Wednesday, May 21, 2014

రాబోయే మోడి సర్కారుకు టెలికాం కంపెనీల వినతి –విలీనాలు, స్వాధీనాలు లాభసాటిగా వుండే విధముగా నిబంధనలు సవరించండి!

నష్టాల్లో వున్న ప్రయివేటు కంపెనీలు కొన్నింటిని లాభాలతో నడిచే ప్రయివేటు కంపెనీలు కొనేయాలనుకుంటున్నాయి. కొన్ని ప్రయివేటు కంపెనీలు ఒకదానితో ఒకటి విలీనమయి ఒక పెద్ద కంపెనీగా ఏర్పడాలనుకుంటున్నాయి. దీనికోసం యు పి ఏ ప్రభుత్వము ఒక నిబంధనావళిని రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం స్వాధీనాలు, విలీనాల వలన ఏర్పడే కంపెనీ మార్కెట్ వాటా 50 శాతం (వినియోగ దారులు, ఆదాయం రెండింటిలో) మించకూడదు. స్వాధీనం చేసుకోబడిన లేదా విలీనమయిన కంపెనీలలో దేని స్పెక్ట్రమ్ అయినా ప్రభుత్వ నియంత్రిత ధరకు కొన్నదిగా వుంటే దానికి మార్కెట్ ధరను చెల్లించాలి. 2010 కి ముందు స్పెక్ట్రమ్ ను మార్కెట్ లో వేలం వేయకుండా ప్రభుత్వమే చాలా తక్కువ ధరకు కేటాయించింది. అటువంటి స్పెక్ట్రమ్ కు కలయిక/స్వాధీనం సందర్భముగా మార్కెట్ రేటు (2010, ఆ తరువాత వేలము లో నిర్ణయించబడిన ధర) చెల్లించాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి.

రాబోయే మోడి ప్రభుత్వము ఈ నిబంధనను మార్చి, మార్కెట్ రేటు చెల్లించాల్సిన అవసరం లేకుండా, అసలేమీ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్వాధీనం చేసుకున్న లేదా విలీనం చేసుకున్న కంపెనీ యొక్క స్పెక్ట్రమ్ ను బదిలీ చేసేందుకు వీలు కల్పించాలని ప్రయివేట్ టెలికాం కంపెనీలు కోటుతున్నాయి. ఆ మేరకు అవి కేబినెట్ సెక్రెటరీకి 20.5.2014 న మెమోరాండం సమర్పించాయి.

ఈ సమావేశం లో కేబినెట్ సెక్రెటరీ డి ఓ టి ని టెలికాం రంగానికి సంబంధించి కొత్త ప్రభుత్వం తక్షణం శ్రద్ధ పెట్టాల్సిన ఐదు అంశాలపై ఒక పత్రం తయారు చేసి ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది.
 
 
 

No comments:

Post a Comment