీకి దారితీస్తుండగా, పెద్ద ఐటి కంపెనీలు అధిక పన్ను మినహాయింపులు, అనేక ఇతర రాయితీలను అందిస్తున్న ''ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు'' తరలిపోయి అధిక ప్రయోజనాలు పొందగలుతున్నాయి. ఒక చిన్న కంపెనీ కూడా ప్రత్యేక ఆర్థిక మండలిలో 25 ఎకరాల కనిష్ట భూమిని కొనగలిగే స్థితిలో లేదు. డిఎల్ఎఫ్, షాపూర్జి సల్లోంజీ లాంటి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రత్యేక ఆర్థిక మండళ్ళలో కొంత స్థలం అద్దెకు ఇస్తున్నా, వారు డిమాండు చేస్తున్న అత్యధిక అద్దెలు భరించే స్థితిలో చిన్న కంపెనీలు లేవు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం గత యుపియే ప్రభుత్వం తీసుకున్న చర్యలను రద్దు చేసి అంతకు ముందున్న స్థితిని పునరుద్ధరి స్తుందా? లేక భారీ, చిన్న కంపెనీలు ఒకేరకమైన ప్రభుత్వ రాయితీలను పొందేటట్లు విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందా? లేదు. ఆయన అలా చేయరు. కాంగ్రెస్, బిజెపిలది ఒకే రకమైన ఆర్థిక విధానం. బిజెపికి ఎన్నికల నిధి ఇవ్వగలిగే స్తోమత చిన్న కంపెనీలకు లేదు. అందువల్ల బిజెపి చిన్న కంపెనీలను ప్రోత్సహించే ప్రశ్నే ఉదయించదు. మోడీ ప్రకటించిన ''భారత్లో తయారీ'' నినాదం ఆయన ప్రసంగాలలో తప్ప ఆచరణలో లేదు. మోడీ సిలికాన్ వ్యాలి పర్యటన ఒక ఇచ్చి పుచ్చుకునే ప్రణాళిక. ప్రభుత్వ మద్దతుతో భారతదేశంలో తమ వ్యాపారాన్ని చేసుకోమని బహుళజాతి ఐటి కంపెనీలను మోడీ ఆహ్వానిం చారు. వాళ్ళు ఆయనకు అత్యధిక ప్రచార హోదాను కల్పిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ తమ దగ్గరున్న డేటాను, సమాచారాన్ని అమెరికా జాతీయ నిఘా సంస్థకు ఎప్పటికప్పుడు అంద జేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా మోడీకి ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమంలో అత్యధిక ప్రచారాన్ని ఇస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని అడ్డుకోవటం లేదా ఆలస్యం చేయటం చేస్తున్నారు (తమకు కావలసింది 8 సెకండ్లలో రాకపోతే వినియోగదారులు మరో సైట్కు మరలిపోతారు). భారతదేశ భారీ ఐటి కంపెనీలు భారత్ మార్కెట్కంటే అవుట్ సోర్సింగ్పై ఆసక్తితో ఉన్నందున, వాళ్ళు విదేశీ కంపెనీలతో సంబంధ బాంధవ్యాలను పెంచు కొని మనదేశం వెలుపల వారి మార్కెట్ను విస్తరించుకుంటున్నారు. తమకు సంబంధ బాంధవ్యాలున్న బహుళజాతి కంపెనీలను మోడీ భారత మార్కెట్కు ఆహ్వానించటం సహజంగా భారతదేశ భారీ ఐటి కంపెనీలకు అనందంగా ఉంటుంది. ఇందుకోసం భారతదేశంలో కార్పొరేట్లు, కార్పొరేట్ మీడియాల మద్దతు పొందటంలో మోడీకి ఎటువంటి సమస్యా లేదు. నరేంద్ర మోడీకి సొంత ప్రచారానికి మించి, మనదేశం యొక్క నిజమైన అభివృద్ధి సాధన ఆయన ఎజెండాలో ఉండే ప్రశ్నే లేదు. 
- - డిబెన్ దాస్ 
(స్వేచ్ఛానువాదం : కొండముది లక్ష్మీప్రసాద్)

No comments:

Post a Comment