Thursday, August 20, 2020

వివిధ రంగాల కార్మికుల, ప్రజల డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ 20.8.2020 నుండి 26.8.2020 వరకు సి పిఎం పార్టీ దేశ వ్యాప్త ఉద్యమం

 

కోవిడ్ వలన పెరుగుతున్న ఆర్థిక మాంద్యం వలన ప్రజల సమస్యలు పెరుగుతుండగా వాటిని పట్టించుకోకుండా ఉద్యమాలు చేయటం సాధ్యం కాని పరిస్థితిని  వినియోగించుకుని మోడి ప్రభుత్వము స్వదేశీ,  విదేశీ కార్పొరేట్ల లాభాలు పెంచేందుకు, ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటు పరమ్ చేసేందుకు , కార్మిక హక్కులను మరియు ప్రజాస్వామిక హక్కులను రద్దు చేయుటకు ఉపక్రమిస్తున్నది.

ఇందుకు వ్యతిరేకముగా ఉద్యమించాలని సి పి ఎం పార్టీ నిర్ణయించింది. కార్మికుల, ప్రజల ఆర్థిక పరమయిన డిమాండ్స్ ను పరిష్కారించాలని, కార్మిక హక్కులను కాపాడాలని, ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని కోరుతూ ఈ క్రింది డిమాండ్స్ కోసం 20.8.2020 నుండి 26.8.2020 వరకు దేశ వ్యాప్తముగా  ఉద్యమించాలని సి పి ఎం పార్టీ నిర్ణయించింది. ఈ ఉద్యమం లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది.   

డిమాండ్స్

1.      ఆదాయపు పన్ను పరిధికి బయట వున్న వారికి కుటుంబానికి నెల కి రూ.7500/- చొప్పున రాబోవు 6 నెలలపాటు  నగదు బదిలీ చేయాలి.  

2.      నెలకి తలకి 10 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఉచితముగా 6 నెలల పాటు అందించాలి.

3.      మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను విస్తరించి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి. వేతనం పెంచాలి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా తేవాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భత్యం చెల్లించాలి.

4.      అంతర రాష్ట్ర (ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి) వలస కార్మిక ( ఉద్యోగిత మరియు సర్వీసు కండిషన్ల నియంత్రణ)   చట్టం  1979 ను రద్దు చేసే ప్రతిపాదనని విరమించాలి. ఇంతేగాక ఈ చట్టాన్ని మరింత మెరుగు పరచాలి.

5.      ప్రజారోగ్యానికి  కేంద్ర ప్రభుత్వము చేసే ఖర్చును అది జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి)  లో 3 శాతం గా వుండేలా పెంచాలి. ప్రాథమిక దశ నుండి తృతీయ స్థాయి  ట్రీట్మెంటు కోసం ప్రభుత్వము నిర్వహించే ఆరోగ్య రక్షణ వ్యవస్థను పటిష్ఠ వంతం చేయాలి. 

6.      ఆహార ధాన్యాల వ్యాపారుల లాభాల కోసం ఒక రాష్ట్రం నుండి మరో రాష్టానికి ఆహార ధాన్యాలు తరలించెందుకు వీలు కల్పించే ఉద్దేశం తో   అత్యవసర సరుకుల చట్టం రద్దు చేయుటకు మరియు ఎ పి ఎం సి చట్టం ను సవరించెందుకు తెచ్చిన  ఆర్డినేన్సులను రద్దు చేయాలి.

7.       కార్మిక చట్టాలను కార్మికులకు వ్యతిరేకముగా మార్చేందుకు, అమలు కాకుండా చేసేందుకు, చేస్తున్న ప్రతిపాదనలను రద్దు చేయాలి.

8.      ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను, ప్రత్యేకించి రైల్వేలో, మరియు ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, బొగ్గు, బ్యాంకులు, ఇన్సూరెన్సు , రక్షణ రంగ ఆయుధాలు మరియు పరికరాల ఉత్పత్తి రంగాలలో విరమించాలి.

9.      ప్రధాన మంత్రి పేరుతో ఏర్పాటు చేయబడిన ప్రయివేటు  ట్రస్ట్ ఫండ్ కు చెల్లించబడిన నిధులను కోవిడ్ 2019 కు వ్యతిరేకముగా జరుగుతున్న పోరాటం లో మొదటి వరుసలో వుంటున్నాయి కాబట్టి రాష్ట్రాలకు బదిలీ చేయాలి.

10.   కోవిడ్ మహమ్మారిని నిర్మూలించేందుకోసం విపత్తుల మేనేజిమెంటు చట్టాన్ని ముందుకు తెచ్చారు కాబట్టి కోవిడ్ వలన మృతి చెందిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తుల సహాయ నిధి చట్టం లో వున్న రూల్సు ననుసరించి  ఆర్థిక సహాయాన్ని వన్ టైమ్ మేజర్ గా (ఒక్క సారికి మాత్రమే అందించేది)  అందించాలి.

11.   ఎస్ సి/ఎస్ టి/ఓబీసీ రిజర్వేషన్లను పకడ్బందీగా  అమలు చేయాలి. బ్యాక్ లాగ్ వేకెన్సీ లను భర్తీ చేయాలి.

12.   గ్రాడ్యువేట్ మరియు పోస్ట్ గ్రాడ్యువేట్  కోర్సుల ఆఖరు సంవత్సరం లో వున్న వారికి అంతకి ముందు సెమిస్టర్  లో వచ్చిన మార్కుల ప్రకారం ఉత్తీర్ణులైన వారిని ఈ కోర్సులలో ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించాలి.

13.   జమ్ము & కాశ్మీర్ లో ఆగస్టు 2019 నుండి డిటెయిన్ చేయబడిన వారిని వెంటనే విడుదల చేయాలి. కమ్యూనికేషన్లను పూర్తిగా పునరుద్ధరించాలి. ప్రజలని స్వేచ్ఛగా తిరగనివ్వాలి.

14.   భయంకరమైన యూ‌ఏ‌పి‌ఏ, ఎన్ ఎస్ ఎ, విద్రోహ చట్టం వంటి చట్టాల పేరుతో జమ్ము & కాశ్మీర్ లో డీటెయిన్ చేయబడిన రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయాలి.

15.   “ఎన్విరాన్ మెంటల్  ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020” ని ఉపసంహరించాలి.

16.   దళితులపై కుల దురహంకారం తో దాడులు చేసే వారిని,  ఇంటి పని చేసే వారు మరియు మహిళల  పై లైంగిక హింస కు పాల్పడే వారిని, గిరిజన ప్రజలను దోచుకునే వారిని శిక్షించాలి. 

****

 

3 comments:

  1. Very great sir. Jai asokbabugaru. Long live under your leadership sir ✊✊✊

    ReplyDelete
  2. Very great sir. Jai asokbabugaru. Long live under your leadership sir ✊✊✊

    ReplyDelete