Saturday, April 11, 2015

మే 26న కార్మిక సంఘాల జాతీయ సదస్సు

9.4.2015న ఢిల్లీలో ఐ ఎన్ టి యు సి కార్యాలయం లో కేంద్ర కార్మిక సంఘాలు BMS, INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, UTUC, LPF లు సమావేశమయ్యాయి. కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఈ సమావేశం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. శ్రమ జీవుల జీవితాలపై ఈ విధానాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని సమావేశం భావించింది. ఈ విధానాలకు వ్యతిరేకముగా జరిగిన పోరాటాలను ఈ సమావేశం సమీక్షించింది.  ఈ విధానాలకు వ్యతిరేకముగా దేశ వ్యాపితముగా మరింత తీవ్రమయిన  సమైక్య పోరాట కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం వున్నదని ఈ సమావేశం భావించింది. దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె తో సహా ప్రత్యక్ష పోరాట కార్యక్రమాన్ని నిర్ణయించేందుకు మే 26,2015న ఢిల్లీ లో కార్మికుల జాతీయ సదస్సు జరపాలని ఈ సమావేశం నిర్ణయించింది. 

No comments:

Post a Comment