Sunday, April 26, 2015

భూకంప మృతుల కుటుంబాలకు, బాధితులకు సానుభూతి; అంతర్జాల తటస్థత (నెట్ న్యూట్రాలిటీ) ని సమర్తిస్తున్నాము, కానీ డేటా టారిఫ్ ను 6 రేట్లు పెంచాల్సి వస్తుంది-ప్రయివేటు టెలికాం ఆపరేటర్ల వితండ వాదం; అభివృద్ధి పేరుతో భూమిని బలవంతంగా లాక్కోటం సమంజసమా?

భూకంప మృతుల కుటుంబాలకు, బాధితులకు సానుభూతి
ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారాం భూకంపం వలన నేపాల్ లో 1500 మంది, భారత దేశం లో 51 మంది చని పోయారు. అనేక మండి నిర్వాసితులయ్యారు. రిక్టర్ స్కేలు పై 7.9 ప్రమాణం లో భూకంపం రావటం నేపాల్ లో 80 సంవత్సరాల తరువాత ఇదే మొదటి సారి. భూకంపం లో చని పోయిన వారి కుటుంబాలకు ప్రపంచ ప్రజాలండరు సానుభూతిని తెలియజేస్తున్నారు. గాయ పడిన వారికి, నిర్వాసితులకు అవసరమయిన సహాయాన్ని వెంటనే అందించటానికి నేపాల్ తో పాటు భారత దేశం తదితర అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. బి ఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్ నుండి నేపాల్ కు చేసే కాల్స్ కు మూడు రోజులపాటు లోకల్ ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని బి ఎస్ ఎన్ ఎల్ నిర్ణయించింది. నేపాల్ కు ఒక కాల్ కు సాధారణంగా రు. 10 అవుతుంది.  అందుకు బదులు లోకల్ కాల్ రేట్ నే 3 రోజుల పాటు బి ఎస్ ఎన్ ఎల్ వసూలు చేస్తుంది.
అంతర్జాల తటస్థత (నెట్ న్యూట్రాలిటీ) ని సమర్తిస్తున్నాము, కానీ డేటా టారిఫ్ ను 6 రేట్లు పెంచాల్సి వస్తుంది-ప్రయివేటు టెలికాం ఆపరేటర్ల వితండ వాదం
అంతర్జాలం (ఇంటర్నెట్)  ద్వారా ఏ  వెబ్ సైట్ ను చూసినా, వాట్సప్, స్కైప్ తదితర వెబ్సైట్స్ ద్వారా మెసేజ్ లు, కాల్స్ చేసినా ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేయక పోవటం నెట్ న్యూట్రాలిటీ. ఇంటర్నెట్ కు అయ్యే సాధారణ చార్జి మినహా కొన్ని వెబ్ సైట్స్ వాడినందుకు ప్రత్యేకంగా, అదనంగా ఛార్జీలు వసూలు చేయకూడదనటం నెట్ న్యూట్రాలిటీ. టి ఆర్ ఏ ఐ ఈ విషయాన్ని అధ్యయనం చేసేందుకు ప్రజల నుండి అభిప్రాయాలను ఆహ్వానిస్తూ విడుదల చేసిన పత్రం నెట్ న్యూట్రాలిటికి వ్యతిరేకంగా వున్నది. దీని పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. లక్షలాది మండి నెట్ న్యూట్రాలిటిని సమర్థిస్తూ టి ఆర్ ఏ ఐ కి మెయిల్స్ పంపారు. దీనితో అప్పటి వరకూ నెట్ న్యూట్రాలిటిని వ్యతిరేకించిన ప్రయివేట్ టెలికాం ఆపరేటర్లు  తమ బాణీ మార్చారు. తాము కూడా నెట్ న్యూట్రాలిటిని సమర్తిస్తున్నామని అంటున్నారు. కానీ ఒక మెలిక పెడుతున్నారు. తమకి వర్తించే రూల్సునే ఓ టి టి (ఓవర్ ది టాప్ ) ప్లేయర్లకు (స్కైప్, వాట్సప్ వంటివి ఓవర్ ది టాప్ ప్లేయర్స్, అనగా ఇతర కంపెనీల ఇంటర్నెట్ నెట్ వర్క్ ను వినియోగించి తమ వెబ్ సైట్స్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించేవి) కూడా వర్తింపజేయాలంటున్నారు. అంటే తమకి కాల్స్ పై వచ్చే ఆదాయం పై ఏ విధముగా ప్రభుత్వము ఛార్జీలు వసూలు చేస్తున్నారో  అదే విధముగా వాట్స్ అప్ ద్వారా వెళ్ళే కాల్స్ పై కూడా ఛార్జీలు విధించాలని వీరు కోరుతున్నారు. అంటే వాట్స్ అప్ తదితరాలను కాల్స్ చేయటానికి వాడితే వాటి పై కూడా చార్జీలు వసూలు చేయాలని వీరి వాదం. అలా కాకుంటే ఇంటర్నెట్ వాడకం రేట్లను 6 రేట్లు పెంచాలని వీరు కోరుతున్నారు. వీరి వాదన సామంజసం కాదు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాని ప్రయోజనం ప్రజలకు దక్కాలి. ఇంటర్నెట్ పై వాట్స్ అప్ ద్వారా కాల్స్ చేసేటప్పుడు టెలికాం ఆపరేటర్లకు ఇంటర్నెట్ ఛార్జీలు వస్తాయి. కాబట్టి వాట్స్ అప్ తదితరాల వలన ఇంటర్నెట్ వాడకం పెరిగి టెలికాం ఆపరేటర్ల ఆదాయం పెరుగుతుంది. వాస్తవం ఇది కాగా ప్రయివేటు టెలికాం ఆపరేటర్లూ వితండంగా వాదిస్తున్నారు. ప్రయివేట్ టెలికాం ఆపరేటర్లూ ప్రతిదీ తమ లాభాపేక్ష దృస్ష్టితోనే చూస్తారని, ప్రజల ప్రయోజనాలు వారికి పట్టవని ఇది రుజువు చేస్తున్నది.
అభివృద్ధి పేరుతో భూమిని బలవంతంగా లాక్కోటం సమంజసమా?
రోడ్లు, రైలు మార్గాలు, పరిశ్రమలు భూమి పైన కాకుండా ఆకాశాన నెలకొల్పుతామా? అభివృద్ధి కోసం చేస్తున్న భూసేకరణని వ్యతిరేకించటం అంటే అభివృద్ధిని వ్యతిరేకించటమే. ఇదీ జరుగుతున్న ప్రచారం. నిజమే కదా అని కొందరికి అనిపిస్తుంది.
కానీ భూసేకరణ నిజముగా అభివృద్ధి కోసమే జరుగుతున్నదా? ఎవరినుండయితే భూమిని సేకరిస్తున్నారో వారికి అభివృద్ధి అవసరం లేదా? వుంటే ఆ అభివృద్ధి ఫలితాలు తమకి దక్కుతాయని వారిని అంగీకరింపజేసి ఆ విధముగా వారి ఆమోదంతో భూమిని సేకరించవచ్చు గదా. మరి మోడి ప్రభుత్వము రైతుల ఆమోదం లేకుండానే ప్రాజెక్టులకు భూమిని సేకరించవచ్చునని 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్సు ఎందుకు జారీ చేసింది? 2013 భూసేకరణ చట్టం లో ఏదయినా ప్రాజెక్టుకు భూసేకరణ చేయాలంటే దానివలన సమాజం పై ఎటువంటి ప్రభావం పడుతుందో ముందుగా పరిశీలించాలని వున్నది. ఆహారభద్రత, పర్యావరణలకు హాని కలుగుతుందా? తదితర అంశాలను పరిశీలించాలి. కానీ మోడి ప్రభుత్వము ఈ నిబంధన అవసరం లేదని భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినేన్సు జారీ చేసింది. అభివృద్ధి అనే దానికి ఆహార బఃద్రత, పర్యావరణ పరిరక్షణ లతో సంబంధం లేదా? వాటి అవసరం లేదా? ఆహార భద్రత, పర్యావరణం లను ధ్వంసం చేసేది అభివృద్ధి అవుతుందా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు ప్రాజెక్టుల కోసం 6 కోట్ల మండి ప్రజాలు తమ భూముల నుండి తొలగించబడ్డారు. కానీ వారిలో 3వ వంతు కి మాత్రమే సరయిన పునరావాసం లభించింది. అత్యధికుయాల్కు సరయిన పునరావాసం లభించ లేదు. అభివృద్ధి పేరుతో ఈ విధముగా తొలగించబడియన్ వారిలో 40 శాతం ఆది వాసిలు, 20 శాతం దళితులు. సమాజపు అట్టడుగున వున్న వీరిని అభివృద్ధి పేరుతో తగు పునరావాసం లేకుండా తోల్గించి మరిన్ని ఇబ్బందులు కలిగించటం న్యాయమా?  
అభివృద్ధి పేరుతో సేకరించిన భూమిని సక్రమముగా ఉపయోగించటం లేదని కూడా రుజువవుతున్నది. సి ఏ జి ఇటీవల చేసిన  అధ్యయనం ప్రకారం 2006 నుండి 2013 వరకు సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్) లకు సేకరించిన 60000 హెక్టార్ల భూమి లో 53 శాతం నిరుపయోగముగా పడి  వున్నది. నష్ట పరిహారం  అతి తక్కువగా ఇచ్చి ఈ విధముగా సేకరించిన భూమిని ప్రైవేట్ బిల్డర్స్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ఈ దుర్వినియోగాన్ని అరికట్టే విధముగా వునండి. ఏ ప్రయోజనం కోసమయితే సేకరించారో ఆ ప్రయోజనం నెరవేరనప్పుడు ఆ భూమిని ఎవరి నుండయితే సేకరించారో వారికి తిరిగి ఇచ్చి వేయాలని ఈ చట్టం చెప్పింది. కానీ మోడి ప్రభుత్వము ఈ నిబంధనని తొలగిస్తూ ఆర్డినేన్సు జారీ  చేసింది!
ప్రజల ఆమోదం లేకుండా వారినుండి భూములు స్వాధీనం చేసుకునే విధానం వలన ప్రాజక్టులు మరింత జాప్యం అవుతాయి. ఎందుకంటే ప్రజలు ప్రతిఘటిస్తారు కాబట్టి. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధికి అవసరమయిన భూమిని సేకరించేందుకు ప్రజలకి అనుకూలమయిన విధానాలు అవలంబించాలి.
అనేక అనుభవాలు, పోరాటాల తరువాత యు పి ఏ ప్రభుత్వము బ్రిటిష్ కాలం  నాటి 1884 భూసేకరణ చట్టం ను సవరించి రైతులకు, ఆదివాసీలకు, దళితులకు అనుకూలముగా వుండే కొన్ని అంశాలతో 2013 భూసేకరణ చట్టాన్ని  చేసింది. ఆ నాడు ప్రతిపక్షం లో వున్న బి జె పి కూడా ఇందుకు మద్దతునిచ్చింది. కానీ అదే బి జె పి ఇప్పుడు తాను అధికారం లోకి వచ్చాక భూసేకరణ చట్టాన్ని రైతులకు, ఆదివాసీలకు, దళితులకు  వ్యతిరేకముగా మారుస్తూ  ఆర్డినేన్సు తెచ్చి ప్రజా వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నది. 

ప్రజలకి వ్యతిరేకముగా, కార్పొరేట్సుకి  అనుకూలముగా మోడి ప్రభుత్వము చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నదని ఇది రుజువు చేస్తున్నది. 

No comments:

Post a Comment