Tuesday, April 21, 2015

21.4.2015 వార్తలు-విశేషాలు

21.4.2015 వార్తలు-విశేషాలు
  • నేడు, రేపు (21,22 ఏప్రిల్ 2015) బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణ కోసం బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల, అధికారుల సమైక్య సమ్మె-ప్రభుత్వ విధానాలే బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలాకు కారణం- దేశ భక్తుడిలాగా ఫోజు పెడుతున్న మోడి,  బి ఎస్ ఎన్ ఎల్ ను నిర్వీర్యం చేసే కాంగ్రెస్ విధానాలనే కొనసాగిస్తూ టెలికాం రంగం లో జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించేందుకు తోడ్పడుతున్నాడు- సమ్మె నోటీసునిచ్చి నెల రోజులు పైనే అవుతున్నప్పటికి యూనియన్ల ఐక్య వేదికతో చర్చించేందుకు ప్రభుత్వానికి తీర లేదు- 25.4.2015న చర్చలకు డి ఓ టి 20వ తారీఖు సాయంత్రం ఆహ్వానించి 21,22 సమ్మె వాయిదా వేయాలని కోరింది- ఐక్య వేదిక ఇందుకు నిరాకరించింది-సమ్మేని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది-సమ్మె జయప్రదం చేసి తద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి 25న జరిగే చర్చలలో ఫలితం వచ్చేలా చేయాల్సిన బాధ్యత బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు, అధికారులు అందరిపై వున్నది.
  • “సూటు బూటు సర్కార్” –మోడి ప్రభుత్వం పై రాహుల్ విమర్శ –భూసేకరణ ఆర్డినేన్సు తెచ్చి రైతుల అనుమతి లేకుండానే వారి భూములను కార్పొరేట్సుకు కట్టబెడుతున్నట్లు మోడి పై విమర్శ- ప్రజలలో కోల్పోయిన అభిమానాన్ని సంపాదించుకునే ఎత్తుగడ యిది-ఇదే కాంగ్రెస్ పార్టీ బి జె పి తో కుమ్మక్కై ఇన్సూరెన్సు రంగం లో ఎఫ్ డి ఐ పరిమితి 26 నుండి 49 శాతం కు పెంచేందుకు, బొగ్గు గనుల ప్రయివేటీకరణకు చట్టాలు చేయటం లో తోడ్పడింది-కాంగ్రెస్ అనుసరించిన నయా ఉదార వాద ఆర్థిక విధానాలను, ఆ విధానాలలో భాగం గా జరిగిన అవినీతిని ప్రజలు తిరస్కరించారు-కానీ బి జె పి ని గెలిపించి అదే ప్రమాదం మరింత భారీగా కొనితెచ్చుకున్నట్లయింది-కాంగ్రెస్ కు బి జె పి లేదా బి జె పి కి కాంగ్రెస్ నిజమయిన ప్రత్యామ్నాయం కాదు-వామపక్ష ప్రజాతంత్ర శక్తులే నిజమయిన ప్రత్యామ్నాయం.
  • “మహిళలను వేధించటం పురుషుల హక్కు!”-మహిళలను వేధించినందుకు అరెస్ట్ అయిన వారి అభిప్రాయం-సైబరాబాద్ పోలీస్” షి”  టీం సర్వే లో వెల్లడయిన వాస్తవం –మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నందునే వారిపై వేధింపులు ఎక్కువవుతున్నాయని వారి అభిప్రాయం- పితృస్వామిక సమాజం భావజాలం మహిళలకి వ్యతిరేకముగా, వారిని తక్కువగా చూసే విధముగా ఏ స్థాయిలో వున్నదో ఇది రుజువు చేస్తున్నది. ఛత్తీస్ఘర్ రాష్ట్రం లో రాయిపూర్ జిల్లా మోదా గ్రామ మహిళా సర్పంచ్ గీతా ప్రహ్లాద్  ని హత్య చేశారు. అందుకు కారణం ఆమె తన తల్లి చితికి నిప్పు అంటించటమే. ఆమె సోదరుడు బాధ్యత తీసుకోనందున తల్లి తండ్రులను చూసే బాధ్యతని ఆమె నెరవేర్చింది. అందుకనే తల్లి చిటికి ఆమె నిప్పు అంటించింది. కానీ పురుషాధిక్య సమాజానికి ఇది నచ్చ లేదు. అందుకనే ఆమె సోదరుడు ఆమెని హత్య చేసినట్లు వార్త.
  • 555.89 పాయింట్లు భారీగా పతనమయిన స్టాక్ మార్కెట్ సూచిక- ఇందుకు కారణం దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుండి కోలుకోటం చాలా బలహీనముగా వున్నదని, కార్పొరేట్సు ఆదాయాలు తగ్గాయని వచ్చిన వార్తలు.  ఎఫ్ ఐ ఐ (ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) పై మాట్ (మినిమమ్ ఆల్టర్నేట్ టాక్స్) గతం నుండి వర్తించే విధముగా ఆదేశాలు ఇవ్వటం కూడా ఇందుకు తోడయిందని పత్రికల కథనం. మోడి ప్రభుత్వం  కార్పొరేట్సుకు ఎన్ని రాయితీలిచ్చినా అవి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడటం లేదని ఇది రుజువు చేస్తున్నది. దీనిని అవకాశం గా తీసుకుని తమకి మరిన్ని రాయితీలివ్వాలని వారు ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగం గానే మాట్ ను గతం నుండి వసూలు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్సు కి రాయితీలు, ప్రభుత్వ రంగాన్ని అందుకు అమ్మటం, ప్రజాసంక్షేమానికి కోత పెట్టటం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టటం –ఇది మోడి పాలన సారాంశం.
సంస్కృతి

  • రంగూ-రూపం : దృశ్య జగత్తులోని ప్రతి వస్తువు ఏదో రంగును కలిగి వుంటుంది. అదే విధంగా ప్రతి రంగూ ఏదో ఒక రూపాన్ని కలిగి వుంటుంది. రూపం, రంగూ రెండూ లేనప్పుడు దృశ్య జగత్తే వుండదు. రంగు నుంచి రూపం, రూపం నుంచి రంగు వేరు చేయబడి చూడబడగలవా అంటే “అవును”, “కాదు” అని రెండు జవాబులు వస్తవి. రంగు నుంచి రూపాన్ని విడదిస్తే రూపం కంటికి ఏ విధంగా కనిపిస్తుంది? రంగు ఉంటేనే కంటికి రూపం గోచరించేది. రంగు అంటే కాంతి. కాంతి లేని రూపం కంటికెలా కనిపించగలదు? అదే విధంగా రూపం నుంచి రంగును విడదిస్తే, అసలు రంగు అనే దానికి అస్తిత్వం ఎక్కడిది? కంటికి రంగు ఏదో రూపం లో గుండ్రంగానో, సొగగానో, చదరంగానో మరో ఇంకొక రూపం లోనో గోచరించాల్సిందే-కనుక రంగు లేని రూపం, రూపం  లేని రంగు వుండటం అంటే వుండకపోవటమే అవుతుంది వస్తుగత దృష్టితో పరికిస్తే. అయితే, వ్యక్తిగత దృష్టితో పరిశీలిస్తే మాత్రం స్వతంత్రంగా రెండు వేరు వేరుగా వున్నట్లు మనం అనుభూతి చెంద గలం. వస్తుగత దృష్టి వాస్తవ అస్తిత్వాన్ని చూపితే, వ్యక్తిగత దృష్టి అనుభూతి మూలకమయిన సంవేదనను (sensation) చూపుతుంది.”.....సంజీవ దేవ్ 

No comments:

Post a Comment