Wednesday, April 22, 2015

బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణ కోసం ఏప్రిల్ 21, 22 న జరిగిన రెండు రోజుల సమ్మె కి మద్దతుగా లోక్ సభలో ప్రసంగించిన సి పి ఎం సభ్యులు



బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు, అధికారులు అందరూ బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాలబారినుండి కాపాడాలని కోరుతూ 2015 ఏప్రిల్ 21,22న దేశ వ్యాపితంగా సమ్మె చేశారు. ఈ సమ్మె 100 శాతం జయప్రదమయింది. ఈ సమ్మె కి మద్దతుగా సి పి ఎం లోక్ సభ సభ్యులు శ్రీ శంకర్ ప్రసాద్ దత్తా (త్రిపుర-పశ్చిమం) 22.4.2015న జీరో అవర్ లో ప్రత్యేక ప్రస్తావన గా ప్రసంగించారు. శ్రీ శంకర్ ప్రసాద్ దత్త ప్రత్యేక  ప్రస్తావన  లోక్ సభ వెబ్ సైట్ ప్రకారం ఈ క్రింది విధముగా వున్నది:
“శ్రీ శంకర్ ప్రసాద్ దత్తా (త్రిపుర వెస్ట్): గౌరవనీయులైన మేడమ్ అధ్యక్షా, నిన్న, ఈ రోజు బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు సమ్మె లో ఉన్న సంగతి మనకందరకు తెలుసు. వారి డిమాండ్ ఏమిటి?  వారి ప్రధాన డిమాండ్ బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడాలని. బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడాలని కోరుతున్నారు. 20 డిమాండ్స్ తో సమ్మె చేస్తున్నారు. బి ఎస్ ఎన్ ఎల్ ఆవిర్భవించినప్పుడు 3.5 లక్షల ఉద్యోగులున్నారు. ఇప్పటికే అందులో 1.4 లక్షల మంది రిటైరయ్యారు. 2.25 లక్షల ఉద్యోగులే వున్నారు. 2007 వరకూ బి ఎస్ ఎన్ ఎల్ లాభాలతో నడిచింది. మొత్తంగా దాదాపు 48000 కోట్లు లాభం వచ్చింది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ ను ఎం టి ఎన్ ఎల్ తో విలీనం చేయ వద్దని  ఉద్యోగులు కోరుతున్నారు. వారి ఇతర డిమాండ్స్ కొన్ని-- ఖాళీగా వున్న డైరెక్టర్స్ పోస్టులు భర్తీ చేయాలని, రు.6700 కోట్లు స్పెక్ట్రమ్ చార్జి రీఫండ్ చేయాలని, బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ ఉచితముగా కేటాయించాలని, ఖాళీ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంటు జరపాలని. ప్రభుత్వము వారి కొరికలని పరిశీలిస్తుందని, బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడుతుందని, తద్వారా దేశ ప్రయోజనాలను కాపాడుతుందని ఆశిస్తున్నాను.”
స్పీకర్: “శ్రీ శంకర ప్రసాద్ దత్తా చేసిన ఈ ప్రస్తావనతో కలిసేందుకు శ్రీ ఎడ్వొకేట్ జాయిస్ జార్జి, శ్రీ పి.కె.బిజూ, శ్రీ జితేంద్ర చౌదరి, శ్రీ ఏ.సంపత్, మరియు శ్రీ పి.కరుణాకరన్ లను అనుమతిస్తున్నాను.”
పైన ప్రస్తావించిన వారందరూ సి పి ఎం పార్లమెంటు సభ్యులే.  


No comments:

Post a Comment