Saturday, August 10, 2013

'విభజన' - సమైక్యత ' నినాదాల నిజ స్వరూపం

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ సమైక్యత కోసం కట్టుబడి ఉన్నామంటున్నారు. 'సమైక్యత' అన్న మాటకు అందరి అర్థం ఒకటి కాదని పైపైన పరిశీలించినా తేటతెల్లమవుతుంది. చిరంజీవి గారు చెప్తున్న సమైక్యత హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్‌తో ఆగిపోతుంది. తెలుగుదేశం పార్టీ వారి సమైక్యత పదేళ్లకు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీతో ముగుస్తుంది. కాంగ్రెస్‌ వారి సమైక్యత ఆంటోనీ కమిటీకి నివేదించుకోవడంతో అంతం అవుతుంది. వైఎస్‌ఆర్‌ వారి సమైక్యత అస్పష్ట వ్యాఖ్యలతో, ఎదురుదాడితో ముగుస్తుంది. తెలుగుజాతి ముక్కలు కాకుండానే, సమైక్యతలోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని కొద్ది మంది మేధావులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఆందోళనలలోనూ పాల్గొంటుండవచ్చు. దేశం, రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసం తెలుగుజాతి ఐక్యతపై నిర్మాణమైన రాష్ట్రం ఒకటిగా ఉండాలని సిపిఐ(యం) అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలోని ప్రధాన పాలక ప్రతిపక్షాలు కూడా అలాగే అనుకోవడం లేదు. అందరూ ఇచ్చే సమైక్యత నినాదాలు ఒకటేననుకుంటే ప్రజలు దారుణంగా మోసపోతారు. 

దేశంలో ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అప్రతిష్టను కాంగ్రెస్‌ మూటగట్టుకోబోతున్నది. మిగిలిన బూర్జువా, భూస్వామ్య ప్రతిపక్ష పార్టీలు తమ అవకాశవాద రాజకీయాలతో ఈ విచ్ఛిన్నంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. సమైక్య రాష్ట్రమే ఉండాలని ప్రకటిస్తూ వచ్చిన ఎంఐయం అభిప్రాయాన్ని మార్చుకుని ఇప్పుడు విభజన ప్రతిపాదనను సమర్థించింది. వాపపక్ష ప్రజాతంత్ర శక్తులలో ఒక ప్రధానమైన భాగం విభజనవాదాన్ని ఆలింగనం చేసుకుని పాలక పార్టీల రాజకీయ క్రీడకు ఒక అభ్యుదయ ముసుగు తగిలించింది. పార్లమెంటులో అత్యధిక సంఖ్యాబలం కలిగిన కాంగ్రెస్‌, బిజెపిలు ఒక్కటైన తర్వాత రాష్ట్ర విభజన అనివార్యమన్న పరిస్థితి ఏర్పడింది. చివరకు సిపిఎం ఒక్కటే దేశ, రాష్ట్ర, పీడిత ప్రజల ప్రయోజనాల దృష్టితో దాదాపు ఒంటరిగా రాష్ట్ర సమైక్యత కోసం నిలబడింది.

కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సమస్యను సృష్టించి, నానబెట్టి ప్రతిష్టంభన సృష్టిస్తే, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిలు స్పష్టమైన అభిప్రాయాలు చెప్పకుండా సమస్యను జటిలం చేశాయి. పార్టీల నాయకులు ప్రాంతాల వారీగా వేర్వేరు వైఖరులను తీసుకుని అనైక్యతను పెంచి పోషించారు. టిఆర్‌ఎస్‌ విద్వేషపూరిత ప్రకటనల ద్వారా రెచ్చగొట్టుడు చర్యల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలను పెంచింది. సుహృద్భావాన్ని ధ్వంసం చేసింది. పర్యవసానంగా సమస్యను ఎటువైపు పరిష్కరించినా అసంతృప్తి, ఆందోళన తప్పని పరిస్థితి ఏర్పడింది. మూడున్నరేళ్ల క్రితం విభజనకు సిద్ధమైనప్పుడు గాని, ఇప్పుడు విభజన విధాన నిర్ణయం ప్రకటించినప్పుడు కాని కాంగ్రెస్‌ నిర్ణయాల వెనక స్వార్థపూరిత ఎన్నికల ప్రయోజనమే ప్రధానంగా దాగి ఉన్నది. కాంగ్రెస్‌ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే గత రెండుసార్లు దానికి అక్షయపాత్రగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తగినన్ని సీట్లు రావాలి. లేకపోతే 2014 ఎన్నికలలో అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుంది. అందుకే ఇక ఆలస్యం చేయడం మంచిది కాదనుకున్నది. అప్పుడు విభజన వలన రెండు ప్రాంతాల్లో లబ్ది పొందవచ్చని భావించింది. ఇప్పుడు ఐక్యంగా ఉంచితే రెండందాల నష్టపోతాం, విభజిస్తే ఒక చోటైనా లాభం పొందుతాం అన్న దుర్బుద్ధితో నిర్ణయం తీసుకున్నది.

ఇప్పటి వరకూ తమకు కొరకరాని కొయ్యగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన కాంగ్రెస్‌ ఇచ్చిన ఆయాచిత అవకాశంగా బిజెపికి కన్పించింది. రాష్ట్రాలను చిన్నచిన్న ముక్కలుగా చేసి ఫెడరలిజాన్ని బలహీనం చేయడం ద్వారా తన హిందూత్వ ఎజెండాను సులభంగా సాధించుకోవచ్చు, మతద్వేషాలను, సంఘర్షణలను రెచ్చగొట్టి బలపడవచ్చు అన్నది బిజెపి వ్యూహం. అందుకే విభజన గురించి ప్రధానమంత్రి సంప్రదించగానే బిజెపి నాయకత్వం ఎగిరి గంతేసి సమర్థిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ నుంచి, ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రాకముందే మీడియాకు చెప్పి తమ గొప్పతనాన్ని ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. బిజెపి బలపర్చడానికి సిద్ధమైన తర్వాత రాష్ట్ర విభజన నిర్ణయం పార్లమెంటులో ఆమోదం పొందడం సునాయాసంగా జరిగిపోతుంది.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన సహజంగానే తెలంగాణా ప్రాంతంలో ఉత్సాహాన్ని కలిగించింది. సీమాంధ్ర ప్రాంతంలో నిరసనకు, ఆగ్రహానికి కారణమైంది. గతంలో విభజన కోసం తెలంగాణాలో ఉద్యమాలు తీవ్రంగా జరిగితే ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోస్తా-రాయలసీమలో ఉధృతంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ అధిష్ఠానం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు రావడం ప్రారంభమైన తర్వాత సమైక్యతా సెంటిమెంట్‌ను ఎలా వినియోగించుకోవాలా అనే ఆదుర్దా బూర్జువా పార్టీల నాయకుల్లో మొదలైంది. సమైక్యత కోసం తామే గట్టిగా వాదించామని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అధిష్ఠానానికి సమర్పించిన రోడ్‌ మ్యాప్‌లలోని అంశాలను పత్రికలకు లీకు చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వ్యాప్తి చేశారు. ఇతరులకన్నా తామే ఎక్కువ లబ్ధి పొందాలన్న ఆశతో అందరికన్నా ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించారు. తామెక్కడ వెనకబడి పోతామోనని కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, తెలుగుదేశం శాసన సభ్యులు కూడా రాజీనామాలు సమర్పిస్తున్నారు.

అప్పటి వరకూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు, విభజనకు అనుకూలంగా పార్టీ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన తెలుగుదేశం నాయకులు, కేంద్రం ఏ నిర్ణయం చేస్తే దానికి బద్ధులై ఉంటామని చెప్పిన వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వీరావేశాలతో ఊగిపోవడం, మీడియా ముందు ఊగిపోవడం చేస్తున్నారు. ఆ పార్టీల జెండాలతోనే ఆందోళనలు చేస్తున్నారు. విభజనకు సానుకూలమని చెప్పిన పార్టీలలో ఉంటూనే సమైక్యత పేరుతో రాజీనామాలు ఇవ్వడంలో, ఆందోళన చెయ్యడంలో వారికి వైరుధ్యమేమీ కన్పించడం లేదు. లేదా ప్రజలు గమనించరులే అన్న భరోసా అనుకోవాలి. పదవులకు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావు, ప్రయోజనాలేమీ పోవు, ఆ ధైర్యంతోనే పార్టీలకు కాకుండా పదవులకు రాజీనామా చేస్తుండవచ్చు. ఉద్యమాలతో ప్రజలు అలిసిపోయిన తర్వాత తమ పార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉండవచ్చనే కపటత్వం ప్రదర్శిస్తున్నారనుకోవాలి. ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్‌ చేయడం రాజకీయ నాయకులు తమ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే తోడ్పడుతుంది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అది రాజ్యాంగ ప్రతిష్టంభనకేమీ దారితీయదు. మహా అయితే రాష్ట్రపతి పాలనకు దారితీస్తుంది. అప్పుడు ప్రజల స్థితి పెనం మీద నుంచి పొయ్యిలోపడినట్టు అవుతుంది తప్ప ఉపయోగమేమీ జరగదు.

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ సమైక్యత కోసం కట్టుబడి ఉన్నామంటున్నారు. 'సమైక్యత' అన్న మాటకు అందరి అర్థం ఒకటి కాదని పైపైన పరిశీలించినా తేటతెల్లమవుతుంది. చిరంజీవి గారు చెప్తున్న సమైక్యత హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్‌తో ఆగిపోతుంది. తెలుగుదేశం పార్టీ వారి సమైక్యత పదేళ్లకు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీతో ముగుస్తుంది. కాంగ్రెస్‌ వారి సమైక్యత ఆంటోనీ కమిటీకి నివేదించుకోవడంతో అంతం అవుతుంది. వైఎస్‌ఆర్‌ వారి సమైక్యత అస్పష్ట వ్యాఖ్యలతో, ఎదురుదాడితో ముగుస్తుంది. తెలుగుజాతి ముక్కలు కాకుండానే, సమైక్యతలోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని కొద్ది మంది మేధావులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఆందోళనలలోనూ పాల్గొంటుండవచ్చు. దేశం, రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసం తెలుగుజాతి ఐక్యతపై నిర్మాణమైన రాష్ట్రం ఒకటిగా ఉండాలని సిపిఐ(యం) అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలోని ప్రధాన పాలక ప్రతిపక్షాలు కూడా అలాగే అనుకోవడం లేదు. అందరూ ఇచ్చే సమైక్యత నినాదాలు ఒకటేననుకుంటే ప్రజలు దారుణంగా మోసపోతారు.



బహుళజాతులున్న మన దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలను ముక్కలు చేస్తే ఫెడరలిజం నాశనం అవుతుంది. కేంద్రంలో అధికారాలు, నిధులు కేంద్రీకృతమవుతాయి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. మతోన్మాద శక్తులు సులువుగా బలపడి లౌకికవాదానికి ప్రమాదం హెచ్చుతుంది. అంతర్జాతీయ, దేశీయ గుత్తపెట్టుబడిదారులు యథేచ్ఛగా ప్రభుత్వాలను శాసించి దోచుకోవడానికి అడ్డే ఉండదు. సరళీకరణ విధానాలకు కనీస ప్రతిఘటన ఇవ్వగల ప్రభుత్వాలు లేకుండా పోతాయి. కేంద్రం మీద ఆధారపడి మున్సిపాలిటీల స్థాయికి రాష్ట్రాలు దిగజారే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాథమిక మెట్టుగా భాషా ప్రాయుక్త రాష్ట్రాల విచ్ఛిన్నాన్ని కోరుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రకటన తర్వాత 20కి పైగా చిన్న రాష్ట్రాల కోర్కెలు రగుల్కొన్నాయి. నయా సరళీకరణ విధానాలను భుజానకెత్తుకున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ఏదో ఒక రూపంలో విభజన వైపు మొగ్గు చూపడంలో ఆశ్చర్య పడాల్సిందేమీలేదు. బూర్జువా పాలక పార్టీలు ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను తమ అవకాశవాద స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటాయి అన్న విషయాన్ని గత మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మరోసారి స్పష్టంగా రుజువు చేశాయి. రాష్ట్రంలో తమ మధ్య వనరులు, పదవుల పంపిణీ తగాదాలను పరిష్కరించుకునేందుకు బూర్జువా పాలక పార్టీలు, వర్గాలు విభజన- సమైక్యత సమస్యను సృష్టించాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదు. రెండు రాష్ట్రాలలో ఎవరు పదవులు చేపట్టినా సరళీకరణ విధానాలను అనుసరిస్తారు. సంపదను పోగేసుకోవడానికి పదవులను వినియోగించుకుంటారు. పీడిత వర్గాలకు, బలహీన వర్గాలకు ఏ ప్రయోజనం దక్కదు. గతంలోనూ ప్రజా సమస్యలను పాలకవర్గ పార్టీలు పరిష్కరించలేదు. అప్పుడూ కార్మికులు, కూలీలు, రైతులు, సామాజిక, బలహీన వర్గాల ప్రజలు పోరాటాలు చేశారు. ఇప్పుడు రాష్ట్రం రెండయినా పేదల, బలహీనవర్గాల సమస్యలు పరిష్కారం కావు. అందువలన కొత్త రాష్ట్రాలలో కూడా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయక తప్పదు.

ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ సరళీకరణ విధానాలను అనుసరించాయి. రెండు రాష్ట్రాలయినా, ప్రస్తుత పాలక పార్టీలు ఏవి అధికారంలోకొచ్చినా సరళీకరణ విధానాలనే అనుసరిస్తాయి. పాలకులు అనుసరించిన సరళీకరణ విధానాల మూలంగా రాష్ట్రంలో గతంలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. కొత్త రాష్ట్రాలలో ప్రాంతాల మధ్య అస మానతలు ఇంకా పెరు గుతాయి. వెనకబడిన ప్రాం తాల అభివృద్ధికి అప్పుడూ ఉద్యమాలు తప్పవు. వామపక్ష పార్టీలు కొన్ని ప్రాంతీయతత్వాన్ని భుజాన ఎత్తు కోవడమే ప్రస్తుత పరిస్థితిలో ఆందోళనకర అంశం. ప్రజల సెంటి మెంట్‌కు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా ఉద్యమం అభివృద్ధి అవుతుందన్న భావన ఈ శక్తులకు ఉండవచ్చు. కానీ కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వాల ద్వారా విప్లవోద్యమాలు ముందుకు పోయిన దాఖలాలు ఎక్కడా లేవు. వాస్తవంగా వీటి వలన ప్రజా ఉద్యమాలకు, ప్రజల ఐక్యతకు భంగం కలుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర విభజన విషయంపై వామపక్షాలలో ఉన్న అనైక్యత ప్రజా ఉద్యమాలకు ఆటంకం అయిందన్నది వాస్తవం. పైగా ప్రాంతీయతత్వాలను ఉపయోగించుకుని రాష్ట్రంలో బలపడాలనే బిజెపి ప్రయత్నాలను వామపక్ష ప్రజాతంత్ర శక్తుల్లోని ఒక సెక్షన్‌ గమనించకపోవడం ప్రస్తుత పరిస్థితిలోని విషాదం.

రాజకీయ పార్టీలలోనే కాక కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల్లోనూ అవకాశవాద ధోరణి ప్రబలంగానే ఉంది. రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న ఈ సంఘాలు తెలంగాణాలో విభజన కోసం, కోస్తా, రాయలసీమలో సమైక్యత కోసం జరిగే ఉద్యమాల్లో పాల్గొనడమేమిటి? రెండు పరస్పర విరుద్ధ డిమాండ్ల కోసం ఒకే సంఘం నిలబడడం ఎలా సాధ్యమవుతుంది? రెండు విరుద్ధ డిమాండ్లను ఏక కాలంలో సాధించడం ఎలా సాధ్యమవుతుందన్న కనీస ఆలోచన కూడా లేనట్లు అయోమయం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అవకాశవాదంతో వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో అవి స్పష్టమైన, సరైన వైఖరి తీసుకోకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలోనే రాష్ట్ర విభజన-సమైక్యత సమస్య పరిష్కారమవుతుందనుకోవడం అత్యాశ, అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు ప్రోత్సహించి సమ్మెల్లోకి దించవచ్చు. ఆ రకంగా సమ్మెలు చేసిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టం లేకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రం వేరైనా రెండు రాష్ట్రాల్లో అధికారానికి వచ్చే పాలకులు సమ్మె కాలానికి జీతభత్యాలు ఇవ్వకుండా ఉండలేరు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నా జీతాలు ఆపలేరు. కానీ గతంలో ఉపాధ్యాయుల సమ్మె మూలంగా తెలంగాణ ప్రాంతంలో పేదల పిల్లలు నష్టపోయారు. ఇప్పుడు కోస్తా-రాయలసీమలో నష్టపోతారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చాలని ఏ ప్రధాన పార్టీ చెప్పని నేపథ్యంలో పిల్లల భవిష్యత్తుకు హాని చేయడం అవసరమా అనేది ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించుకోవాలి. విభజన జరిగితే ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అటువంటి సమస్యలపై ఆందోళనలు-ఉద్యమాలు తప్పకపోవచ్చు. అటువంటి వాటి కోసం పోరాటమా? పాలక రాజకీయ పార్టీల అవకాశవాద అవసరాల కోసం పోరాటమా? అనేది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ముందున్న ప్రధాన సమస్య.

విభజన అంశాలపై చాలా సమస్యలొస్తాయి. విద్వేషాలు, వివాదాలను బూర్జువా పార్టీల నాయకులు రెచ్చగొడతారు. ఆవేశకావేశాలను సృష్టిస్తారు. సంకుచితత్వం, దురహంకార భావాలకు గురికాకుండా సామాన్య ప్రజల ఐక్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అలా చేస్తూనే ఉపాధి రక్షణ, వనరుల పంపిణీ, వెనుకబడిన ప్రాంతాలన్నింటి అభివృద్ధికి చర్యలు, ఉద్యోగుల, పేదల, బలహీనవర్గాల హక్కుల రక్షణ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సమ న్యాయంతో నిర్ణయాలు తీసుకునేట్టుగా కృషి చేయడం అవసరం. 
-ప్రజామిత్ర

 (Prajasakti, 9.8.2013)

No comments:

Post a Comment